అన్వేషించండి

Nayeem case: నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న ఇన్నాళ్లూ అక్కడే తలదాచుకున్నాడు

Nayeem case: గ్యాంగ్ స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్నను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. 

Nayeem case: పోలీసుల ఎన్ కౌంటర్ లో హతం అయిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్నను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో అరెస్ట్ చేసి.. అతడి వద్ద నుంచి 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. నయీమ్ మృతి తర్వాత శేషన్న ల్యాండ్ సెటిల్మెంట్లు, దందాలు చేస్తున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కొంత కాలంగా అతని కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తపేట్ లోని ఓ హోటల్ లో ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకొని అతడిని అరెస్ట్ చేశారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు వివరించారు. అయితే శేషన్నను నాంపల్లి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తామని పోలీసులు వివరించారు. 

నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన శేషన్న..

గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత.. అతని ప్రధాన అనుచరుడు శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటి నుంచి పోలీసుల కళ్లుకప్పి తిరుగుతున్నాడు. అతని దగ్గర నుంచి 9 ఎంఎం పిస్టల్ దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల దగ్గర ఉండే హిస్టల్ ఆయన దగ్గరకు ఎలా వెళ్లింది, ఇప్పటి వరకు ఆయన నిర్వహించిన సెటిల్మెంట్ లు, ఆయనకు ఆశ్రయం కల్పించింది ఎవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నాడు. ఇంకా నయీమ్ ఆస్తులు, డంప్ లకు సంబంధించి కూడా శేషన్నకు పూర్తిగా తెలుసని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్ కౌంటర్ సమయంలో నయీం దగ్గర దొరికిన ఏకే-47తో పాటు అతడి డెన్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాలకు సంబంధించి కూడా శేషన్న నుంచి పలు వివరాలు సేకరించనున్నారు. 

ఇన్నాళ్లూ శేషన్న అక్కడే తలదాచుకున్నాడు..

నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడరు. 2018లో శేషన్నను పట్టుకుని తీరుతామని డీజీపీ మహేందర్‌ రెడ్డి ప్రకటించినా... పోలీస్‌ నిఘాకు చిక్కకుండా శేషన్న తప్పించుకు తిరుగుతున్నాడు. నయీమ్ ఎన్‌కౌంటర్‌ తర్వాత ప్రధాన అనుచరులైన శేషన్న, రామయ్య, జహంగీర్‌ మాయమయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన శేషన్న మావోయిస్టు పార్టీలో చేరిన సమయంలోనే నయీంతో పరిచయం ఏర్పడింది. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి సొంతంగా గ్యాంగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ కేంద్రంగా ప్రారంభమైన నయీం గ్యాంగ్‌ అరాచకాలు శేషన్నకు పట్టుఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎక్కువగా చోటు చేసుకున్నాయి. బెదిరింపులు, కిడ్నాప్‌లు, వసూళ్లు, మాట వివని వారిని మట్టుబెట్టేవారు. నయీం టార్గెట్‌ ఫిక్స్‌ చేస్తే శేషన్న పక్కాగా ప్లాన్‌ వేసి అమలు చేసేవాడు. నయీం నేర సామ్రాజ్యానికి శేషన్న సైన్యాధికారిగా వ్యవహరించేవాడు. నయీం చేసే ప్రతి పనిలోనూ శేషన్న ప్రమేయం ఉండేది. దీంతో నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత పరారీలో ఉన్న శేషన్నకోసం పోలీస్‌లు తీవ్రంగా ప్రయత్నించడంతో కర్నూలు జిల్లాలోని మాజీ మావోయిస్టు వెంకట్‌ రెడ్డి ఆశ్రయం కల్పించినట్లు ఇటీవలే గుర్తించారు. పోలీస్‌లకు తన జాడ తెలిసిందనే విషయం పసిగట్టిన శేషన్న, అతనికి ఆశ్రయం కల్పించిన వెంకట్‌ రెడ్డి పరారయ్యారు.

ఇప్పటికీ కొనసాగుతున్న కేసు..

నయీమ్ కేసుల దర్యాప్తులో ఇప్పటి వరకు అతని కుటుంబ సభ్యులు, గ్యాంగు సభ్యుల్ని అరెస్ట్ చేసినప్పటికీ ప్రధాన అనుచరుడు, నయీం అరాచకల్లో అత్యంత కీలకంగా వ్యవహరించిన శేషన్నకు సంబంధించి పోలీస్ దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో శేషన్నను త్వరలో పట్టుకుంటామని డీజీపీ అప్పట్లో తెలిపారు. ఇక నయీమ్ కేసులో కేవలం ఆరోపణలు, విచారణ సమయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రముఖుల పేర్లు కొందరు వెల్లడించిన ప్రకారం ముందుకు వెళ్లడం కుదరదన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఆధారాల మేరకు నయీమ్ తో  అంటకాగిన ప్రతి ఒక్కరిపై చర్యలు తప్పవని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. నయీం బాధితులకు చట్ట ప్రకారం న్యాయం జరుగుతుందని, వాస్తవానికి నయీం పోలీస్ కాల్పుల్లో మృతి చెందడంతోనే బాధితులకు న్యాయం జరిగిందని డీజీపీ అప్పట్లో  వ్యాఖ్యానించారు. కాగా గ్యంగా స్టర్ సయీం కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 197 కేసులు నమోదు చేసింది. నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత ఎక్కడికక్కడ అతని అనుచరుల్ని అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్, సైబరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్ తోపాటు ఇతర ప్రాంతాల్లో నమోదైన 197 కేసుల్లో 125 మంది నయీం అనుచరుల్ని అరెస్ట్ చేశారు. ఆయా కేసులకు సంబంధించి అప్పటికే న్యాయస్థానాల్లో 18 చార్జిషీట్లు దాఖలు చేశారు. మరికొన్ని కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు, నయీంతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రస్తుత, మాజీ పోలీస్ అధికారులు సిబ్బందితోపాటు మొత్తంగా 878 మంది నుంచి సిట్ వాంగ్మూలాలు సేకరించింది. 107 మంది నిందితుల్ని కస్టడీకి తీసుకుని విచారించిన సిట్ వారి నుంచి నయీం గ్యాంగ్ కార్యకలా పాలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టింది. గ్యాంగ్ స్టర్ నయీం కేసుల్లో పలువురు నిందితులపై పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget