అన్వేషించండి

IPL Betting: హైదరాబాద్‌లో భారీగా ఐపీఎల్ బెట్టింగ్, ముఠా అరెస్టు - లక్షల సొమ్ము సీజ్!

Hyderabad News: హైదరాబాద్‌లో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా పోలీసులకు దొరికిపోయింది. క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్న ఇద్దరు సూత్రధారులను పోలీసులు అరెస్టు చేశారు.

Hyderabad IPL Betting: హైదరాబాద్ లో ఆన్ లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.36,14,918 లను స్వాధీనం చేసుకున్నట్లుగా సైబరాబాద్ SOT రాజేంద్రనగర్ టీమ్ పోలీసులు వెల్లడించారు. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నారు అనే సమాచారంపై రామచంద్రాపురం ప్రాంతంలో  రామకృష్ణా గౌడ్, ఉపేందర్ గౌడ్ అనే ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారణ చేయగా.. వారు NICE7777 అనే APP ద్వారా తెలిసిన పంటర్స్ ద్వారా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నట్లు నిర్ధారణ అయింది.

వారి మొబైల్ ఫోన్ లోని యాప్ పరిశీలించగా మొత్తం 42 పంటర్స్ వివరాలను పోలీసులు గుర్తించారు. ఆన్ లైన్ బెట్టింగ్ కు కనెక్ట్ అయిన 5 బ్యాంక్ అకౌంట్స్ లలో ఉన్న మరో రూ.18,40,997 సొమ్మును పోలీసులు ఫ్రీజ్ చేశారు.

బుకీ ల వివరాలు
1. మొగిలిగిడ రామక్రిష్ణ గౌడ్, S/o చెన్నయ్య, వయసు 30, బీరంగూడ (బుకీ)
2. మొగిలిగిడ ఉపేందర్ గౌడ్, S/o చెన్నయ్య, వయసు 40, బీరంగూడ (బుకీ) 
3. సోను (మెయిన్ బుకీ - పరారీ)
4. తలారీ శ్రీనివాస్, S/o హన్మంతు, వయసు 38, గాజుల రామారం (పంటర్)
5. బండి వినయ్ కుమార్, గాజుల రామారం (పంటర్)

ఏటీఎం కార్డు దొంగిలించి డబ్బులు విత్ డ్రా
మరో ఘటనలో ATM కార్డు మోసం వెలుగు చూసింది. కార్డు నుంచి డబ్బులు విత్‌ డ్రా చేయమని సాయం కోరితే ఏకంగా కార్డు మార్చి రూ.1.73 లక్షలు కాజేశాడో కేటుగాడు. ఈ ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగింది. మండల పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన వర్గంటీ పుణ్యవతి జనవరి 27వ తేదీన మేడ్చల్ పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళి అక్కడే ఉన్న ఓ యువకుడికి తన పిన్ నెంబర్ చెప్పి డబ్బులు తీసి ఇవ్వాలని కోరగా అతడు రూ.4 వేలు డ్రా చేసి ఆమె ఏటీఎంకు బదులుగా తన వద్ద ఉన్న మరో ఎస్బీఐ బ్యాంకుకు చెందిన ఏటీఎం ఇచ్చాడు. 

దీంతో తస్కరించిన ఏటీఎం కార్డుతో విడతల వారీగా పుణ్యవతి ఖాతాలో ఉన్న రూ.1.73 లక్షలను కాజేశాడు. కాగా గత నాలుగు రోజుల క్రితం డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్లి డబ్బులు విత్ డ్రా కోసం ప్రయత్నించగా.. ఖాతాలో డబ్బులు లేకపోవడంతో షాక్ గురైన పుణ్యవతి నేడు మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న సెబ్ పోలీసులు
కడప జిల్లాకు తరలిస్తున్న భారీ అక్రమ మద్యాన్ని కర్నూలు ఎస్ఈబీ పోలీసులు సీజ్ చేశారు. కర్నూలు శివారులోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద తనిఖీలో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 240 బాక్సుల 11,520 బాటిళ్ల మద్యాన్ని సీజ్ చేశామని ఎస్ఈబీ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. సీజ్ చేసిన మద్యం విలువ 14 లక్షల 51 వేలు అని, సీజ్ చేసిన వాహనం ధర 4 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మద్యాన్ని కడప జిల్లాకు చెందిన రింగుల భాష అనే వ్యక్తి కీలక సూత్రధారని తెలిపారు. ఇతనిపై ఇప్పటికే వందకు పైగా అక్రమ మద్యం, ఎర్రచందనం తరలింపు కేసులు ఉన్నాయని తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ

వీడియోలు

Trump on Greenland | గ్రీన్‌ లాండ్ కోసం ట్రంప్ ఎందుకు పట్టుబుతున్నాడు | ABP Desam
Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Bangladesh Cricket: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
FIR at home: బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
SIT notice to KTR: ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
Embed widget