అన్వేషించండి

Nizamabad News : ప్రాణం తీసిన చేపల వేట సరదా, చెక్ డ్యాంలో పడి ఇద్దరు బాలికలు మృతి

Nizamabad News : నిజామాబాద్ జిల్లా కొలిప్యాక్ గ్రామంలో విషాదం నెలకొంది. చేపల పట్టేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు చెక్ డ్యాంలో పడి చనిపోయారు.

Nizamabad News : చేపల వేట సరదా ఇద్దరు బాలికలను బలిగొంది. నీటిలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండల పరిధిలోని కొలిప్యాక్ గ్రామంలో చోటుచేసుకుంది. కొలిప్యాక్ గ్రామ శివారులోని చెక్ డ్యామ్ లో చేపలు పట్టేందుకు కృష్ణవేణి, మౌనిక, శిరీష అనే ముగ్గురు బాలికలు కలిసి వెళ్లారు. శిరీష ఒడ్డు పైనే కూర్చుని ఉండగా, మౌనిక, కృష్ణవేణి చేపల కోసమని నీటిలో దిగారు. నీటి లోతును గమనించని మౌనిక, కృష్ణ వేణి ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. మౌనిక (14) ఏడో తరగతి చదువుతుంది. తండ్రి గంగాధర్ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కృష్ణవేణి (13) కూడా 7వ తరగతి చదువుతుంది. తండ్రి గంగారాం కూలి పనిచేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. 

అప్పటి వరకూ కళ్ల ముందే 

చనిపోయిన బాలికలిద్దరూ స్నేహితులు. చేపల వేట సరదా కోసం వెళ్లిన బాలికలు ఇలా మృత్యువాత పడటంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణ వేణి, మౌనిక నీళ్లలో మునిగిపోవటాన్ని గమనించిన శిరీష అరుస్తూ పరుగులు తీసింది. చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోవడంతో పరుగులు తీస్తూ గ్రామంలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులకు చెప్పడంతో చెక్ డ్యాం వద్దకు వచ్చి గాలించారు. అప్పటికే బాలికలిద్దరూ చనిపోయారు. ఈతగాళ్లతో  బాలికల మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు స్నేహితురాళ్లు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అప్పటి వరకు కళ్ల ముందే ఉన్న తమ పిల్లలు ఒక్కసారిగా విగత జీవులుగా పడిఉండడంపై ఆ బాలికల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

Nizamabad News : ప్రాణం తీసిన చేపల వేట సరదా, చెక్ డ్యాంలో పడి ఇద్దరు బాలికలు మృతి

విహార యాత్రలో విషాదం

ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన ఓ యువకుడు స్పీడ్ బోటు ప్రమాదంలో మృతి చెందాడు.  కరీంనగర్‌లోని సుభాష్ నగర్ చెందిన పాతికేళ్ల కంటె యశ్వంత్ కుమార్.. గత డిసెంబర్‌లో అమెరికా వెళ్లాడు. అమెరికాలోని పోలిడలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. వారాంతపు సెలవులు కావడంతో మిత్రులతో కలిసి ఆదివారం ఫ్లోరిడా సమీపంలోని ఓ ద్వీపానికి వెళ్లాడు. అక్కడ స్పీడ్ బోటులో విహారయాత్ర చేశారు. విహారయాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో యువకులు స్వయంగా నడుపుతున్న బోటు ఆగిపోయింది. అప్పుడు ఆ బోటులో యశ్వంత్‌తోపాటు మరో యువకుడు ఉన్నాడు. బోటు ఆగిపోయిందని తెలుసుకున్న ఇద్దరు కూడా దూకి ప్రాణాలు కాపాడుకుందామనుకున్నారు. అనుకున్నట్టుగానే తోటి యువకుడు ఈత కొడుతూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. యశ్వంత్ మాత్రం సముద్రంలో చిక్కుకున్నాడు. బయటకు రాలేకపోయాడు. సముద్రంలో మునిగిపోయిన యశ్వంత్‌ మృత దేహం సోమవారం సాయంత్రం బయటపడింది. 

సోమవారం మృతదేహం లభ్యం

ప్రమాదం జరిగిన వెంటనే విషయాన్ని ఫ్యామిలీకి చేరవేశారు యశ్వంత్ ఫ్రెండ్స్. గల్లంతైన యశ్వంత్ కోసం వెతుకుతున్నాని చెప్పారు. సోమవారం సాయంత్రానికి యశ్వంత్ చనిపోయినట్టు సమాచారం అందించారు. మృతదేహం కూడా లభించిందని తెలిపారు. యశ్వంత్ మరణ వార్త విన్న కన్నవారు బోరున విలపిస్తున్నారు. యశ్వంత్ తండ్రి మల్లేశం చందుర్తిలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈ వార్త యశ్వంత్  ఫ్యామిలీలోనే కాదు కరీంనగర్‌లోని తీవ్ర విషాదం నింపింది.

టాప్ హెడ్ లైన్స్

West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌- ఆరుగురు జాలర్లపై ఆశలు గల్లంతు, రూ.10 లక్షల పరిహారం
ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌- ఆరుగురు జాలర్లపై ఆశలు గల్లంతు, రూ.10 లక్షల పరిహారం
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
Best Mileage Cars: కిలోమీటరుకు కేవలం ₹2.68 మాత్రమే ఖర్చయ్యే కార్లు ఇవే! నెలవారీలో ఎంత ఆదా అవుతుంది? 
కిలోమీటరుకు కేవలం ₹2.68 మాత్రమే ఖర్చయ్యే కార్లు ఇవే! నెలవారీలో ఎంత ఆదా అవుతుంది? 
Embed widget