అన్వేషించండి

ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్

Tamil Nadu Encounter | ఏటీఎంలలో దోపిడీ ఘటనతో మూడు రాష్ట్రాల పోలీసులు అలర్ట్ అయ్యారు. చివరికి కేరళలో చోరీ చేసిన గ్యాంగ్ తమిళనాడు పోలీసుల ఛేజింగ్, ఎన్ కౌంటర్ కు దొరికిపోయారు.

ATM Robbery In Kerala | నమక్కల్: ఇలాంటి సీన్ సినిమాల్లో చూసింటారు. ఎందుకంటే ఇది అలాంటి ఇలాంటి చోరీ ఘటన కాదు. దొంగల ముఠా కోసం ఏకంగా మూడు రాష్ట్రాల పోలీసులు రంగంలోకి దిగారంటే పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్ కౌంటర్ కు దారితీసి, అందులో ఓ దొంగ హతమయ్యాడు. మరో నిందితుడికి గాయాలయ్యాయి. కేరళలో జరిగిన ఏటీఎం చోరీ ఘటన వివరాలిలా ఉన్నాయి. 

పక్కా స్కెచ్ వేసి ఏటీఎంలలో చోరీలు

హరియాణాకి చెందిన ఓ దొంగల ముఠా ఇటీవల కేరళకు వెళ్లి ఏటీఎంలో దొంగతనం చేసింది. సినిమా సీన్ తరహాలో చేజింగ్ జరిగి అది ఎన్ కౌంటర్ వరకు వెళ్లింది. కేరళలో ఏటీఎంలో రాబరీ చేసిన హరియాణా గ్యాంగ్ చివరకు తమిళనాడులో పట్టుబడింది. ఒక్క చోరీ ఘటనతో మూడు రాష్ట్రాల పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. కేరళలోని త్రిసూర్‌లో ఆరుగురు దొంగలు ప్లాన్ ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ATM)లో చోరీ చేశారు. అక్కడి నుంచి దొంగల ముఠా తమిళనాడుకు పారిపోయింది. కానీ అప్పటికే కేరళ పోలీసుల నుంచి తమిళనాడు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో నమక్కల్ జిల్లాలో దొంగల కోసం కాపు కాశారు. ఓ లారీ కంటైనర్ పోలీసులు సిగ్నల్ ఇస్తున్నా ఆపకుండా వెళ్లిపోయింది. దాంతో పోలీసులు సినిమా సీన్ తరహాలో చోరీ గ్యాంగ్‌ను ఛేజ్ చేశారు. చివరగా పోలీసులు తమను చుట్టుముట్టారని, దొంగల ముఠా కాల్పులకు దిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు  ఎదురు కాల్పులు జరపగా ఓ దొంగ ప్రాణాలు కోల్పోగా... మరో నిందితుడికి గాయాలయ్యాయి. ఈ ఛేజింగ్ క్రమంలో ఓ పోలీస్‌కి కూడా గాయాలయ్యాయి. ఏటీఎంలో చోరీ చేసిన గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేరళలోని త్రిసూర్‌లో దాదాపు మూడు ఏటీఎంలలో చోరీకి పాల్పడ్డారు. మొత్తం 65 లక్షల నగదుని దోచుకెళ్లారు. శుక్రవారం వేకువజామున 2:30 నుంచి 4 గంటల సమయంలో ఈ హరియానా దొంగలు ఏటీఎంలను కొల్లగొట్టారు. చోరీ చేసిన డబ్బును ఓ కారులో దాచి, ఆ కారును లారీ కంటైనర్ లో ఎక్కించి తమిళనాడు వైపు పరారయ్యారు. ఓ వైపు కేరళ పోలీసుల నుంచి సమాచారం అందడంతో తమిళనాడు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు చెక్‌పోస్ట్ వద్ద తమిళనాడు పోలీసులు కంటెయినర్‌ని ఆపే ప్రయత్నం చేయగా.. చోరీ గ్యాంగ్ పారిపోయేందుకు ప్రయత్నించింది.

Also Read: Crime : 69 ఏళ్ల వయసులో పెళ్లి కోసం ఆశపడ్డాడు - ఓ మహిళ కూడా రెడీ - అక్కడే అసలైన ట్విస్ట్

చివరికి పోలీసుల ఛేజ్ లో దొరికిపోతున్నామని తమపై కాల్పులు జరపగా.. ఎదురుకాల్పులు జరిపినట్లు తెలిపారు. ఓ నిందితుడు చనిపోగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. నిందితుల వద్ద తుపాకులు, గ్యాస్ కట్టర్స్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు నమక్కల్ పోలీసులు తెలిపారని కేరళ మీడియా రిపోర్ట్ చేసింది.

Also Read: RP Patnaik : ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget