అన్వేషించండి

Konaseema Road Accident : కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి

Konaseema Road Accident : కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక నలుగురు మరణించారు.

Konaseema Road Accident : కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం యానం-ఎదుర్లంక బ్రిడ్జ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. బైక్ ను ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారికి గాయాలు అవ్వగా, మృతుల్లో ఒక చిన్నారి ఉన్నాడు. వారధిపై ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఐ.పోలవరం, యానం పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. గాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది. ఎదుర్లంక బాలయోగి వారధిపై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మోటార్ సైకిల్ పై వెళుతుండగా టిప్పర్ లారీ ఢీ కొట్టింది.  ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆసుపత్రిలో మరణించింది. మృతులు కాట్రేనికోన మండలం చెయ్యరు గ్రామం చెందినవారుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడి కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి తేజ శ్రీలక్ష్మి(5) మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

మృతుల వివరాలు 

గుబ్బల శ్రీను (45)
గుబ్బల మంగయమ్మ (40)
మనవడు  యశ్వంత శివ కార్తీక్ (3సం)
మనవరాలు శ్రీ లక్ష్మి (6సం) 

గుబ్బల శ్రీను పెద్ద కూతురు  ద్రాక్షారామ ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

చెట్టును ఢీకొట్టిన కారు, 8 మందికి గాయాలు 

శ్రీకాకుళం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి రోడ్డుపక్కన చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ జిల్లాలోని సింహాచలం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని కంచికి ఎనిమిది మంది ఇన్నోవా కారులో బయలుదేరారు. 16వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా పలాసపురం వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వాహనం అదుపుతప్పి రోడ్డుపై కిందకు దూసుకెళ్లి ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులోని ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని బయటకు తీసి దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందించిన వైద్యులు ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదానికి కారణంగా తెలుస్తోందని పోలీసులు తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

మానవత్వం చాటుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ 

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన సొంత వాహనంలో తీసుకువెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆదివారం మంత్రి  గుడివాడ అమర్నాథ్ లంకెలపాలెం నుంచి అనకాపల్లి వైపు వెళ్తుండగా మార్గమధ్యలో నేషనల్ హైవేపై జరిగిన బైక్ ప్రమాదాన్ని గమనించి, వెంటనే అక్కడకు వెళ్లి ప్రమాదం జరిగిన వ్యక్తులను మంత్రి కారులో దగ్గర ఉన్న అనకాపల్లి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ కు ఫోన్ చేసి గాయపడిన వ్యక్తులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. అక్కడే ఉన్న స్థానికులు మంత్రి గుడివాడ అమర్నాథ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
Orissa Fire Accident: ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Embed widget