అన్వేషించండి

Konaseema Crime News: ఇద్దరు బిడ్డలను కాలువలోకి తోసి పరారైన తండ్రి, కోన‌సీమ జిల్లాలో దారుణం

కాకినాడలో ఓ తండ్రి ఉదంతం మ‌ర‌వ‌క‌ముందే అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలో మ‌రో తండ్రి ఘాతుకం చోటుచేసుకుంది.. త‌న ఇద్ద‌రి పిల్ల‌ల్ని స్కూటీపైతీసుకెళ్లి కాలువ‌లో తోసేసిన సంఘ‌ట‌న‌లో చిన్నారి మృతిచెందింది..

 Andhra Pradesh News | రామచంద్రపురం : పోటీ ప్రపంచంలో తన పిల్లలు బ్రతకలేరన్న నెపంతో ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కాకినాడ ఉదంతం మరువక ముందే అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మరో సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.. ఓ కసాయి తండ్రి తన పిల్లల్ని తనతోపాటే తీసుకుని వెళ్లి కాలువలో తోసేసిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.. కుమారుడు సందీప్‌(10) కాలువలో ఈదుకుంటే బయట పడగా చిన్నారి కారుణ్య(6) మృత్యువాత పడిరది.. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన తండ్రి పిల్లి రాజు(40) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.. అతను ఎక్కడికైనా పారిపోయాడడా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు... ఈ దారుణ సంఘటన అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు గ్రామ పరిధిలోని గణపతినగర్‌ లాకుల వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది..

సరదాగా బండిపై తిప్పుతానని తీసుకెళ్లి..

రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే వ్యక్తికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోమవారం సాయంత్రం పిల్లలు సందీప్‌, కారుణ్యలను అలా స్కూటీ బండిపై తిప్పుతానని తీసుకెళ్లాడు.. వెంటూరు నుంచి రామచంద్రపురం మండల పరిధిలోని నెలపర్తిపాడు వరకు తీసుకుని వచ్చాడు.. తండ్రి రాజు మనసులో కుట్రను తెలుసుకోలేని చిన్నారులిద్దరూ సంతోషంతో స్కూటీ ఎక్కి సరదాగా తిరిగారు... చీకటి పడేదాకా వారిని అటు ఇటూ తిప్పిన తండ్రి రాజునెలపర్తిపాడులోని గణపతిలాకుల వద్దకు తీసుకుని వెళ్లాడు.. అక్కడ నిర్మాణుష్యంగా ఉండడం చూసి ఇద్దరి పిల్లల్ని ఒక్కసారిగా కాలువలోకి తోసేశాడు.. అయితే కాలువలో అంత ఉదృతంగా ప్రవాహం లేకపోవడంతో కుమారుడు సందీప్‌ ఈతకొట్టుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు.. కానీ చిన్నారి కారుణ్య మాత్రం కనిపించలేదు.. దీంతో గట్టుమీదనుంచి ఏడుస్తూ నడుస్తున్న సందీప్‌ను చూసిన ఇద్దరు స్థానికులు తమ వెంటబెట్టుకుని రామచంద్రపురం పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. 

తెల్లారేసరికి చిన్నారి విగతజీవిగా..

హుటాహుటీన పోలీసులు బాలుడు సందీప్‌ చెప్పిన వివరాల ప్రకారం గణపతి లాకుల వద్దకు వెళ్లి పరిశీలించగా చిన్నారి కారుణ్య ఆచూకీ లభించలేదు.. ఉదయంకు కారుణ్య మృతదేహం లభ్యం అయ్యింది.. తమను స్కూటీపై లాకుల వద్దకు తీసుకువచ్చిన తండ్రి ఆతరువాత ఏమయ్యాడో తెలియదని బాలుడు సందీప్‌ పోలీసులకు తెలిపాడు.  అయితే తండ్రి రాజు పిల్లల్ని కాలువలోకి తోసేసి ఎక్కడికైనా పరారయ్యాడా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.. 

కన్నీరుమున్నీరైన తల్లి, కుటుంబసభ్యులు..

కన్నతండ్రే చిన్నారుల పాలిట కాలయముడయ్యాడన్న వార్త తల్లి, కుటుంబ సభ్యులకు తెలియడంతో కన్నీరు మున్నీరయ్యారు. చిన్నారి కారుణ్య మృతదేహం వద్ద తల్లి, కుటుంబికులు విలపించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది. ఏమైనా ఉంటే తాను చూసుకోవాలని కానీ అన్యంపుణ్యం ఎరగని పసిపిల్లలు ఏం చేశారని కసాయి తండ్రి రాజు తీరుపై మండిపడ్డారు.. అయితే తండ్రి రాజు ఆచూకీ ఇంకా లభ్యం కాకపోగా అతని సెల్‌ ఫోన్‌ ఆధారంగా ట్రేస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఈసంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Pune Realtor Ketan Agarwal Murder: పాపం కేతన్ - ప్రాణాలే కాదు ముందుగా కోటి కూడా పోగొట్టుకున్నాడు - సియా ప్లాన్ నెక్ట్స్ లెవల్ !
పాపం కేతన్ - ప్రాణాలే కాదు ముందుగా కోటి కూడా పోగొట్టుకున్నాడు - సియా ప్లాన్ నెక్ట్స్ లెవల్ !
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget