అన్వేషించండి

AP Crime News: బాలికను నిర్బంధించి సామూహిక అత్యాచారం, నాలుగు రోజులపాటు నరకం చూపిన ఏడుగురు యువకులు

Andhra Pradesh Crime News | కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన మైనర్ బాలికపై మైనర్ బాలుడు సహా ఏడుగురు నాలుగు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Krishan District Crime News | గన్నవరం: కృష్ణా జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా దారుణం జరిగింది. ఒంటరిగా కనిపించిన బాలికను కిడ్నాప్ చేసిన యువకులు ఆమెను నిర్బంధించి నాలుగు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
అసలేం జరిగిందంటే..
గన్నవరం మండలం వీరపనేని గూడెం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని జి కొండూరుకు చెందిన 14 ఏళ్ల బాలిక మార్చి 9వ తేదీన పొరుగింటి మహిళతో కలిసి కృష్ణా జిల్లా వీరపనేని గూడేనికి వెళ్లింది. ఈ క్రమంలో మార్చి 13వ తేదీన చిన్న గొడవ జరగడంతో బాలిక మనస్తాపానికి గురైంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలిక ఒంటరిగా ఉన్నట్లు గమనించిన 15 ఏళ్ల బాలుడు, రజాక్ అనే యువకుడు కలిసి ఆమెకు మాయమాటలు చెప్పారు. ఆమెను సొంతూరు జి కొండూరులో దింపుతామని నమ్మించి బైక్ పై తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.

అక్కడితో వదిలేయని నిందితులు ఆ బాలికను జితేంద్ర, అనిల్ అనే మరో ఇద్దరి వద్దకు తీసుకెళ్లారు. ఆ ఇద్దరు నిందితులు సైతం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం కేసరపల్లి గ్రామానికి చెందిన హర్షవర్ధన్, అనిత్ తో పాటు మరో యువకుడు సైతం బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా నాలుగు రోజులపాటు బాలికకు మైనర్ బాలుడు, ఆరుగురు యువకులు నరకం చూపించారు. తనను వదిలిపెట్టాలని ఆమె ఎంత వేడుకున్నా నిందితులు కనికరించగలేదు. నాలుగు రోజులపాటు పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన అనంతరం సోమవారం బాలికను ఎన్టీఆర్ జిల్లా మాచవరంలో వదిలేసి వెళ్లారు.

   ఆటో డ్రైవర్ అనుమానం వచ్చి బాలికను సంప్రదించాడు. ఆమె పరిస్థితిని గమనించి వివరాలు కనుక్కొని, మాచవరం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లాడు. బాలిక ఆరోగ్యం విషమించడంతో ఆమె మాట్లాడే స్థితిలో లేదు. పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
CTET February 2026 : ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
CTET February 2026 : ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
Embed widget