అన్వేషించండి

Macherla Fire Accident : మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవ దహనం, వివాహేతర సంబంధం కోణంలో దర్యాప్తు!

Macherla Fire Accident : మంచిర్యాల జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై 16 బృందాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Macherla Fire Accident : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలో మాసు శివయ్య అనే వ్యక్తి ఇంటిలో మంటలు చెలరేగి దగ్ధం అయింది. మంటల్లో చిక్కుకుని ఆరుగురు వ్యక్తులు సజీవ దహన అయ్యారు.  మృతి చెందిన వారిలో మాసు శివయ్య (50),  పద్మ (శివయ్య భార్య) (40),  మౌనిక (35), హిమ బిందు (2),  స్వీటీ (4),  శాంతయ్య (40) (సింగరేణి కార్మికుడు) గా గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ స్థానిక పోలీసులతో కలిసి ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. 

Macherla Fire Accident : మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవ దహనం, వివాహేతర సంబంధం కోణంలో దర్యాప్తు!

16 బృందాలతో దర్యాప్తు 

ఆరుగురు సజీవ దహనమైన ఈ ప్రమాద ఘటనపై 16 బృందాలతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ మేరకు డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ, సీఐ ప్రమోదావు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు మొదట వాటిని తరలించే ప్రయత్నం చేశారు. అయితే మృతదేహాలు గుర్తించలేని విధంగా మారిపోవడంతో సంఘటన స్థలం వద్దే పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనలో వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్, అగ్నిమాపక, ఎలక్ట్రికల్ తదితర డిపార్ట్మెంట్ల అధికారుల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి వాస్తవాలు వెలికితీస్తామన్నారు. 

బయట వ్యక్తి కారణమని అనుమానాలు! 

మంచిర్యాల జిల్లాలో జరిగిన దారుణం ప్రమాదం కాదని పోలీసులు అనుమాన పడుతున్నారు. ప్రమాదం తర్వాత ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. కావాలనే పెట్రోల్ పోసి నిప్పు పెట్టారనే అనుమానం వచ్చేలా కొన్ని క్లూస్‌ పోలీసులకు చిక్కినట్టు సమాచారం. మంచిర్యాల జిల్లా గుడిపల్లి వెంకటాపూర్‌లో ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనం అయ్యారు. అర్ధరాత్రి జరిగిన ఈ సంఘట తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. పోలీసు యంత్రాంగం కూడా ఉలిక్కిపడింది. రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. తర్వాత కేసు రిజిస్టర్‌ చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు అక్కడ పెట్రోల్ క్యాన్స్‌ దొరికినట్టు తెలిసింది. అదే టైంలో ఆటో కూడా అనుమానాస్పదంగా వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన ఆరుగురిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా... ఒకరు మాత్రం బయట వ్యక్తి. ఆయన పేరు శాంతయ్య. ఈయన కారణంగానే ఇంత దారుణం జరిగిందని స్థానికంగా వినిపిస్తున్న మాట. సింగరేణి కార్మికుడిగా పని చేస్తున్న శాంతయ్యకు తన కుటుంబంతో విభేదాలు ఉన్నాయట. కొన్ని రోజులుగా ఆయన ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఇంట్లోనే ఉంటున్నారని సమాచారం. 

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget