అన్వేషించండి

ED Searches : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఈడీ సోదాలు- హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఐటీ కంపెనీల్లో తనిఖీలు

ED Searches : దిల్లీ లిక్కర్ స్కాంలో తెలుగు రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు చేసింది. వైసీపీ ఎంపీ మాగుంట ఆఫీస్, నివాసంతో పాటు హైదరాబాద్ , కరీంనగర్ లోని రియల్ ఎస్టేట్ సంస్థల్లో తనిఖీలు చేసింది.

ED Searches : దిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. తెలంగాణలో మరోసారి వరుస దాడులు నిర్వహిస్తోంది. దిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో హైదరాబాద్, కరీంనగర్ లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్ లో  పది ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. మూడు ఐటీ కంపెనీలు, 2 రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో సోదాలు చేశారు. దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం ఈ తనిఖీలు చేపట్టింది. కరీంనగర్ కు చెందిన స్థిరాస్తి వ్యాపారి నివాసంలో సోదాలు చేసిన ఈడీ,  అనంతరం శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తరలించింది.  

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ తనిఖీలు 

హైదరాబాద్ లోని రామంతాపూర్, బంజారాహిల్స్, మాదాపూర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో దాడులు చేసింది ఈడీ. కరీంనగర్‌ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహించింది. శుక్రవారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరోసారి తనిఖీలు చేపట్టిన ఈడీ ఏపీ, తెలంగాణ సహా దిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 40 చోట్ల ఏకకాలంలో దాడులు చేసింది.  ఇందులో భాగంగా 25 ప్రత్యేక బృందాలు  సోమవారం ఉదయం నుంచే నగరంలోని పలు సంస్థల కార్యాలయాలు, నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల్లో ఒకరైన రామచంద్రన్ పిళ్లై యాజమాన్యంలోని రాబిన్ డిస్టిలరీస్ కార్యాలయంలో ఈడీ తనిఖీలు చేసింది. అదే సమయంలో దోమలగూడ అరవింద్‌ కాలనీలోని శ్రీ సాయికృష్ణ అపార్ట్‌మెంట్‌లో చార్టెడ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబుకు చెందిన గోరంట్ల అసోసియేట్స్‌ ఆఫీస్, నివాసంపై దాడులు చేశారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది సహకారంతో ఈడీ అధికారులు బుచ్చిబాబు నివాసం, కార్యాలయంలో తనిఖీలు చేసింది. పలు సంస్థలకు చెందిన ఫైళ్లను గుర్తించారు. కరీంనగర్ లో ఇద్దరు రియల్ ఎస్టేట్ బిల్డర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. 

హైదరాబాద్ లో తనిఖీలు 

గచ్చిబౌలిలోని అభిషేక్ నివాసం, మాదాపూర్‌లోని అనూస్ ప్రధాన కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి చెందిన దిల్లీ, నెల్లూరు నివాసాల్లోనూ ఈడీ సోదాలు చేసింది. నెల్లూరులోని కోటిమొబ్బ సెంటర్‌లో ఉన్న శ్రీనివాసులు ఆఫీసు, చెన్నైలోని మాగుంట అగ్రిఫారంలో ఈడీ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈడీ నుంచి నోటీసులు అందుకున్న వారిలో అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ఐఏఎస్ అధికారి అర్వ గోపీ కృష్ణ, మాగుంట రఘు, అభిషేక్, గోరంట్ల బుచ్చిబాబు, చందన్ రెడ్డి, వై. శశికళ ఉన్నారు.   

రాజకీయ దాడులు కాదు 

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతున్నాయి. ఇందులో భాగంగా ఈడీ అధికారులు ఏపీ, తెలంగాణలోనూ పలు చోట్ల వరుస సోదాలు చేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పై ఆరోపణలు వచ్చాయి. తనపై వచ్చిన ఆరోపణలపై ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి స్పందించారు. మాపై వచ్చిన లిక్కర్ ఆరోపణలు నిరాధారమైనవి అన్నారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారానికి తమకు ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు.  తమ కుటుంబం 70 ఏళ్ల నుండి లిక్కర్ వ్యాపారంలో ఉన్నదని చెప్పారు. 8 రాష్ట్రాలలో మా వ్యాపారాలు ఉన్నాయని, ఎక్కడ మచ్చ లేని వ్యాపారం చేస్తున్నామని ఎంపీ మాగుంట తెలిపారు. తమ చెన్నె, ఢిల్లీ వివాసాల్లో ఇటీవల ఈడీ అధికారులు దాడులు చేశారని, కానీ వారికి అక్రమాలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. పోలీసులు పంచనామాలో కూడా ఇదే రాశారని వెల్లడించారు. తమతో పాటు దేశ వ్యాప్తంగా 32 మంది వ్యాపారులపై ఈడీ తనిఖీలు చేపట్టిందన్నారు. మా కుటుంబం రాజకీయాలో, వ్యాపారాలలో నీతిగా ఉన్నామని, ఎక్కడ అక్రమాలకు పాల్పడిన దాఖలాలు లేవన్నారు. 2024 లో తన కుమారుడు ఒంగోలు ఎంపీ గా పోటీ చేస్తారని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాజాగా ఈడీ జరిపింది కేవలం కేవలం వ్యాపారపరమైన దాడులు గానే భావిస్తున్నామని, ఇవి రాజకీయ దాడులు కానే కాదన్నారు.

Also Read : KCR BJP Agenda : తెలియకుండానే బీజేపీ ట్రాప్‌లో టీఆర్ఎస్ - కేసీఆర్ నిర్ణయాలు కమలం పార్టీకే మేలు చేస్తున్నాయా ?

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget