అన్వేషించండి

Kakinada Crime : కట్టుకున్న భార్యే కడతేర్చింది, క్లోరోఫామ్ ఇచ్చి హత్య, సహాజ మరణంగా డ్రామా!

Kakinada Crime : కాకినాడలో సంచలనమైన పోక్సో స్పెషల్ కోర్టు ఏపీపీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భార్యే భర్తను హత్య చేసి సహజ మరణంగా క్రియేట్ చేసిందని పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు కూడా ఈ కేసు వివరాలు అసంపూర్తిగానే తెలిపారు.

Kakinada Crime : మానవ సంబంధాలు రోజురోజుకీ మంట కలిసిపోతున్నాయి. కట్టుకున్న భార్యే భర్త పాలిట యమపాసంగా మారింది. తన జీవిత భాగస్వామిని విగత జీవిగా మార్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను అతికిరాతకంగా హత్య చేసింది. కాకినాడలో సంచలనం రేకెత్తించిన పోక్సో కోర్టు  స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్బర్ ఆజాం మృతిని హత్య కేసుగా తేల్చారు పోలీసులు. హత్యకు సూత్రధారి  ఆజాం భార్యేనని చెబుతూనే అస్పష్టంగా వివరాలు వెల్లడించడం పలు అనుమానాలు తావిస్తోంది. ఆజం తండ్రి తన కుమారుడిది సహజ మరణం కాదని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఈ కేసు పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సహజ మరణం నుంచి అనుమానాస్పద మృతిగా.. ఆపై హత్య కేసుగా నిర్ధారించారు పోలీసులు. అయితే పోలీసుల ప్రెస్ మీట్ లో పలు సంచలనాలు బయటపెడతారని సర్వత్ర ఆసక్తి నెలకొనగా పోలీసులు మాత్రం కేసు పట్ల అత్యంత సాదాసీదాగా పై పైనే వివరాలు పూర్తిస్థాయిలో వెల్లడించకుండా భార్య పాత్ర గురించి మాత్రమే ప్రస్తావించి అసలు ఈ ఉదంతం ఎలా జరిగిందో తేల్చకుండానే  ముగించడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. 

భార్యే నిందితురాలు 

అక్బర్ ఆజాం కాకినాడలో మంచి పేరున్న న్యాయవాది కాగా కొంత కాలంగా పోక్సో స్పెషల్ కోర్టు ఏపీపీగా పనిచేస్తున్నారు. ఆజాం హత్య కేసుకు సంబంధించి కట్టుకున్న భార్య,  తన ఇద్దరు ప్రియులతో కలిసి భర్తను కడతీర్చేన విషయాన్ని మృతుని భార్య అహ్మద్ ఉన్నీసా నేరాన్ని అంగీకరించిందని పోలీసులు అస్పష్టంగా పేర్కొని పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. నిందితురాలు మహమ్మద్ అహ్మద్ ఉన్నిసాని రిమాండ్ కు తరలించామని,  ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు  అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. మృతుని కుటుంబం చెప్పిన వివరాలు ఒక విధంగాను, పోలీసులు వెల్లడించిన సమాచారం మరో విధంగా ఉండడం ఆసక్తిని కలిగిస్తోంది. 

Kakinada Crime : కట్టుకున్న భార్యే కడతేర్చింది, క్లోరోఫామ్ ఇచ్చి హత్య, సహాజ మరణంగా డ్రామా!

క్లోరోఫామ్ తో హత్య 

అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ వివరాలు వెల్లడిస్తూ ఆజాం భార్య ఉన్నిసాను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించామని, మిగిలిన ఇద్దరు నిందితులు కోసూరి కిరణ్ కుమార్, రాజేష్ జైన్ లను విచారిస్తున్నామని తెలిపారు. అసలు హత్యోదంతంలో ఎవరు ఏ విధంగా హత్యకు పాల్పడింది, సహకరించింది, కట్టుకున్న భర్తను ఎందుకు కడతేర్చాల్సి వచ్చింది అన్న విషయంపై  మాత్రం పోలీసుల నుంచి పూర్తి వివరాలు లభించలేదు.   విచారణలో తేల్చాల్సి ఉందని అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఆజాం హత్య పథకం ప్రకారం జరిగిందని, మృతునికి క్లోరోఫామ్ ఇచ్చి తద్వారా చనిపోయేలా చేశారన్నారు. సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారని, క్లోరోఫామ్ సీసా , ఇందుకు ఉపయోగించిన నమాజ్ టోపీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

ఫోన్ సంభాషణలతో 

జూన్ 23న పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్బర్ ఆజాం మృతి చెందినట్లుగా అతని భార్య మహమ్మద్ ఉన్నిసా బేగం తెలపడంతో సహజమరణంగా భావించి ఖననం చేశారని, ఆ తర్వాత ఒక ఫోన్లో రికార్డు చేసిన సంభాషణలు, వాట్సాప్ మెసేజ్ ల ద్వారా హత్య జరిగిందనే అనుమానంతో అక్బర్ ఆజాం తండ్రి హుస్సేన్ ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. దర్యాప్తులో భాగంగా ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామని, విచారణలో కట్టుకున్న భార్య , ఆమె ఇద్దరు ప్రియుళ్లతో కలిసి హత్య చేసినట్లుగా మృతుని భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా ధృవీకరించినట్లు అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. మృతుడు అక్బర్ ఆజాం సోదరుడు కరీం స్పందిస్తూ తమ ఫిర్యాదుపై పోలీసులు స్పందించి దోషులను పట్టుకోవడంతో తన అన్న ఆత్మ శాంతిస్తుందని అన్నారు. 

Also Read : AP News : కూతురు కనిపించట్లేదని పీఎస్ కు వెళ్తే, చావమని సలహా ఇచ్చి మహిళా ఎస్సై!

టాప్ హెడ్ లైన్స్

Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget