అన్వేషించండి

Honor Killing Case: పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు

Pranay honor killing case | పరువుహత్య కేసులో నిందితుడికి నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 2018 సెప్టెంబర్ లో ప్రణయ్ ను అమృత తండ్రి మారుతీ రావు హత్య చేయించాడు.

Honor Killing Case in Miryalaguda | నల్గొండ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ1 మారుతీ రావు గతంలో ఆత్మహత్య చేసుకోగా, ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఈ కేసులో మిగతా నిందితులకు జీవిత ఖైదు విధించారు. హార్ట్ పెషేంట్స్ అని, కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగోలేదని, చిన్న పిల్లలు ఉన్నారని.. శిక్ష తగ్గించాలని నేరస్తులు న్యాయమూర్తిని వేడుకున్నారు. కానీ కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి ఏ2కు ఉరిశిక్ష, ఏ3 నుంచి ఏ8 నేరస్తులకు జీవిత ఖైదు శిక్ష వేశారు.

కులాంతర వివాహం చేసుకున్నాడని హత్య

తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో మిర్యాలగూడకు చెందిన మారుతీరావు తన అల్లుడు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించాడు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీ తరువాత ఈ జంట రీల్స్, సోషల్ మీడియాలో పోస్టులతో మారుతీరావు కుటుంబం మరింత కుంగిపోయింది. అమృతది వైశ్య సామాజికవర్గం కాగా, ప్రణయ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు. దాంతో మిర్యాలగూడకు చెందిన మారుతీరావు అల్లుడు ప్రణయ్‌ ని పరువు హత్యకు ప్లాన్ చేశాడు. సుపారీ ఇచ్చి మరీ అల్లుడు ప్రణయ్ ను పరువుహత్య చేయించడం అప్పట్లో కలకలం రేపింది. దాదాపు 5 ఐదేళ్లకు పైగా విచారణ అనంతరం సోమవారం నాడు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు నిందితులకు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా అప్పటి నల్గొండ ఎస్పీగా ఏవీ రంగనాథ్ ఉన్నారు. ఇన్నేళ్ల తరువాత ప్రణయ్ హత్య కేసులో తీర్పు రావడం సంతోషంగా ఉందన్నారు.

సుపారీ ఇచ్చి మరీ దారుణం..

గర్భంతో ఉన్న అమృత తన భర్త ప్రణయ్, అత్త ప్రేమలతో కలిసి మిర్యాలగూడలోని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని, తిరిగి వెళ్తున్నారు. ఓ దుండగుడు వెనుక నుంచి ప్రణయ్ పై కత్తితో అటాక్ చేసి, విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ప్రణయ్ అక్కడే చనిపోయాడు. 2018 సెప్టెంబర్‌ 14న మారుతీ రావు తన అల్లుడు ప్రణయ్‌ను హత్య చేయించాడు. ప్రణయ్ హత్యపై కేసు నమోదు చేసుకున్న మిర్యాలగూడ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ప్రధాన నిందితుడు కావడంతో ఏ1గా ఉన్నాడు. సుభాష్‌కుమార్‌ శర్మ ఏ2, అస్గర్‌ అలీ ఏ3, బారీ ఏ4, కరీం ఏ5, శ్రవణ్‌కుమార్ ఏ6, శివ ఏ7, నిజాం ఏ8గా ఉన్నారు. పోలీసులు 2019లో ప్రణయ్ హత్యపై ఛార్జిషీటు దాఖలు చేశారు. ఐదేళ్లకు పైగా వాదనలు ముగిశాయి. 302, 120, 109, 1989 సెక్షన్ ipc, ఇండియన్ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష ఖరారు చేశారు.

2020లో ఏ1 ఆత్మహత్య..

ఏ1 మారుతీరావు 2020లో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఓవైపు అల్లుడ్ని చంపాడని కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లడం, మరోవైపు కుమార్తె అమృత, ఆమె అత్తామామలు చేస్తున్న కామెంట్లతో మనోవేదనకు గురై బలవన్మరణం చెందారు. ఏ2 సుభాష్ కు బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉన్నాడు. మరో నిందితుడు అస్గర్ అలీ మరో కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. మిగతా నిందితులు బెయిల్ రావడంతో బయటకు వచ్చారు.

Also Read: Crime News: వీడు కొడుకు కాదు, కాల యముడు! ఎవరైనా కన్నతల్లిని ఇంత దారుణంగా చంపుతారా ?

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Jogi Ramesh Latest News:వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget