అన్వేషించండి

ED Searches : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఈడీ సోదాలు- హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఐటీ కంపెనీల్లో తనిఖీలు

ED Searches : దిల్లీ లిక్కర్ స్కాంలో తెలుగు రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు చేసింది. వైసీపీ ఎంపీ మాగుంట ఆఫీస్, నివాసంతో పాటు హైదరాబాద్ , కరీంనగర్ లోని రియల్ ఎస్టేట్ సంస్థల్లో తనిఖీలు చేసింది.

ED Searches : దిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. తెలంగాణలో మరోసారి వరుస దాడులు నిర్వహిస్తోంది. దిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో హైదరాబాద్, కరీంనగర్ లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్ లో  పది ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. మూడు ఐటీ కంపెనీలు, 2 రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో సోదాలు చేశారు. దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం ఈ తనిఖీలు చేపట్టింది. కరీంనగర్ కు చెందిన స్థిరాస్తి వ్యాపారి నివాసంలో సోదాలు చేసిన ఈడీ,  అనంతరం శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తరలించింది.  

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ తనిఖీలు 

హైదరాబాద్ లోని రామంతాపూర్, బంజారాహిల్స్, మాదాపూర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో దాడులు చేసింది ఈడీ. కరీంనగర్‌ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహించింది. శుక్రవారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరోసారి తనిఖీలు చేపట్టిన ఈడీ ఏపీ, తెలంగాణ సహా దిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 40 చోట్ల ఏకకాలంలో దాడులు చేసింది.  ఇందులో భాగంగా 25 ప్రత్యేక బృందాలు  సోమవారం ఉదయం నుంచే నగరంలోని పలు సంస్థల కార్యాలయాలు, నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల్లో ఒకరైన రామచంద్రన్ పిళ్లై యాజమాన్యంలోని రాబిన్ డిస్టిలరీస్ కార్యాలయంలో ఈడీ తనిఖీలు చేసింది. అదే సమయంలో దోమలగూడ అరవింద్‌ కాలనీలోని శ్రీ సాయికృష్ణ అపార్ట్‌మెంట్‌లో చార్టెడ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబుకు చెందిన గోరంట్ల అసోసియేట్స్‌ ఆఫీస్, నివాసంపై దాడులు చేశారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది సహకారంతో ఈడీ అధికారులు బుచ్చిబాబు నివాసం, కార్యాలయంలో తనిఖీలు చేసింది. పలు సంస్థలకు చెందిన ఫైళ్లను గుర్తించారు. కరీంనగర్ లో ఇద్దరు రియల్ ఎస్టేట్ బిల్డర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. 

హైదరాబాద్ లో తనిఖీలు 

గచ్చిబౌలిలోని అభిషేక్ నివాసం, మాదాపూర్‌లోని అనూస్ ప్రధాన కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి చెందిన దిల్లీ, నెల్లూరు నివాసాల్లోనూ ఈడీ సోదాలు చేసింది. నెల్లూరులోని కోటిమొబ్బ సెంటర్‌లో ఉన్న శ్రీనివాసులు ఆఫీసు, చెన్నైలోని మాగుంట అగ్రిఫారంలో ఈడీ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈడీ నుంచి నోటీసులు అందుకున్న వారిలో అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ఐఏఎస్ అధికారి అర్వ గోపీ కృష్ణ, మాగుంట రఘు, అభిషేక్, గోరంట్ల బుచ్చిబాబు, చందన్ రెడ్డి, వై. శశికళ ఉన్నారు.   

రాజకీయ దాడులు కాదు 

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతున్నాయి. ఇందులో భాగంగా ఈడీ అధికారులు ఏపీ, తెలంగాణలోనూ పలు చోట్ల వరుస సోదాలు చేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పై ఆరోపణలు వచ్చాయి. తనపై వచ్చిన ఆరోపణలపై ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి స్పందించారు. మాపై వచ్చిన లిక్కర్ ఆరోపణలు నిరాధారమైనవి అన్నారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారానికి తమకు ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు.  తమ కుటుంబం 70 ఏళ్ల నుండి లిక్కర్ వ్యాపారంలో ఉన్నదని చెప్పారు. 8 రాష్ట్రాలలో మా వ్యాపారాలు ఉన్నాయని, ఎక్కడ మచ్చ లేని వ్యాపారం చేస్తున్నామని ఎంపీ మాగుంట తెలిపారు. తమ చెన్నె, ఢిల్లీ వివాసాల్లో ఇటీవల ఈడీ అధికారులు దాడులు చేశారని, కానీ వారికి అక్రమాలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. పోలీసులు పంచనామాలో కూడా ఇదే రాశారని వెల్లడించారు. తమతో పాటు దేశ వ్యాప్తంగా 32 మంది వ్యాపారులపై ఈడీ తనిఖీలు చేపట్టిందన్నారు. మా కుటుంబం రాజకీయాలో, వ్యాపారాలలో నీతిగా ఉన్నామని, ఎక్కడ అక్రమాలకు పాల్పడిన దాఖలాలు లేవన్నారు. 2024 లో తన కుమారుడు ఒంగోలు ఎంపీ గా పోటీ చేస్తారని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాజాగా ఈడీ జరిపింది కేవలం కేవలం వ్యాపారపరమైన దాడులు గానే భావిస్తున్నామని, ఇవి రాజకీయ దాడులు కానే కాదన్నారు.

Also Read : KCR BJP Agenda : తెలియకుండానే బీజేపీ ట్రాప్‌లో టీఆర్ఎస్ - కేసీఆర్ నిర్ణయాలు కమలం పార్టీకే మేలు చేస్తున్నాయా ?

టాప్ హెడ్ లైన్స్

Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget