అన్వేషించండి

Kurukshetra News: భర్తను చంపి పేగులు సంచిలో వేసిన భార్య! ఇంటి యజమాని చూడటంతో...! 

Kurukshetra Murder News: కురుక్షేత్రలోని పెహోవా రోడ్డులో రాజ్ ప్యాలెస్ సమీపంలోని ఒక ఇంట్లో భర్తను దారుణంగా హత్య చేసిందో భార్య. తన భర్త పేగులను కట్ చేసి సంచివేసుకుంది.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కురుక్షేత్రలో భార్య విమల భర్త రాజేష్‌ను కత్తులతో హత్య చేసింది.
  • మృతదేహం పేగులను సంచిలో వేస్తుండగా ఇంటి యజమాని చూశాడు.
  • భయంతో బాల్కనీ నుండి దూకిన ఆమె ఆసుపత్రిలో చేరింది.
  • పోలీసులు ఘటనా స్థలంలో మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

Kurukshetra News: హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఘోర ఘటన అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. భార్య ప్రవర్తించిన తీరుకు అంతా షాక్ అయ్యారు. ఈ ఘటన కురుక్షేత్రలోని పెహోవా రోడ్డులో ఉన్న రాజ్ ప్యాలెస్ సమీపంలో జరిగింది. రాజ్ ప్యాలెస్ సమీపంలోని ఒక ఇంట్లో, ఒక మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. అతని శరీరాన్ని ముక్కలు చేసింది. పేగులను కూడా బయటకు తీసి సంచిలో వేసుకుంది. ఆ మహిళ తన భర్త రాజేష్ (40)ను కత్తులతో పదేపదే పొడిచింది. అతని పొట్టను సుమారు 35 సెంటీమీటర్ల మేర చీల్చింది. మృతుడి పోస్ట్‌మార్టం సమయంలో వైద్యులు షాక్ అయ్యారు.  

మృతుడిని ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా, ధాంపూర్ గ్రామానికి చెందిన రాజేష్‌గా గుర్తించారు. అతను సుమారు ఒక సంవత్సరం నుంచి తన భార్య విమలా దేవితో కలిసి కురుక్షేత్రలో నివసిస్తున్నారు. పెహోవా రోడ్డులోని పిబి ఆర్ఓ వాటర్ ట్రేడింగ్ కంపెనీలో నీటి సరఫరాదారుగా పనిచేసేవాడు.

దర్యాప్తులో ఘోరమైన నిజం వెలుగులోకి...

విచారణలో, ఆ మహిళ కత్తిపోట్ల వల్ల రాజేష్ కడుపు సుమారు 35 సెంటీమీటర్ల మేర ఓపెన్ అయ్యింది. గాయాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, అతని పేగులు శరీరం నుంచి బయటకు వచ్చేశాయి. పోస్ట్‌మార్టం సమయంలో గాయాలు గురించి తెలుసుకున్న వైద్యులకే కళ్లు తిరిగాయి. మృతుడి సగం కాలేయం నుజ్జు నుజ్జు అయ్యింది. కుడి మూత్రపిండం కూడా కనిపించకుండా పోయింది.

హత్య చేసిన తర్వాత ఆ మహిళ తన భర్త పేగులను ఒక సంచిలో పెట్టుకుంది. ఇంతలో, ఇంటి యజమాని రావడంతో మహిళ బాల్కనీ నుంచి దూకేసింది. తీవ్ర గాయాలు పాలైన మహిళను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.  

పోస్ట్‌మార్టంలో వెల్లడైన ఆశ్చర్యకరమైన వాస్తవాలు

ఇంటి యజమాని రింకు చెప్పిన ప్రకారం, రాజేష్ సుమారు ఒక సంవత్సరం క్రితం ఆ ఇంటిపై అంతస్తులో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. సాయంత్రం సుమారు 5 గంటలకు, అతనికి రాజేష్, విమల అరుపులు వినిపించాయి. ఆ శబ్దం విని అతను టెర్రస్‌పైకి పరుగెత్తుకెళ్లాడు. ఏదో జరుగుతోందని గ్రహించి అక్కడకు చేరుకున్నాడు. అక్కడి దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి గురయ్యాడు. రక్తపు మడుగులో రాజేష్ పడి ఉన్నాడు. అతని శరీరంపై గాయాలు ఉన్నాయి.

రింకు చెప్పిన దాని ప్రకారం, పరుగెత్తుకొని గదిలోకి వెళ్ళినప్పుడు, రాజేష్ పేగులను ఒక సంచిలో పెడుతూ విమల కనిపించింది. ఇంతలో ఇంటి యజమాని ఎదురుగా చూసింది. ఒక్కసారిగా భయానికి గురైన మహిళ పైకప్పు నుంచి దూకేసింది. ఆ కిందపడటంతో ఆమె గాయపడి, ఆసుపత్రిలో చేరింది.

ఘటనా స్థలం నుంచి మూడు కత్తులు స్వాధీనం

సమాచారం అందుకున్న తర్వాత, థర్డ్ గేట్ ఇన్‌చార్జ్ సతీష్ గౌర్, కేయూకే ఇన్‌చార్జ్ సురేంద్ర సింగ్ ఒక పోలీసు బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు పెద్దవి, చిన్నవి కలిపి మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించి, కేసు దర్యాప్తును ప్రారంభించారు.

ఇంటి యజమాని మరికొన్ని దిగ్భ్రాంతికరమైన వివరాలు వెల్లడించారు. విమల చేతబడి, భూతవైద్యం కూడా చేసేదన్నారు. ఆ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. అయితే, హత్య వెనుక అసలు కారణం ఇంకా తెలియరావడం లేదు. ఆ మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది, పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

వివాహం జరిగి చాలా ఏళ్లు అవుతున్నా పిల్లలు లేరు 

నివేదికల ప్రకారం, రాజేష్, విమలకు పెళ్లై చాలా సంవత్సరాలైంది, కానీ ఆ దంపతులకు పిల్లలు లేరు. పోలీసులు ఇప్పుడు ఆ జంట మధ్య ఉన్న రిలేషన్, వారి మధ్య ఉన్న వివాదాలు, హత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. మహిళ వాంగ్మూలం, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Frequently Asked Questions

కురుక్షేత్రలో జరిగిన ఘోర ఘటన ఏమిటి?

కురుక్షేత్రలోని పెహోవా రోడ్డులోని రాజ్ ప్యాలెస్ సమీపంలో ఒక మహిళ తన భర్త రాజేష్‌ను హత్య చేసింది. అతని శరీరాన్ని ముక్కలు చేసి పేగులను సంచిలో వేసింది.

ఈ ఘటనలో మృతుడు, నిందితులు ఎవరు?

మృతుడు ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాకు చెందిన రాజేష్ (40). నిందితురాలు అతని భార్య విమలా దేవి.

ఈ హత్య ఘటన ఎలా బయటపడింది?

ఇంటి యజమాని రింకు అరుపులు విని, గదిలోకి వెళ్ళగా రక్తపు మడుగులో రాజేష్‌ను చూశాడు. అతని పేగులను విమల సంచిలో పెడుతూ కనిపించింది.

రాజేష్ శరీరానికి ఎలాంటి గాయాలు అయ్యాయి?

రాజేష్ కడుపు 35 సెంటీమీటర్ల మేర చీలి, పేగులు బయటకు వచ్చాయి. సగం కాలేయం నుజ్జునుజ్జు అయ్యి, కుడి మూత్రపిండం కనిపించకుండా పోయింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kurukshetra News: భర్తను చంపి పేగులు సంచిలో వేసిన భార్య! ఇంటి యజమాని చూడటంతో...! 
భర్తను చంపి పేగులు సంచిలో వేసిన భార్య! ఇంటి యజమాని చూడటంతో...! 
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Advertisement

వీడియోలు

Sreemukhi Behavior In Bigg Boss 10 Agnipariksha | అగ్నిపరీక్షలో శ్రీముఖి రూడ్ బిహేవియర్
Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Reservation Hatao Andolan: కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
LPG e-KYC: LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
స్కోడా కుషాక్ 8 స్పీడ్ ఆటోమేటిక్‌ వెర్షన్‌... 6 స్పీడ్ ఆటోమేటిక్‌ కంటే మైలేజ్ ఎంత పెరిగిందో తెలుసా?
స్కోడా కుషాక్ కొత్త ఆటోమేటిక్ కారు నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తోంది? కంపెనీ లెక్క సరిపోయిందా?
చూపులకే పాతది.. నడిపితే కచ్చితంగా ఆశ్చర్యపోతారు! రేంజ్ రోవర్ స్పోర్ట్ EV ప్రత్యేకతలు ఇవే
రేంజ్ రోవర్ స్పోర్ట్‌కు ఇక ఇంధనం అవసరం లేదు.. ఈ ఎలక్ట్రిక్ SUV చాలా పవర్‌ఫుల్‌ గురూ!
Varanasi Update : వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
Type 2 Diabetes : టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
YS Vivekananda Reddy Case: వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
Embed widget