అన్వేషించండి

Delhi Car Blast Case: ఢిల్లీ బాంబు పేలుడు కేసు- ఐ20 కారు ఓనర్, ఉమర్ ఫ్రెండ్ అమీర్ రషీద్ అరెస్ట్

Delhi Red Fort Blast Case | నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో బాంబు పేలుడు జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీనిని ఉగ్రదాడిగా ప్రకటించింది. కేసు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.

Delhi Suicide Bomb Case | ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  కేసు దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ ముఖ్య అనుచరుడు అమీర్ రషీద్ అలీని ఆదివారం (నవంబర్ 16న) ఢిల్లీలో అరెస్టు చేసింది. ఢిల్లీలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఉపయోగించిన కారు i-20 అమీర్ రషీద్ పేరిటే రిజిస్ట్రేషన్ అయిందని ఎన్ఐఏ విచారణలో తేలింది. దాంతో ఎన్ఐఏ ఐ20 కారు ఓనర్ అమీర్ రషీద్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది.  

కేంద్ర దర్యాప్తు సంస్థ అమీర్ పాత్రను వెలుగులోకి తెచ్చింది. అమీర్ రషీద్ ఢిల్లీకి కారు కొనుగోలు చేయడానికి, ఆత్మాహుతి బాంబర్‌కు సహాయం చేయడానికి వచ్చాడని విచారణలో తేలింది. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం కారు నడిపింది ఉమర్ ఉన్ నబీ అని తేలింది. అతను పుల్వామాకు చెందినవాడు, అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అని తెలిసిందే. 

అమీర్ రషీద్ నివాసం ఎక్కడ ?

అమీర్ రషీద్ కాశ్మీర్‌లోని సంబూరా, పంపోర్‌కు చెందినవాడని అధికారులు గుర్తించారు. అతను ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ ఉన్ నబీతో కలిసి ఉగ్రదాడులకు ప్లాన్ చేశాడు. కారు కొనుగోలు చేయడానికి సహాయం చేయడానికి అమీర్ కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి వచ్చాడు, తరువాత IEDని ఉపయోగించి i-20 కారును పేల్చివేశారు. ఈ పేలుడు ఘటనలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

NIA వద్ద ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా?

NIA ఉమర్ కు చెందిన మరో కారును కూడా స్వాధీనం చేసుకుంది. ఇందులో ముఖ్యమైన డిజిటల్ ఆధారాలతో పాటు కొన్ని ముఖ్యమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ప్రమాదంలో 13 మంది అమాయకులు చనిపోవడం, 20 మందికి పైగా గాయపడటం వంటివి అనుకోని సంఘటన కాదు. ఢిల్లీలో ఉగ్ర కుట్రకు  సంకేతం. 

NIA 73 మంది సాక్షులను ప్రశ్నించింది

NIA ఈ కేసును దర్యాప్తు ముమ్మరం చేసింది. ఢిల్లీలో కారు పేలుడు ఘటనలో ఇప్పటివరకు 73 మంది సాక్షులను ప్రశ్నించారు. గాయపడిన వారి వాంగ్మూలాలు కూడా నమోదు చేశారు. దర్యాప్తు ప్రస్తుతం అనేక దేశాలు, రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఢిల్లీ పోలీసులు, J&K పోలీసులు, హర్యానా, యూపీ పోలీసులతో NIAకు చెందిన మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్ కూడా వేగవంతం చేశారు. దర్యాప్తు బృందం పెద్ద మాడ్యూల్‌ను ఛేదించడానికి, దాడి సూత్రధారి కోసం అనేక రాష్ట్రాల్లో దాడులు, తనిఖీలు చేస్తోంది. ఈ కేసులో అనేక అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌లు, విదేశీ సంబంధాలు గుర్తించి, ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. 

నవంబర్ 10న పేలుడు

గత నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట ఎదురుగా ఉన్న ఐ20 కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ కారు పేలుడు ప్రమాదంలో 13 మంది మరణించారు. కేంద్ర ప్రభుత్వం దీనిని ఉగ్రవాద దాడిగా పరిగణించింది. దర్యాప్తు సంస్థలు దేశంలో విస్తరిస్తున్న వైట్ టెర్రర్ గ్రూప్‌ను బహిర్గతం చేశాయి. ఢిల్లీ సహా పలు నగరాలలో దీపావళికి ప్లాన్ చేసినా చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. రిపబ్లిక్ డే కి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారని, నిందితుల నుంచి తెలుసుకున్న వివరాలతో అధికారులు అంచనాకు వస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maoists Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
Pawan Kalyan new movies: డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
Shanmukh Jaswanth : ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
Advertisement

వీడియోలు

Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
Pawan Kalyan new movies: డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
Shanmukh Jaswanth : ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
BJP Politics: కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణకు తీరని అన్యాయం చేశాయి: బండి సంజయ్
కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వల్లే తెలంగాణకు అన్యాయం: బండి సంజయ్
Amaravati Land Pooling: అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
2025లో చరిత్ర సృష్టించిన మారుతి సుజుకీ - హోల్‌సేల్‌, రిటైల్‌ సేల్స్‌లో కొత్త రికార్డులు
డిసెంబర్‌లో బ్లాక్‌బస్టర్‌, 2025లో సేల్స్‌ సునామీ - రికార్డులు తిరగరాసిన మారుతి సుజుకీ
Musi River Development: 4,100 కోట్లతో తొలి దశలో మూసీ అభివృద్ధి - అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
4,100 కోట్లతో తొలి దశలో మూసీ అభివృద్ధి - అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
Embed widget