అన్వేషించండి

ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్

Tamil Nadu Encounter | ఏటీఎంలలో దోపిడీ ఘటనతో మూడు రాష్ట్రాల పోలీసులు అలర్ట్ అయ్యారు. చివరికి కేరళలో చోరీ చేసిన గ్యాంగ్ తమిళనాడు పోలీసుల ఛేజింగ్, ఎన్ కౌంటర్ కు దొరికిపోయారు.

ATM Robbery In Kerala | నమక్కల్: ఇలాంటి సీన్ సినిమాల్లో చూసింటారు. ఎందుకంటే ఇది అలాంటి ఇలాంటి చోరీ ఘటన కాదు. దొంగల ముఠా కోసం ఏకంగా మూడు రాష్ట్రాల పోలీసులు రంగంలోకి దిగారంటే పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్ కౌంటర్ కు దారితీసి, అందులో ఓ దొంగ హతమయ్యాడు. మరో నిందితుడికి గాయాలయ్యాయి. కేరళలో జరిగిన ఏటీఎం చోరీ ఘటన వివరాలిలా ఉన్నాయి. 

పక్కా స్కెచ్ వేసి ఏటీఎంలలో చోరీలు

హరియాణాకి చెందిన ఓ దొంగల ముఠా ఇటీవల కేరళకు వెళ్లి ఏటీఎంలో దొంగతనం చేసింది. సినిమా సీన్ తరహాలో చేజింగ్ జరిగి అది ఎన్ కౌంటర్ వరకు వెళ్లింది. కేరళలో ఏటీఎంలో రాబరీ చేసిన హరియాణా గ్యాంగ్ చివరకు తమిళనాడులో పట్టుబడింది. ఒక్క చోరీ ఘటనతో మూడు రాష్ట్రాల పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. కేరళలోని త్రిసూర్‌లో ఆరుగురు దొంగలు ప్లాన్ ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ATM)లో చోరీ చేశారు. అక్కడి నుంచి దొంగల ముఠా తమిళనాడుకు పారిపోయింది. కానీ అప్పటికే కేరళ పోలీసుల నుంచి తమిళనాడు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో నమక్కల్ జిల్లాలో దొంగల కోసం కాపు కాశారు. ఓ లారీ కంటైనర్ పోలీసులు సిగ్నల్ ఇస్తున్నా ఆపకుండా వెళ్లిపోయింది. దాంతో పోలీసులు సినిమా సీన్ తరహాలో చోరీ గ్యాంగ్‌ను ఛేజ్ చేశారు. చివరగా పోలీసులు తమను చుట్టుముట్టారని, దొంగల ముఠా కాల్పులకు దిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు  ఎదురు కాల్పులు జరపగా ఓ దొంగ ప్రాణాలు కోల్పోగా... మరో నిందితుడికి గాయాలయ్యాయి. ఈ ఛేజింగ్ క్రమంలో ఓ పోలీస్‌కి కూడా గాయాలయ్యాయి. ఏటీఎంలో చోరీ చేసిన గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేరళలోని త్రిసూర్‌లో దాదాపు మూడు ఏటీఎంలలో చోరీకి పాల్పడ్డారు. మొత్తం 65 లక్షల నగదుని దోచుకెళ్లారు. శుక్రవారం వేకువజామున 2:30 నుంచి 4 గంటల సమయంలో ఈ హరియానా దొంగలు ఏటీఎంలను కొల్లగొట్టారు. చోరీ చేసిన డబ్బును ఓ కారులో దాచి, ఆ కారును లారీ కంటైనర్ లో ఎక్కించి తమిళనాడు వైపు పరారయ్యారు. ఓ వైపు కేరళ పోలీసుల నుంచి సమాచారం అందడంతో తమిళనాడు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు చెక్‌పోస్ట్ వద్ద తమిళనాడు పోలీసులు కంటెయినర్‌ని ఆపే ప్రయత్నం చేయగా.. చోరీ గ్యాంగ్ పారిపోయేందుకు ప్రయత్నించింది.

Also Read: Crime : 69 ఏళ్ల వయసులో పెళ్లి కోసం ఆశపడ్డాడు - ఓ మహిళ కూడా రెడీ - అక్కడే అసలైన ట్విస్ట్

చివరికి పోలీసుల ఛేజ్ లో దొరికిపోతున్నామని తమపై కాల్పులు జరపగా.. ఎదురుకాల్పులు జరిపినట్లు తెలిపారు. ఓ నిందితుడు చనిపోగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. నిందితుల వద్ద తుపాకులు, గ్యాస్ కట్టర్స్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు నమక్కల్ పోలీసులు తెలిపారని కేరళ మీడియా రిపోర్ట్ చేసింది.

Also Read: RP Patnaik : ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget