అన్వేషించండి

Hyderabad Crime News : మీరపేట్‌ హత్య అప్ డేట్.. అందుకోసమే భార్యను పాశవికంగా హతమార్చిన భర్త

Meerpet Case : వివాహేతర సంబంధం కొనసాగించేందుకు ఓ వ్యక్తి తన భార్యను అమానుషంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Meerpet Case : హైదరాబాద్‌లోని మీర్‌పేటలో జరిగిన హత్యాకేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వివాహేతర సంబంధం కొనసాగించేందుకు ఓ వ్యక్తి తన భార్యను అమానుషంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడు భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలుగా నరికి, వాటిని నీటిలో ఉడికించి చెరువులో పడేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేరానికి ఓ వెబ్‌సిరీస్‌ ప్రేరణగా మారినట్లు పోలీసులు గుర్తించారు.

హత్యకు ముందు పన్నిన పథకం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి (45) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన వెంకటమాధవి (35)తో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురుమూర్తి భారత ఆర్మీలో జవానుగా పనిచేసి నాయక్‌ సుబేదార్‌గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్‌బాగ్ డీఆర్‌డీవోలో కాంట్రాక్ట్ భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. సమీప బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న గురుమూర్తి, భార్యకు విషయం తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. భార్యను అడ్డుగా ఉండడంతో తొలగించాలని నిర్ణయించుకున్న నిందితుడు, సంక్రాంతి సెలవులను అవకాశంగా మార్చుకున్నాడు. తన ఇద్దరు పిల్లలను సోదరి ఇంటికి పంపించి, హత్యకు పక్కా ప్రణాళిక వేసుకున్నాడు.

Also Read: తన్నించుకుని మరీ బదిలీ అయ్యాడు - కడప మహిళా బ్రేక్ ఇన్స్‌పెక్టర్‌తో డీటీసీ అసభ్య ప్రవర్తన !

దారుణ హత్య, అమానుష చర్యలు
జనవరి 15న ఉదయం భార్యతో గొడవ జరగగా, ఆమె తలకు బలమైన గాయాలు తగిలేలా గోడకు కొట్టాడు. తీవ్ర గాయాలతో కిందపడిన మాధవి మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత, ఓటీటీలో చూచిన వెబ్‌సిరీస్‌ తరహాలో మృతదేహాన్ని టాయిలెట్ లోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత మృతదేహపు ముక్కలను నీటితో నింపిన బకెట్లలో వేసి, వాటర్ హీటర్‌తో ఉడికించాడు. మాంసాన్ని ఎముకల నుంచి వేరు చేసి, రోకలితో దంచి ముద్దగా మార్చాడు. అనంతరం అన్ని ముక్కలను సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో పడేశాడు. ఈ మొత్తం ప్రక్రియలో రెండు రోజులు నిద్రలేకుండా శ్రమించినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు.

హత్య అనంతరం బండారం బహిర్గతం
జనవరి 17న సాయంత్రం భార్య కనిపించలేదని మాధవి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి, ఆమె చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా, మాధవి ఇంట్లోకి వెళ్లడం మాత్రమే కనిపించగా, తిరిగి బయటకు వచ్చిన దృశ్యాలు ఎక్కడా కనిపించలేదు. దీంతో పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది.

నిందితుడి ఇంట్లో నిర్వహించిన సోదాల్లో నీటి బకెట్లు, వాటర్ హీటర్, ఇతర కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. హత్యా భయంతో వాళ్లు ఉంటున్న అపార్ట్ మెంట్ ఖాళీ అయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళన రేపింది. నిందితుడు నివాసమున్న జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వరనగర్ అపార్ట్‌మెంట్ అంతా ఖాళీ అయిపోయింది. మిగతా నివాసితులు భయంతో వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. మాధవి హత్య వార్త ఆమె స్వగ్రామమైన రాచర్ల మండలం జేపీ చెరువులో తీవ్ర విషాదాన్ని నింపింది. నిందితుడి తల్లి కూడా ఈ ఘటన జరిగిన వెంటనే హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం.

మహిళల భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు
ఈ అమానుష ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వెబ్‌సిరీస్‌ల ప్రభావం, మహిళలపై పెరుగుతున్న హింస, కుటుంబ కలహాల నుంచి కలిగే ప్రమాదాల గురించి చర్చ నడుస్తోంది. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. మృతురాలి ఆనవాళ్లు లభిస్తే, పిల్లల డీఎన్‌ఏతో పోల్చి మరింత స్పష్టత రాబట్టే అవకాశం ఉంది అని పోలీసులు తెలిపారు.

Also Read: తల్లిని కత్తితో పొడిచి చంపిన కుమారుడు - హైదరాబాద్‌లో ఘోరం - డబ్బుల కోసమే ?

టాప్ హెడ్ లైన్స్

Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
Telangana Mass Killing: పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
Telangana Mass Killing News: రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Embed widget