అన్వేషించండి

Konaseema News : ఉసురు తీసిన ఉపాధి, మస్కట్ లో మహిళ ఆత్మహత్య!

Konaseema News : ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన ఓ మహిళ అక్కడ పనిఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంది.

Konaseema News : ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన ఓ నిరుపేద మహిళ అక్కడ పని ఒత్తిడి తట్టుకోలేక... ఇంటికి వచ్చే అవకాశం లేక బలవన్మరణానికి పాల్పడింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి గ్రామానికి చెందిన కోజా వెంకటలక్ష్మి( 35) గల్ఫ్ దేశం అయిన మస్కట్ లో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజోలు మండలం శివకోటి గ్రామానికి చెందిన కోజా వెంకటలక్ష్మి ఆరు నెలల క్రితం జీవనోపాధి కోసం మస్కట్ వెళ్లింది.  అక్కడ ఒక షేక్ ఇంట్లో పనికి కుదిరిన ఆమె ఆ ఇంట్లో జనాభా ఎక్కువ కావడంతో పని చేయలేక పోతున్నానని, ఆరోగ్యం సహకరించడంలేదని, తనను  ఇండియా తీసుకెళ్లిపోవాలని భర్త నాగరాజుకు అక్కడ పరిస్థితిని వీడియోలో చూపిస్తూ కాల్ చేసింది. తన భార్యను గల్ఫ్ దేశం పంపించిన ఏజెంట్లు జిలానీ, రవిలను కలిసిన నాగరాజు తన భార్యను స్వదేశం తీసుకురావాలని ప్రాధేయపడ్డాడు.  

లైవ్ లో సూసైడ్ 

వెంకటలక్ష్మిని ఇండియాకు తీసుకురావాలంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని ఏజెంట్లు నాగరాజుకు  తెలిపారు. నిరుపేదలమైన తాము అంత ఇవ్వలేమని, కొద్దిగా సర్దుతామని విన్నవించినా ఏజెంట్లు పట్టించుకోలేదని వెంకటలక్ష్మి కుటుంబ సభ్యుయలు తెలిపారు. దీంతో దిక్కుతోచని వెంకటలక్ష్మి లైవ్ లో ఉరి వేసుకుని  ఆత్మహత్యకు పాల్పడింది.  తన భార్య మృతికి ఏజెంట్లు జిలానీ, రవి కారణమని మృతురాలు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.  వెంకటలక్ష్మి మృతదేహాన్ని స్వగ్రామం శివకోటి తీసుకురావడంతో విషాధ ఛాయలు అలుముకున్నాయి. రాజోలు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. 

పెళ్లి కావడంలేదని ఆత్మహత్యలు

ఏ అమ్మాయికైనా, లేదంటే అబ్బాయికైనా వారి వివాహం చేసుకునే భాగస్వాములు మంచి వారై ఉండాలని అనుకుంటారు. మంచి భర్త కావాలని, మంచి భార్య దొరకాలని కలలు కంటుంటారు. అలా మంచి లక్షణాలున్న భాగస్వామి దొరికితే జీవితం సాఫీగా సాగుతుంది. కానీ పెళ్లి చేసుకునే వయస్సు దాటిపోతూ అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయికి దొరకకపోతే వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. అయితే కేవలం పెళ్లి కావడం లేదనే బాధతో ఏకంగా సూసైడ్‌ చేసుకున్నవాళ్లు కొందరైతే.. ఏకంగా మాజీ సీఎంకే లేఖ రాసిన పెళ్లికానీ ప్రసాద్‌లు చాలానే ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలు, పెళ్లి కావడం లేదన్న మనోవ్యథతో ప్రాణాలు తీసుకుంటున్న మగవారి సంఖ్య పెరుగుతున్న విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

ఎందుకీ ఆత్మహత్యలు? 

గత ఏడాది 2021లో దేశవ్యాప్తంగా కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి శాతం మొత్తం ఆత్మహత్యల్లో 56.6 శాతం ఉన్నట్లు ఎన్సీఆర్బీ రికార్డులలో తేలింది. ఇందులో వివాహంతో ముడిపడి ఉన్న ఆత్మహత్యలు 4.8శాతం ఉన్నాయి. మరీ ముఖ్యంగా కరోనా కారణంగా చేస్తున్న ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. మరోపక్క పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చాలామంది సమాజంలో ఉన్న యువతీ యువకులు పెళ్లి సమస్య కారణంగా కెరియర్ పై సరైన అవగాహన దృష్టి పెట్టలేకపోతున్నారు. యువతరం ఎదుర్కొంటున్న సమస్యలు నిరుద్యోగం తర్వాత జీవితంలో అతి ముఖ్య ఘట్టం పెళ్లి. ఒక పక్క ఉద్యోగాలు లేక మరో పక్క పెళ్లి చేసుకునే విషయంలో కాలం గడిచిపోతూ ఉండటంతో.. పాటు చుట్టుపక్కల ఉండేవాళ్లు, బంధువులు పెట్టే ఒత్తిడితో యువతరం నలిగిపోతోంది. పెళ్లి చేసుకోవాలంటే కచ్చితంగా ఉద్యోగం ఉండాల్సిన పరిస్థితి. కుటుంబం సాఫీగా జరగాలంటే ఒక అద్భుతమైన జాబ్ ఉంటేనే అవతలివాళ్ళు కమిటీ అయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉంది.  ఇక గత ఏడాదిలో దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న స్త్రీ, పురుష నిష్పత్తిలో ఎక్కువగా అబ్బాయిలే ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యలకు కారణమవుతున్న కుటుంబ సమస్యల్లో ప్రధానంగా కనిపించేది వివాహం. వైవాహిక సంబంధ సమస్యలతో పురుషులు ప్రాణాలు తీసుకుంటున్న ధోరణి పెరుగుతోంది. అయితే నిజానికి మహిళలు మానసికంగా సున్నితంగా బలహీనంగా ఉంటారన్నది సమాజాంలో వినిపించే అభిప్రాయం. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇందుకు భిన్నంగా మానసిక మనోవేదనకు గురి అయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన
భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం!
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
Brother Stabs Sister and Mother: చెల్లిని 84 సార్లు పొడిచి చంపిన అన్న - తల్లిపైనా దాడి- సోషల్ మీడియా వద్దన్నందుకే !
చెల్లిని 84 సార్లు పొడిచి చంపిన అన్న - తల్లిపైనా దాడి- సోషల్ మీడియా వద్దన్నందుకే !

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget