అన్వేషించండి

Pahalgam Tourist Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్- మొత్తం నలుగురు పాక్ టెర్రరిస్టులు

జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో పహల్గాం సమీపంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్ అవుతోంది.

Pahalgam Tourist Attack: పహల్గాం: జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందారు వీరిలో పర్యాటకులే అధికంగా ఉండగా.. ఇద్దరు విదేశీయులు, ఇద్దరు స్థానికులు సైతం ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులపై జరిగిన దాడిలో పాల్గొని కాల్పులు జరిపిన ఉగ్రవాదుల మొదటి ఫొటో వచ్చేసింది. టెర్రరిస్ట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కనీసం 26 మంది మరణించగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. 

ట్రెక్కింగ్ కోసం సుందరమైన బైసరన్ లోయను సందర్శించే పర్యాటకుల బృందాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో విశాఖ వాసితో పాటు హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు ఈ కాల్పులకు పాల్పడ్డట్లు ప్రకటించారు. ఉగ్రవాదుల వివరాలను సేకరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు.

పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్ట్ రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థకు చెందిన టెర్రరిస్టులు పహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడ్డారు. పర్యాటకులను టార్గెట్ గా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపి మారణహోమానికి పాల్పడ్డారు. పహల్గామ్‌లోని బైసరన్ పర్యాటక ప్రదేశంలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారని జమ్మూకాశ్మీర్ పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదుల్లో ఒకడు ఆదిల్ గురీ అని, అతను పాకిస్తాన్ నుంచి 2018 లో విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. మరొక ఉగ్రవాదిని ఆసిఫ్ షేక్‌గా పోలీసులు గుర్తించారు. గురీ, షేక్‌లతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు పహల్గాంలో కాల్పులు జరిపి ఉగ్రదాడికి పాల్పడ్డారని సమాచారం. ఈ ఉగ్రవాదులు నలుగురు పాకిస్తాన్ కు చెందిన వారని.. వారిని పట్టుకునేందుకు బలగాలు రంగంలోకి దిగాయి.

ఉగ్రదాడిని ఖండించిన ఒమర్ అబ్దుల్లా

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఇది "అసహ్యకరమైనద", తీవ్రమైన చర్యగా అని అభివర్ణిస్తూ విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సైతం ఉగ్రదాడులను సహించేది లేదన్నారు. 

సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని ప్రధాని మోదీ భారత్‌కు తిరిగొచ్చారు. సౌదీ నుంచి తిరిగొచ్చిన వెంటనే ఢిల్లీ ఎయిర్ పోర్టులో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సహా పలువురు ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్షించారు. ఉగ్రవాదుల దాడి, అనంతరం పరిణామాలపై చర్చించారు. ఉగ్రమూకల ఏరివేతకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను మోదీ  ఆదేశించినట్లు సమాచారం.

టెర్రరిస్ట్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) అనేది లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాద శాఖ. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత ఏర్పడిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులు పహల్గాంలో ఈ దాడికి పాల్పడ్డామని ప్రకటించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget