అన్వేషించండి

East Godavari News : తూర్పుగోదావరి జిల్లాలో విషాదం, గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు గల్లంతు

East Godavari News : గోదావరిలో గల్లంతై ఇద్దరు బాలురు మృతి చెందిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో ఐదుగురు పిల్లలు గోదావరిలో స్నానానికి వెళ్లారు.

East Godavari News : తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోదావరి(Godavari River)లో గల్లంతై ఇద్దరు బాలురు మృతి చెందారు. జిల్లాలోని ఆలమూరు మండలం బడుగు వానిలంకలో గోదావరి స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. చెముడు లంకకు చెందిన ఐదుగురు పిల్లలు ఆదివారం సెలవు దినం కావడంతో గోదావరి స్నానానికి వెళ్లారు. వారిలో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని గల్లంతైన చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి స్నానానికి వెళ్లిన వారందరూ 13, 14 ఏళ్ల లోపు వారే. గల్లంతైన ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి(Mla chirla jaggireddy) పరామర్శించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

హోలీ రోజున విషాద ఘటనలు

ఈ ఏడాది హోలీ వేడుకలు పెను విషాదాన్ని నింపాయి. హోలీ రోజు రంగులు చల్లుకున్నాక స్నానానికి వెళ్లి 12 మంది మృతి చెందడం (Tragedy In Holi Celebrations Telangana) విషాదకరం. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ మరణాలు సంభవించాయి.

మెదక్‌ జిల్లాకు చెందిన రామాయి సతీష్‌ (27) భార్య మాధవితో కలిసి హైదరాబాద్‌ మియాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. మక్తలక్ష్మాపురం గ్రామం నుంచి పని కోసం హైదరాబాద్ వచ్చిన సతీష్.. హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు స్వగ్రామానికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి హోలీ ఆడిన తరువాత స్నానం చేసేందుకు చెరువు వద్దకు వెళ్లాడు. కానీ నీళ్లల్లో మునిగిపోవడంతో విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సులానగర్‌‌కు చెందిన గుగులోత్‌ స్వామి ఇంటర్‌ వొకేషనల్‌ కోర్సు చేస్తున్నాడు. హోలీ సెలబ్రేట్ చేసుకున్నాక గొల్లపల్లి ఎత్తిపోతల సమీపంలోని నల్లవాగులో ఈతకు వెళ్లాడు. లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగి మృతి చెందాడు. కర్ణాటకకు చెందిన రాజు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా యంనంపేటలో ఉంటున్నాడు. రాయ్‌చూర్‌కు చెందిన రాజుకు ఏకైక కుమారుడు నరేంద్ర. 15 ఏళ్ల యువకుడు నరేంద్ర హోలీ ఆడిన తరువాత కుంటలో స్నానానికి వెళ్లి ఈత రాక, నీట మునిగాడు. పెద్దపల్లి జిల్లా బోయినిపేట గ్రామానికి చెందిన టీనేజర్ ఎర్రవేన ముఖేష్‌ (14) మిత్రులతో కలిసి హోలీ ఆడాడు. రంగులు కడిగేసుకునేందుకు బొక్కలవాగుకు స్నానానికి వెళ్లాడు. కానీ గుంతలో ఇరుక్కుని చనిపోయాడు. ఈత రాకపోవడంతో విషాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన పేర్ల రామారావు, కటలక్ష్మి దంపతుల కుమారుడు సాగర్‌ (19) స్నేహితులతో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్నాడు. స్నానం చేయడానికి వెళ్లిన సాగర్ చెరువులో పడి చనిపోవడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. 

నిజామాబాద్ జిల్లాల్లో ఇద్దరు.. ఆసిఫాబాద్‌‌లో యువకుడు

నిజామాబాద్‌ జిల్లా నవీపేట జలాల్‌పూర్‌ వాసి గూండ్ల రాజేశ్వర్‌(50) హోలీ రంగులు కడిగేసుకునేందుకు చెరువులో స్నానానికి దిగారు. కానీ నీటి మునిగి అతడు చనిపోయాడు. జిల్లాలోని పెంటాకలాన్‌‌కు చెందిన సుధాకర్‌ అనే యువకుడు హోలీ ఆడిన తరువాత నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లాడు. కానీ కొంత సమయానికి సుధాకర్ కనిపించకపోవడంతో స్నేహితులు అధికారులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో వెతకగా శవం లభ్యమైంది. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో ఉంటున్న దినేష్‌కుమార్‌(21) స్నేహితులతో ఆడి ఆడాక, కుమురం భీం ప్రాజెక్టు వద్దకు స్నానం చేసేందుకు వెళ్లాడు. కానీ కాలు జారి నీటిలో పడిపోయి చనిపోయాడు. ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

నల్గొండలో ఒకరు, ములుగులో మరో యువకుడు..

నల్గొండ జిల్లా సీతారాంపురానికి చెందిన మేడబోయిన భాస్కర్‌(38) మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగి. స్నేహితులతో హోలీ ఆడిన తరువాత కాల్వ వద్దకు వెళ్లాడు. గట్టున కూర్చున్న భాస్కర్ కాల్వలో పడిపోయి, చనిపోయాడని స్నేహితులు తెలిపారు. స్నేహితులు అతడ్ని బయటకు వెలికి తీసినా బలమైన గాయాలు కావడంతో చనిపోయాడు. ములుగు జిల్లాకు చెందిన గీత కార్మికుడు కార్తీక్ హోలీ రోజు గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. నాటు పడవలతో గాలించగా సాయంత్రం అతడి మృతదేహం లభ్యమైంది. హనుమకొండ జిల్లా పంథిని చెందిన తరాల అజయ్‌కుమార్‌ (14), కొత్తగూడెం పట్టణం రుద్రంపూర్‌‌లో ఉంటున్న ఎనిమిదో తరగతి విద్యార్థి బొజ్జం అఖిల్‌ (14) సైతం హోలీ రోజు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఎంతో భవిష్యత్ ఉందని భావించిన కుమారులు చిన్న వయసులోనే చనిపోవడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. స్థానిక నేతలు చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Prime Ministerial candidate Priyanka: ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Prime Ministerial candidate Priyanka: ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
Allu Arjun : బన్నీతోనే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - మరి ఎన్టీఆర్... ప్రొడ్యూసర్ రియాక్షన్ ఇదే!
బన్నీతోనే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - మరి ఎన్టీఆర్... ప్రొడ్యూసర్ రియాక్షన్ ఇదే!
Vijay Hazare Trophy 2025: విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి రోజు 22 సెంచరీలు నమోదు! ఒకే రోజులో పాత రికార్డు బద్దలు!
విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి రోజు 22 సెంచరీలు నమోదు! ఒకే రోజులో పాత రికార్డు బద్దలు!
Mahesh Babu : మిల్క్ బాయ్‌లా మహేష్ బాబు - 'వారణాసి' రాముడు రెడీ అవుతున్నాడా?
మిల్క్ బాయ్‌లా మహేష్ బాబు - 'వారణాసి' రాముడు రెడీ అవుతున్నాడా?
Atal Bihari Vajpayee: అటల్ బిహారీ వాజ్‌పేయి గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? ఆమె కూతురిని మాజీ ప్రధాని దత్తత తీసుకున్నారా?
అటల్ బిహారీ వాజ్‌పేయి గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? ఆమె కూతురిని మాజీ ప్రధాని దత్తత తీసుకున్నారా?
Embed widget