అన్వేషించండి

Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న

Crime News: ఏపీలో దారుణాలు చోటు చేసుకున్నాయి. బాపట్ల జిల్లాలో స్థల వివాదంతో సొంత బాబాయ్‌నే కొట్టి చంపేశారు. అటు, కాకినాడ జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి సొంత తమ్ముడినే నరికేశాడు.

Man Murder In Bapatla District: కుటుంబంలో నెలకొన్న స్థల వివాదంతో కొందరు సొంత బాబాయ్‌పైనే దాడికి పాల్పడగా అతను మృతి చెందాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా (Bapatla District) నగరం మండలం దాసరిపాలెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూషయ్య (48), ఆయన ఇద్దరు సోదరుల కుమారుల మధ్య ఇంటి స్థలం విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీంతో పాటు ఇరు కుటుంబాల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నాయి. ఈ క్రమంలోనే శనివారం రాత్రి భూషయ్యకు, ఆయన సోదరుల కుమారులకు మాటా మాటా పెరిగి.. వారు కర్రలతో భూషయ్యపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన భూషయ్యను కుటుంబసభ్యులు జీజీహెచ్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తమ్ముడిని చంపిన అన్న

అటు, కాకినాడ జిల్లాలో (Kakinada District) దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన తమ్ముడినే దారుణంగా నరికేశాడు. తాళ్లరేవు మండలం పి.మల్లవరానికి చెందిన వ్యక్తి కుటుంబ వివాదాలతో తమ్ముడిని నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఆన్ లైన్ బెట్టింగ్‌కు కుటుంబం బలి

మరోవైపు, చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. కొడుకు ఆన్ లైన్ బెట్టింగ్‌కు బానిసై రూ.లక్షల కొద్దీ అప్పులు చేయగా.. కుటుంబం బలైంది. కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు యత్నించగా.. ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో నాగరాజురెడ్డి (61) కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆయన ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా.. ప్రస్తుతం అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. అతని కుమారుడు దినేష్ చిత్తూరులో బీటెక్ చదువుతున్నాడు. చిత్తూరులో తల్లీకొడుకులిద్దరూ అద్దె ఇంట్లో ఉంటుండగా.. తండ్రి స్వగ్రామంలోనే ఉంటున్నాడు. నాగరాజురెడ్డి కుమార్తె సునీత రాజస్థాన్‌లో ఉద్యోగం చేస్తూ 3 నెలల కిందటే వచ్చింది.

కుమారుడు దినేష్ 'ఆన్ లైన్ బెట్టింగ్‌'లకు బానిసై రూ.20 లక్షల వరకూ అప్పు చేశాడు. అయినా, ఆపకుండా మళ్లీ రూ.లక్షల్లో అప్పులు చేశాడు. కాగా, నాగరాజు సోదరుల మధ్య ఇటీవలే ఆస్తి పంపకాలు జరగ్గా.. వీరికి రూ.20 లక్షలు వచ్చింది. ఈ క్రమంలో కొడుకు అప్పులు చేసిన విషయం తెలిసి నాగరాజురెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో కుటుంబ బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకుంది. నలుగురూ శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు వారిని గమనించి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందగా.. కుమారుడు దినేష్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: AP Politics: క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన
భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం!
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
Brother Stabs Sister and Mother: చెల్లిని 84 సార్లు పొడిచి చంపిన అన్న - తల్లిపైనా దాడి- సోషల్ మీడియా వద్దన్నందుకే !
చెల్లిని 84 సార్లు పొడిచి చంపిన అన్న - తల్లిపైనా దాడి- సోషల్ మీడియా వద్దన్నందుకే !

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget