అన్వేషించండి

Honor Killing Case: పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు

Pranay honor killing case | పరువుహత్య కేసులో నిందితుడికి నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 2018 సెప్టెంబర్ లో ప్రణయ్ ను అమృత తండ్రి మారుతీ రావు హత్య చేయించాడు.

Honor Killing Case in Miryalaguda | నల్గొండ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ1 మారుతీ రావు గతంలో ఆత్మహత్య చేసుకోగా, ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఈ కేసులో మిగతా నిందితులకు జీవిత ఖైదు విధించారు. హార్ట్ పెషేంట్స్ అని, కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగోలేదని, చిన్న పిల్లలు ఉన్నారని.. శిక్ష తగ్గించాలని నేరస్తులు న్యాయమూర్తిని వేడుకున్నారు. కానీ కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి ఏ2కు ఉరిశిక్ష, ఏ3 నుంచి ఏ8 నేరస్తులకు జీవిత ఖైదు శిక్ష వేశారు.

కులాంతర వివాహం చేసుకున్నాడని హత్య

తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో మిర్యాలగూడకు చెందిన మారుతీరావు తన అల్లుడు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించాడు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీ తరువాత ఈ జంట రీల్స్, సోషల్ మీడియాలో పోస్టులతో మారుతీరావు కుటుంబం మరింత కుంగిపోయింది. అమృతది వైశ్య సామాజికవర్గం కాగా, ప్రణయ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు. దాంతో మిర్యాలగూడకు చెందిన మారుతీరావు అల్లుడు ప్రణయ్‌ ని పరువు హత్యకు ప్లాన్ చేశాడు. సుపారీ ఇచ్చి మరీ అల్లుడు ప్రణయ్ ను పరువుహత్య చేయించడం అప్పట్లో కలకలం రేపింది. దాదాపు 5 ఐదేళ్లకు పైగా విచారణ అనంతరం సోమవారం నాడు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు నిందితులకు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా అప్పటి నల్గొండ ఎస్పీగా ఏవీ రంగనాథ్ ఉన్నారు. ఇన్నేళ్ల తరువాత ప్రణయ్ హత్య కేసులో తీర్పు రావడం సంతోషంగా ఉందన్నారు.

సుపారీ ఇచ్చి మరీ దారుణం..

గర్భంతో ఉన్న అమృత తన భర్త ప్రణయ్, అత్త ప్రేమలతో కలిసి మిర్యాలగూడలోని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని, తిరిగి వెళ్తున్నారు. ఓ దుండగుడు వెనుక నుంచి ప్రణయ్ పై కత్తితో అటాక్ చేసి, విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ప్రణయ్ అక్కడే చనిపోయాడు. 2018 సెప్టెంబర్‌ 14న మారుతీ రావు తన అల్లుడు ప్రణయ్‌ను హత్య చేయించాడు. ప్రణయ్ హత్యపై కేసు నమోదు చేసుకున్న మిర్యాలగూడ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ప్రధాన నిందితుడు కావడంతో ఏ1గా ఉన్నాడు. సుభాష్‌కుమార్‌ శర్మ ఏ2, అస్గర్‌ అలీ ఏ3, బారీ ఏ4, కరీం ఏ5, శ్రవణ్‌కుమార్ ఏ6, శివ ఏ7, నిజాం ఏ8గా ఉన్నారు. పోలీసులు 2019లో ప్రణయ్ హత్యపై ఛార్జిషీటు దాఖలు చేశారు. ఐదేళ్లకు పైగా వాదనలు ముగిశాయి. 302, 120, 109, 1989 సెక్షన్ ipc, ఇండియన్ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష ఖరారు చేశారు.

2020లో ఏ1 ఆత్మహత్య..

ఏ1 మారుతీరావు 2020లో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఓవైపు అల్లుడ్ని చంపాడని కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లడం, మరోవైపు కుమార్తె అమృత, ఆమె అత్తామామలు చేస్తున్న కామెంట్లతో మనోవేదనకు గురై బలవన్మరణం చెందారు. ఏ2 సుభాష్ కు బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉన్నాడు. మరో నిందితుడు అస్గర్ అలీ మరో కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. మిగతా నిందితులు బెయిల్ రావడంతో బయటకు వచ్చారు.

Also Read: Crime News: వీడు కొడుకు కాదు, కాల యముడు! ఎవరైనా కన్నతల్లిని ఇంత దారుణంగా చంపుతారా ?

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget