అన్వేషించండి

Khammam: భర్త ఫ్రెండుతో భార్య శారీరక సంబంధం, పరువు పోతుందని పాడు పని!

భర్తకు ఈ విషయం తెలిసిపోయిందని, అతని ద్వారా ఇంకొంత మందికి ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని భావించిన ఆమె హత్యకు కుట్ర పన్నింది.

వివాహేతర సంబంధాల మోజు అయిన వారిని కూడా పొట్టన పెట్టుకుంటున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపించింది. పరాయి వ్యక్తితో తాను నడుపుతున్న వివాహేతర సంబంధం బయటివారికి ఎక్కడ తెలుస్తుందో అనే భయంతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తన భర్త కనిపించడం లేదని పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది.

పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామానికి చెందిన ఓ యువతికి 2010లో ఆమె సొంత మేనమామతో వివాహం జరిగింది. వీరిద్దరికీ మనస్పర్థలు రావడంతో 2015లో విడాకులు తీసుకొని, విడిగా ఉంటున్నారు. రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ ఆమెకు ఖమ్మం రూరల్‌ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన యువకుడు సాయిచరణ్ అనే 28 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఖమ్మంలో కాపురం పెట్టారు. ఈ యువకుడు కోడి పెంట, చికెన్ వ్యర్థాలను తరలించే ఓ లారీకి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇలా ఉండగా, ఇతనికి ఖమ్మంకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ కరుణాకర్ తో పరిచయం ఏర్పడి, అది స్నేహంగా మారింది. ఆ కరుణాకర్ తరచూ యువకుడి ఇంటికి వెళుతూ ఉండేవాడు. అలా అతడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్య తన స్నేహితుడైన ఆటో డ్రైవర్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని చూసిన ఆ యువకుడు సాయి, ఆమెను కొన్నిసార్లు హెచ్చరించాడు.

పరువుపోతుందని కుట్రకు ప్లాన్
అయితే, భర్తకు ఈ విషయం తెలిసిపోయిందని, అతని ద్వారా ఇంకొంత మందికి ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని భావించిన ఆమె హత్యకు కుట్ర పన్నింది. అలా ఈ నెల 1న యువకుడు, ఆటో డ్రైవర్‌ కలిసి వాహనంలో కోళ్ల పెంట, చికెన్ వ్యర్థాలను తీసుకొని ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాకు బయలుదేరాడు. మార్గం మధ్యలో ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌ వద్ద మద్యం తీసుకుని ప్రకాశ్‌ నగర్‌ ప్రాంతంలో ఎవ్వరులేని చోటుకు వెళ్లి ఇద్దరూ మద్యం తాగారు. ఈ క్రమంలో గొడవ పడ్డారు. కోపంతో ఊగిపోయిన వివాహిత ప్రియుడు, ఆ యువకుడు సాయిని పారతో గట్టిగా కొట్టాడు. మృతదేహాన్ని వాహనంలోని కోళ్ల పెంట మధ్య దాచేశాడు. 

తర్వాత నేరుగా వాహనంతో ఎన్టీఆర్‌ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదుప గ్రామంలోని ఓ చేపల చెరువులో మృత దేహాన్ని పడేశారు. ఆ చేపల చెరువు యజమానికి ఈ నెల 4న చెరువులో మృతదేహం తేలుతూ కనిపించింది. గుర్తు పట్టిన ఆ యజమాని, మృతుడి స్నేహితుడైన నిందితుడికే ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. అయితే విషయం బయటపడితే చెరువులోని చేపలను ఎవ్వరూ కొనరని, అందుకే గప్‌చుప్ గా ఉండాలని యజమానికి చెప్పాడు. దీంతో ఆ యజమాని, మృతదేహాన్ని పక్కనే ఉన్న చెరువు మధ్యలోకి తీసుకెళ్లి ముళ్ల కంప చెట్టు వద్ద వదిలేశాడు. అది వరదకు కొట్టుకుపోయింది. 

ఈ హత్యోదంతం గురించి తెలిసినా కూడా ఆ వివాహిత ఏమీ తెలియనట్లు తన భర్త కనిపించడం లేదంటూ ఈ నెల 11న ఖమ్మం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అనుమానంతో పోలీసులు ఆమెను, ఆమె ప్రియుడిని ప్రశ్నించడంతో అసలు నిజం బయటికి వచ్చింది. ఈ ఘటనలో ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహం కోసం వెతుకుతున్నామని పోలీసులు చెప్పారు.

ఆగస్టు 1న హత్య
ఈనెల మొదట్లోనే హత్య జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయినా దాదాపు 10 రోజుల పాటు ఎక్కడా బయటకు పొక్కలేదు. సాయి ఎక్కడికి వెళ్లాడని, అతని బంధువులు, యజమాని భార్యను ప్రశ్నించారు. తనకు తెలీదని చెప్తూ వచ్చిన ఆమె తర్వాత అనుమానం రాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయి ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా విచారణ చేయగా, ఫ్రెండ్ కరుణాకర్ తో ఎక్కువ సార్లు మాట్లాడినట్లుగా గుర్తించారు. ఆ వివరాల ఆధారంగా శవం కోసం ఖమ్మం పోలీసులు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోకి వెళ్లి గాలించారు. ఇప్పటికి హత్య జరిగి 25 రోజులు అవుతున్నా శవం దొరక్కపోవడంతో హతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aadhaar Forgery: ఇంట్లో ఇల్లాలు, ఫైవ్ స్టార్ హోటల్లో ప్రియురాలు..కానీ ఆధార్ మాత్రం ఇల్లాలిదే - ఆ భర్త అలా దొరికిపోయాడు!
ఇంట్లో ఇల్లాలు, ఫైవ్ స్టార్ హోటల్లో ప్రియురాలు..కానీ ఆధార్ మాత్రం ఇల్లాలిదే - ఆ భర్త అలా దొరికిపోయాడు!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget