అన్వేషించండి

Karimnagar: హత్య చేసి గుట్టుగా అంత్యక్రియలకు, నమ్మేసిన జనం - ఆ తప్పిదంతో పట్టేసిన పోలీసులు

పోలీసులు పకడ్బందీగా విచారణ జరపడంతో నిందితులను అరెస్టు అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను నస్పూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో DCP అఖిల్ మహాజన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

వారంతా జట్టుగా కలిసి ఓ హత్య చేశారు.. ఆ హత్య ఎవరు చేశారో గుర్తించకుండా తిరిగి మృతుడి అంత్యక్రియలకు వచ్చి మరీ అందరినీ నమ్మించాలని ప్లాన్ వేశారు. అది దొంగల పని అన్నట్టుగా ఆ ఇంట్లో దొరికిన బంగారం డబ్బులను సైతం ఎత్తుకెళ్లారు. సాక్ష్యాలను మాయం చేశారు. కానీ పోలీసులు పకడ్బందీగా విచారణ జరపడంతో నిందితులను అరెస్టు అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను CC నస్పూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో DCP అఖిల్ మహాజన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

అసలేం జరిగింది?
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం జై గిరి గ్రామానికి చెందిన లింగాల రాజుకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు మార్చి 31, 2019 తేదీన సీసీ నస్పూర్ కు చెందిన పిడిశెట్టి శ్రీధర్ కు ఇచ్చి వివాహం చేశారు. కొద్ది రోజులకు ఒక కొడుకు పుట్టిన తరువాత తన బిడ్డను అల్లుడు కాపురానికి తీసుకెళ్లడం లేదని రాజు మనసులో పెట్టుకున్నాడు. ఈ లోపల అల్లుడు కూడా తన భార్య నుండి విడాకులు కావాలంటూ హనుమకొండ కోర్టులో కేసు వేశాడు. ఎన్నిసార్లు పంచాయితీలకు వెళ్లినా అతని తీరు మారలేదు. దీంతో ఈ విషయంలో పూర్తిగా తన అల్లుడి తల్లిదండ్రుల వ్యవహారం తెరవెనుక ఉండి నడిపిస్తున్నారని అనుమానించిన రాజు వారిని చంపితే గాని అల్లుడు దారికి రాడని హత్యకు కుట్ర పన్నాడు.

దీనికి బయటి వారి కంటే కొడుకు శ్రీకాంత్ పెద్ద కూతురు సాయి తేజ సహకారం అందించాలని కోరారు దీంతో వీరంతా కలిసి ఆగస్టు 8న మధ్యాహ్నం సమయంలో అల్లుడైన శ్రీధర్ ఇంటికి వెళ్లారు. అక్కడ శ్రీలత తండ్రి మొగిలి ఒంటరిగా కనిపించడంతో ముగ్గురు కలిసి దాడికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో చంపి తీరాలని రాజు, మొగిలి గొంతు బిగించగా శ్రీకాంత్ అక్కడే ఉన్నా దిండుతో అదిమిపట్టి హత్య చేశారు. దీనికి కోడలైన తేజశ్రీ కూడా పూర్తిగా సహకరించింది. అతని వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్లను కూడా తన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుంది. ఇదంతా దొంగల పని లాగా కనబడాలని వారి ఇంట్లో ఉన్న బీరువా తెరిచి అందులో నుండి విలువైన బంగారు నగలను దొంగిలించింది.

అంతేకాకుండా, మృతుడి జేబులో ఉన్న డబ్బులను సైతం తీసుకున్నారు. తిరిగి అక్కడి నుండి ఆటోలో మంచిర్యాల రైల్వే స్టేషన్ కి వెళ్లి ముగ్గురూ కలిసి హన్మకొండలోని తమ ఇంటికి వెళ్ళిపోయారు. మధ్యలో రైలు గోదావరి నది దాటుతుండగా తేజస్వి రెండు సెల్ ఫోన్లను నదిలోకి విసిరేసింది. మరోవైపు ఎవరు చంపారో తెలియని పరిస్థితుల్లో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక చనిపోయిన విషయం ఇతరుల ద్వారా తెలుసుకున్నట్టు నటించిన రాజు గుండు చేసుకొని ఎవరు గుర్తు పట్టరని భావించాడు. 

అందరూ కలిసి ఏమీ జరగనట్టుగానే అంత్యక్రియలకు సైతం హాజరయ్యారు. అయితే, ఆ ప్రాంతంలో హత్య జరిగిన సమయంలో ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్స్.. అప్పటికే వీరిపై ఉన్న కారణంగా లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వీరు ముగ్గురు హత్య చేశామని ఒప్పుకున్నారు. ఈ కేసు విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని డీసీపీ అభినందించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget