అన్వేషించండి

Kakinada Fire Accident: పండుగ సరుకుల కోసం వెళ్లొచ్చేసరికి శ్మశానంలా మారిన సార్లంకపల్లె.. కాకినాడ జిల్లాలో అగ్ని ప్రమాదం

కాకినాడ జిల్లా సార్లంకపల్లె గిరిజన తండాలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 38 పూరిళ్లు కాలిబూడిదవ్వగా, 120 మంది గిరిజనులు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు

Andhra Pradesh News | రౌతులపూడి: రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ చేసుకునేందుకు ఊరు సిద్ధంగా ఉంది. కానీ ప్రమాదవశాత్తూ ఆ గ్రామంలో అని ఇళ్లు మొత్తం కాలిపోవడం వారికి నిలువు నీడ లేకుండా చేసింది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని సార్లంకపల్లె గిరిజన తండాలో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. మారుమూల మన్యంలో ఉన్న ఈ తండాలోని 38 పూరిళ్లు అగ్నికి ఆహుతవగా, కేవలం మూడు పక్కా ఇళ్లు మాత్రమే మిగిలాయి. ఈ ప్రమాదంతో దాదాపు 120 మంది గిరిజనులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. అడవిపై ఆధారపడి జీవించే వీరి ఆస్తులన్నీ కళ్లముందే బూడిదైపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పండుగ సామాను కోసం వెళ్లొచ్చేసరికి శ్మశానంలా గ్రామం..
సంక్రాంతి పండుగ వేళ కావడంతో సరుకులు కొనుగోలు చేసేందుకు గ్రామస్థులంతా సోమవారం సాయంత్రం తుని పట్టణానికి వెళ్లారు. వారు తిరిగి వచ్చేలోపే ఊరంతా మంటల్లో చిక్కుకుంది. మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే, ఊరిలో ఉన్న కొద్దిమంది ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. తుని నుంచి అగ్నిమాపక వాహనాలు వచ్చేసరికి ఊరంతా మంటల్లో కాలి బూడిదైంది. అప్పటివరకు సంతోషంగా పండుగ జరుపుకోవాలనుకున్న గిరిజనులకు తమ ఇళ్లు శ్మశానంలా మారడం చూసి తట్టుకోలేకపోయారు.

ప్రమాద వార్త తెలుసుకున్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ వెంటనే సార్లంకపల్లెకు చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున తక్షణ సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించేలా సమన్వయం చేశారు. అసలే చలికాలం, ఆపై పండుగ పూట ఇళ్లు కోల్పోయిన గిరిజనులను ఆదుకోవాలని బంధువలు, చుట్టుపక్కల గ్రామాలవారు కోరుతున్నారు.

కరెంటు లైన్లకు లారీ తగిలి అగ్నిప్రమాదం 
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలో పెను ప్రమాదం తప్పింది. కందులపాడు గ్రామంలో వరి గడ్డి లోడుతో వెళ్తున్న ఒక లారీ ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జి.కొండూరు మండలం కందులపాడు గ్రామంలో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వరి గడ్డిని లోడు చేసుకుని వెళ్తున్న ఒక లారీ, గ్రామ వీధుల గుండా వెళ్తుండగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లకు తగిలింది. గడ్డి కావడంతో నిప్పు రవ్వలు పడగానే మంటలు క్షణాల్లో లారీ అంతటా వ్యాపించాయి. మంటల ధాటికి లారీ డ్రైవర్, క్లీనర్ వెంటనే కిందకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది.

అయితే, ప్రమాదం జరిగిన సమయంలో సకాలంలో ఫైర్ ఇంజన్ అందుబాటులో లేకపోవడంతో మంటలు ఉధృతమయ్యాయి. స్థానికులు నీటితో ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. చూస్తుండగానే లారీ పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదం కారణంగా కందులపాడు ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి పెద్ద ప్రమాదాన్ని నివారించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Advertisement

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget