అన్వేషించండి

Kidney Scam: డబ్బులిస్తామని ఆశ చూపి కిడ్నీ కొట్టేశారు - పోలీసులను ఆశ్రయించిన బాధితుడు, వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ ముఠా మోసం

Andhrapradesh News: విజయవాడలో మరోసారి కిడ్నీ రాకెట్ మోసం వెలుగుచూసింది. డబ్బులిస్తామని చెప్పి తన కిడ్నీతీసుకుని మోసం చేశారని ఓ వ్యక్తి గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.

Kidney Rocket Scam In Vijayawada: ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకున్న కిడ్నీ రాకెట్ ముఠా సభ్యులు డబ్బు ఆశ చూపి అతని నుంచి కిడ్నీ కొట్టేశారు. అనంతరం డబ్బులివ్వకుండా మోసం చేశారు. ఈ వ్యవహారంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు (Guntur) చెందిన మధుబాబు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా.. అప్పుల్లో కూరుకుపోయాడు. చివరకు లోన్ యాప్స్ నుంచి సైతం అప్పులు తీసుకున్నాడు. ఏదో విధంగా అప్పులు తీర్చేయాలని భావించాడు. ఈ క్రమంలో ఒకసారి ఫేస్ బుక్‌లో కిడ్నీ దానం చేస్తే డబ్బులు ఇస్తామన్న పోస్ట్ చూశాడు. తనకు డబ్బులు అవసరమని కిడ్నీ ఇచ్చేందుకు తాను సిద్దంగా ఉన్నానని వారిని సంప్రదించాడు.

వెంటనే బాషా అనే వ్యక్తి లైన్‌లోకి వచ్చాడు... తాను కూడా డబ్బులు అవసరమై కిడ్నీ ఇచ్చానని ... అందుకు బదులుగా రూ.30 లక్షలు ఇచ్చారని చెప్పాడు. దీంతో ఆశపడిన మధుబాబు విజయవాడ వెళ్లి భాషాను కలిశాడు. అతను వెంకట్‌ను పరిచయం‌ చేశాడు... తన బావ కిడ్నీ వ్యాదితో బాధ పడుతున్నాడని చెప్పిన వెంకట్..  కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసి కిడ్నీతీసుకున్నారు.

రికార్డులు మార్చి..

కిడ్నీని రక్త సంబంధీకులు లేదా బందువులు మాత్రమే ఇవ్వాలని రూల్స్‌ ఉండడంతో రికార్డులు మార్చి మధుబాబును బంధువుగా చూపారు. ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. లెఫ్ట్ కిడ్నీ తీసుకుంటానని చెప్పి రైట్ కిడ్నీ తీసుకున్నారని బాధితుడు తెలిపారు. ఆపరేషన్ జరిగి ఇంతకాలం అయినా డబ్బు ఇవ్వకపోవడంతో మధుబాబు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఒప్పందం ప్రకారం రూ.30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.1.10 లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన డబ్బులు అడుగుతుంటే తనను బెదిరించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 'మిగిలిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని.. స్నేహితుడిలా కిడ్నీ దానం చేశావ్' అంటూ సదరు ముఠా సభ్యులు బెదిరిస్తున్నారని వాపోయాడు. 

ఎస్పీకి ఫిర్యాదు

తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు మధుబాబు గుంటూరు ఎస్పీని అశ్రయించారు. తన ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా మార్చుకొని తన కిడ్నీ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. కిడ్నీ కోల్పోయిన తర్వాత తన జీవితం మరింత దుర్భరంగా మారిందని.. శక్తి లేకుండా పోయిందని... ఏ పనీ చేయలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read: Eluru News: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం- నలుగురి మృతి- ఓ బాలుడి పరిస్థితి విషమం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
Orissa Fire Accident: ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget