అన్వేషించండి

Andhra News: దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం

Extreme Tragedies: ఏపీలో పండుగ పూట తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

Extreme Tragedies In Andhrapradesh: దీపావళి పండుగ రోజున ఏపీలో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఏలూరులో (Eluru) ఓ వ్యక్తి బాణాసంచా తీసుకెళ్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన నగరంలోని తూర్పు వీధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుధాకర్ అనే వ్యక్తి బైక్‌పై ఉల్లిపాయ బాంబుల బస్తా తీసుకెళ్తున్నాడు. గంగానమ్మ ఆలయం సమీపంలోకి వచ్చేసరికి రోడ్డుపై గుంత కారణంగా బైక్‌పై నుంచి బస్తా కింద పడింది. ఈ క్రమంలో భారీ పేలుడు  సంభవించి అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

విశాఖలో అగ్నిప్రమాదం

అటు, విశాఖ జైలు రోడ్డులో ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలో మంటలు చెలరేగగా.. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని 3 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. మంటల్లో కంప్యూటర్లు, విలువైన డాక్యుమెంట్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, దీపావళి రోజున సెలవు కావడంతో సిబ్బంది సైతం ఎవరూ లేకపోవడం మంటలు చెలరేగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిగిన తర్వాతే వివరణ ఇస్తామని అధికారులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీకొని..

ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని తల్లీకుమార్తెలు మృతి చెందిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో చోటు చేసుకుంది. శిరీష అనే మహిళ తన తల్లి వజ్రమ్మను విజయవాడ ప్యాసింజర్ రైలు ఎక్కించేందుకు కావలి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. పట్టాలు దాటుతున్న క్రమంలో వజ్రమ్మ 3వ ప్లాట్‌ఫాం ఎక్కలేకపోవడంతో.. శిరీష సాయం చేయబోయింది. ఇంతలో వేగంగా వచ్చిన కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇద్దరినీ ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైల్వే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు

మరోవైపు, గురువారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లంబసింగి ఘాట్ రోడ్డులో వ్యాన్, బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అటు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం ఆత్కూర్ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ, ఆటో ఢీకొని డ్రైవర్ సహా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అటు, విశాఖ జిల్లా పద్మనాభం మండలం కురపల్లి గ్రామంలో ఓ ప్రైవేటు రిసార్టులో పుట్టినరోజు వేడుకలు విషాదం నింపాయి. స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అభిషేక్ వంశీ (24) అనే వ్యక్తి మద్యం తాగి స్విమ్మింగ్ ఫూల్‌లో దిగి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఎంవీపీ కాలనీగా చెందినవాడిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Yadadri Crime News: భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం
భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Hyundai India : హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
Embed widget