అన్వేషించండి

Hyderabad: తల్లికి అంత్యక్రియలు చేసిన కొడుకు.. వెంటనే అదే శ్మశానంలో ఉరేసుకొని..

తల్లి చనిపోయిందనే బాధ తట్టుకోలేక ఓ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి అంత్యక్రియలు పూర్తి చేసిన వెంటనే అదే శ్మశానంలో ఉరి వేసుకున్నాడు.

కుటుంబ సభ్యులు దూరమైతే కలిగే దు:ఖం వర్ణనాతీతం. తల్లిదండ్రులు లేదా రక్తం పంచుకొని పుట్టినవారు, జీవిత భాగస్వాములు ఉన్నట్టుండి దూరమైతే ఆ బాధ నుంచి కోలుకోవడం చాలా కష్టం. ఆ బాధను దిగమింగుకొని సాధారణ జీవనం కొనసాగించడానికి చాలా సమయం పడుతుంది. అయితే, గతంలో అయిన వారి మరణాన్ని తట్టుకోలేని ఎంతో మంది గుండె పగిలి అక్కడికక్కడే కుప్పకూలిన ఘటనలు, గుండెపోటుతో మరణించిన ఘటనలు ఎన్నో వెలుగుచూశాయి. తాజాగా తల్లి చనిపోయిందనే బాధ తట్టుకోలేక ఓ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి అంత్యక్రియలు పూర్తి చేసిన వెంటనే అదే శ్మశానంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

చిన్నప్పటి నుంచి కూలీ చేసుకుంటూ పెంచి పెద్ద చేసిన తల్లి మరణాన్ని ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. ఇంత కాలం తనను కంటికి రెప్పలా చూసుకున్న తల్లి దూరంకావడం భరించలేక తనువు చాలించాడు. ఆమె అంత్యక్రియలు చేసిన శ్మశానవాటికలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంలోని గోల్నాక శ్యామ్‌ నగర్‌లో నాగేందర్‌, లక్ష్మీబాయి (60) దంపతులు ఉండేవారు. వీరికి ఇద్దరు కుమారులు. ఈ పిల్లల చిన్నతనంలోనే నాగేందర్‌ చనిపోయాడు.

దీంతో తల్లి లక్ష్మి బాయి కూలీ పనులకు వెళ్లి కుమారులు వినోద్‌ కుమార్‌(36), విజయ్‌ కుమార్‌లను పెంచి పెద్ద చేసింది. విజయ్ కుమార్‌కు వివాహం కావడంతో అతను వేరే దగ్గర ఉంటున్నాడు. వినోద్‌ కుమార్‌ అవివాహితుడు కావడం వల్ల తల్లి దగ్గరే ఉంటున్నాడు. ఇతను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, కొంత కాలం క్రితం లక్ష్మీ బాయికి క్యాన్సర్‌ వ్యాధి సోకింది. దీంతో లక్ష్మిబాయి చనిపోగా బుధవారం గోల్నాక హర్రాస్‌ పెంట శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. తల్లి ప్రేమను మరచిపోలేని వినోద్‌ అంత్యక్రియల తర్వాత ఇంటికి వచ్చి.. మళ్లీ ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. శ్మశాన వాటిక షెడ్డులోనే ఉరి వేసుకుని చనిపోయాడు. ఆయనను గురువారం కాటికాపరి గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.

Also Read: Mahabubnagar: బైక్‌పై లవర్స్ త్రిబుల్ రైడింగ్.. మధ్యలో శవం, ఇంతలో షాకింగ్ సీన్

Also Read: Nalgonda Crime: గుడి ముందు మనిషి తలకాయ, ఈ మిస్టరీ కీలక వివరాలు వెలుగులోకి.. మృతుడు ఎవరంటే..

Also Read: అరె ఏంట్రా ఇది.. లోన్ రిజెక్ట్ చేశారని ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు, అంతా బూడిదే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget