అన్వేషించండి

Anantapur Crime News: ఒక్క రాంగ్ కాల్‌తో లైఫ్ క్లోజ్ - నా భర్తను వదిలివస్తా, నువ్వు నీ భార్యను విడిచిపెట్టు! ఊహించని విషాదం

Andhra Pradesh News | రాంగ్ కాల్ వారిని కలిపింది. కానీ అప్పటికే వారిద్దరికీ వివాహాలు అయ్యాయి. తమ పరిచయాన్ని వివాహేతర సంబంధంగా చేసుకోగా, చివరికి మహిళా టీచర్ దారుణహత్యకు గురైన ఘటన అనంతపురంలో జరిగింది.

అనంతపురం: ఒకే ఒక రాంగ్ కాల్ తో జీవితం ముగిసింది.  ప్రైవేట్ ఉపాధ్యాయురాలుని దారుణ హత్య చేసిన వ్యక్తికి అనంతపురం జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 

హరిజన రుద్రేష్ అను వ్యక్తి M.A.(English) చదివాడు. అతని భార్య పార్వతి కూడా B.Ed. చదివింది. ఇద్దరూ కళ్యాణదుర్గంలో ట్యూషన్స్ తో వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు.  ఒకరోజు రుద్రేష్ ఫోనుకు రాంగ్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది విజయలక్ష్మి, ఆమెకూ వివాహమైనది. భర్త ఓ ఫైనాన్స్ కంపెనీలో  ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె T.T.C. చదువుతోంది. వారికి ఒకటిన్నర సంవత్సరం గల బాలుడు ఉన్నాడు. ఆ బంధాలన్నీ మరిచి, రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన హరిజన రుద్రేష్ తో మాట కలిపింది. ఆ తర్వాత వాట్సాప్ లో  సందేశాలు, అశ్లీల ఫోటోలు పంపుకోవడం, అలా వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. 
నా భర్తను వదిలివస్తా, నువ్వు నీ భార్యను విడిచిపెట్టు..
ఆ తర్వాత విజయలక్ష్మి నేను భర్తను వదిలి వస్తా, నీవు నీ భార్యను వదిలి రా.. మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ  డిమాండ్ చేసింది. అశ్లీల ఫోటోలను, సందేశాలను అర్ధరాత్రి సమయాల్లో పంపుతోంది. వాటిని రుద్రేష్ భార్య చూడడంటో వారి కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి. చివరకు రుద్రేష్ తో అతని భార్య విడిపోయే పరిస్థితి వచ్చింది. మరోవైపు విజయలక్ష్మి నువ్వు నీ భార్యని వదిలి రాకపోతే.. వాట్సప్ మెసేజ్ లు, ఫోటోలు పోలీసులకు ఇచ్చి నీపైన కేసు పెడతాను అని బెదిరించేది. దాంతో రుద్రేష్ మానసిక సంఘర్షణకు లోనై  ఎలాగైనా విజయలక్ష్మిని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.

సెప్టెంబర్ 4వ తేదీ 2018 వ సంవత్సరం విజయలక్ష్మి, రుద్రేష్ కు ఫోన్ చేసి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేను ఇంటి నుండి బయటకు వస్తున్నానని, రుద్రేష్ ను కూడా అనంతపురం కు రమ్మని చెప్పింది. రుద్రేష్ ఇదే అదనుగా భావించి ఆమె చెప్పినట్టుగా ఉదయం 10 గంటలకు అనంతపురం చేరుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రుద్రేష్ స్కూటీ లో బయలుదేరి, ఉదిరిపికొండ- శివరాంపేట గ్రామాల మధ్యలో ఒక గుట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. అయితే విజయలక్ష్మిని చంపాలని పథకం వేసుకున్న రుద్రేష్ ఆమె గొంతుకు చున్నీ గట్టిగా బిగించి, ఊపిరి ఆడకుండా చేశాడు. ఒక బండ రాయి తలపై వేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ఒంటిపై వున్న నగలను తీసుకొని పారిపోయి, అదేరోజు కళ్యాణదుర్గం ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టుపెట్టాడు. లక్ష రూపాయలు లోన్ తీసుకొని, అదే రోజు తన భార్య పార్వతికి బంగారు షాపులో నల్లపూసల దండకు రూ. 30,000 అడ్వాన్స్ కట్టి ఆర్డర్ ఇచ్చాడు. మరుసటి రోజు ఎల్ఈడి టీవీ కూడా కొన్నాడు.  

Also Read: Crime News: మద్యం సీసా చెప్పిన సాక్ష్యం - 20 నెలల అనంతరం నిందితుడిని పట్టించింది, అసలు కథ ఏంటంటే?

తన భార్య స్కూలులో ఫంక్షన్ ఉందని చెప్పి పోయి, తిరిగి రాలేదని విజయలక్ష్మి భర్త అదే రోజు అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత ఉదిరిపికొండ-శివరాంపేట గ్రామాల మధ్యలో ఒక గుట్ట దగ్గర విజయలక్ష్మి మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత తీగలాగితే డొంక కదిలింది. విజయలక్ష్మి సెల్ ఫోన్ లో వివరాలు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు హరిజన రుద్రేష్ ను నిందితుడిగా గుర్తించి అతనిపై కూడేరు పోలీసులు Cr.No.93/2018 గా IPC సెక్షన్ 302, 404 కింద కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ ప్రసాదరావు  దర్యాప్తు చేసి చార్జీషీట్ దాఖలు చేశారు. 15 మంది సాక్షులను విచారించగా హరిజన రుద్రేష్ పై నేరం రుజువు కావడంతో అతడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ శ్రీనివాస్ సోమవారం సంచలన తీర్పు వెలువరించారు.

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget