అన్వేషించండి

Khammam: భర్త ఫ్రెండుతో భార్య శారీరక సంబంధం, పరువు పోతుందని పాడు పని!

భర్తకు ఈ విషయం తెలిసిపోయిందని, అతని ద్వారా ఇంకొంత మందికి ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని భావించిన ఆమె హత్యకు కుట్ర పన్నింది.

వివాహేతర సంబంధాల మోజు అయిన వారిని కూడా పొట్టన పెట్టుకుంటున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపించింది. పరాయి వ్యక్తితో తాను నడుపుతున్న వివాహేతర సంబంధం బయటివారికి ఎక్కడ తెలుస్తుందో అనే భయంతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తన భర్త కనిపించడం లేదని పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది.

పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామానికి చెందిన ఓ యువతికి 2010లో ఆమె సొంత మేనమామతో వివాహం జరిగింది. వీరిద్దరికీ మనస్పర్థలు రావడంతో 2015లో విడాకులు తీసుకొని, విడిగా ఉంటున్నారు. రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ ఆమెకు ఖమ్మం రూరల్‌ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన యువకుడు సాయిచరణ్ అనే 28 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఖమ్మంలో కాపురం పెట్టారు. ఈ యువకుడు కోడి పెంట, చికెన్ వ్యర్థాలను తరలించే ఓ లారీకి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇలా ఉండగా, ఇతనికి ఖమ్మంకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ కరుణాకర్ తో పరిచయం ఏర్పడి, అది స్నేహంగా మారింది. ఆ కరుణాకర్ తరచూ యువకుడి ఇంటికి వెళుతూ ఉండేవాడు. అలా అతడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్య తన స్నేహితుడైన ఆటో డ్రైవర్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని చూసిన ఆ యువకుడు సాయి, ఆమెను కొన్నిసార్లు హెచ్చరించాడు.

పరువుపోతుందని కుట్రకు ప్లాన్
అయితే, భర్తకు ఈ విషయం తెలిసిపోయిందని, అతని ద్వారా ఇంకొంత మందికి ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని భావించిన ఆమె హత్యకు కుట్ర పన్నింది. అలా ఈ నెల 1న యువకుడు, ఆటో డ్రైవర్‌ కలిసి వాహనంలో కోళ్ల పెంట, చికెన్ వ్యర్థాలను తీసుకొని ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాకు బయలుదేరాడు. మార్గం మధ్యలో ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌ వద్ద మద్యం తీసుకుని ప్రకాశ్‌ నగర్‌ ప్రాంతంలో ఎవ్వరులేని చోటుకు వెళ్లి ఇద్దరూ మద్యం తాగారు. ఈ క్రమంలో గొడవ పడ్డారు. కోపంతో ఊగిపోయిన వివాహిత ప్రియుడు, ఆ యువకుడు సాయిని పారతో గట్టిగా కొట్టాడు. మృతదేహాన్ని వాహనంలోని కోళ్ల పెంట మధ్య దాచేశాడు. 

తర్వాత నేరుగా వాహనంతో ఎన్టీఆర్‌ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదుప గ్రామంలోని ఓ చేపల చెరువులో మృత దేహాన్ని పడేశారు. ఆ చేపల చెరువు యజమానికి ఈ నెల 4న చెరువులో మృతదేహం తేలుతూ కనిపించింది. గుర్తు పట్టిన ఆ యజమాని, మృతుడి స్నేహితుడైన నిందితుడికే ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. అయితే విషయం బయటపడితే చెరువులోని చేపలను ఎవ్వరూ కొనరని, అందుకే గప్‌చుప్ గా ఉండాలని యజమానికి చెప్పాడు. దీంతో ఆ యజమాని, మృతదేహాన్ని పక్కనే ఉన్న చెరువు మధ్యలోకి తీసుకెళ్లి ముళ్ల కంప చెట్టు వద్ద వదిలేశాడు. అది వరదకు కొట్టుకుపోయింది. 

ఈ హత్యోదంతం గురించి తెలిసినా కూడా ఆ వివాహిత ఏమీ తెలియనట్లు తన భర్త కనిపించడం లేదంటూ ఈ నెల 11న ఖమ్మం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అనుమానంతో పోలీసులు ఆమెను, ఆమె ప్రియుడిని ప్రశ్నించడంతో అసలు నిజం బయటికి వచ్చింది. ఈ ఘటనలో ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహం కోసం వెతుకుతున్నామని పోలీసులు చెప్పారు.

ఆగస్టు 1న హత్య
ఈనెల మొదట్లోనే హత్య జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయినా దాదాపు 10 రోజుల పాటు ఎక్కడా బయటకు పొక్కలేదు. సాయి ఎక్కడికి వెళ్లాడని, అతని బంధువులు, యజమాని భార్యను ప్రశ్నించారు. తనకు తెలీదని చెప్తూ వచ్చిన ఆమె తర్వాత అనుమానం రాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయి ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా విచారణ చేయగా, ఫ్రెండ్ కరుణాకర్ తో ఎక్కువ సార్లు మాట్లాడినట్లుగా గుర్తించారు. ఆ వివరాల ఆధారంగా శవం కోసం ఖమ్మం పోలీసులు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోకి వెళ్లి గాలించారు. ఇప్పటికి హత్య జరిగి 25 రోజులు అవుతున్నా శవం దొరక్కపోవడంతో హతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
Telangana Mass Killing: పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
Telangana Mass Killing News: రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Embed widget