అన్వేషించండి

Kakinada Fire Accident: పండుగ సరుకుల కోసం వెళ్లొచ్చేసరికి శ్మశానంలా మారిన సార్లంకపల్లె.. కాకినాడ జిల్లాలో అగ్ని ప్రమాదం

కాకినాడ జిల్లా సార్లంకపల్లె గిరిజన తండాలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 38 పూరిళ్లు కాలిబూడిదవ్వగా, 120 మంది గిరిజనులు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు

Andhra Pradesh News | రౌతులపూడి: రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ చేసుకునేందుకు ఊరు సిద్ధంగా ఉంది. కానీ ప్రమాదవశాత్తూ ఆ గ్రామంలో అని ఇళ్లు మొత్తం కాలిపోవడం వారికి నిలువు నీడ లేకుండా చేసింది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని సార్లంకపల్లె గిరిజన తండాలో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. మారుమూల మన్యంలో ఉన్న ఈ తండాలోని 38 పూరిళ్లు అగ్నికి ఆహుతవగా, కేవలం మూడు పక్కా ఇళ్లు మాత్రమే మిగిలాయి. ఈ ప్రమాదంతో దాదాపు 120 మంది గిరిజనులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. అడవిపై ఆధారపడి జీవించే వీరి ఆస్తులన్నీ కళ్లముందే బూడిదైపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పండుగ సామాను కోసం వెళ్లొచ్చేసరికి శ్మశానంలా గ్రామం..
సంక్రాంతి పండుగ వేళ కావడంతో సరుకులు కొనుగోలు చేసేందుకు గ్రామస్థులంతా సోమవారం సాయంత్రం తుని పట్టణానికి వెళ్లారు. వారు తిరిగి వచ్చేలోపే ఊరంతా మంటల్లో చిక్కుకుంది. మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే, ఊరిలో ఉన్న కొద్దిమంది ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. తుని నుంచి అగ్నిమాపక వాహనాలు వచ్చేసరికి ఊరంతా మంటల్లో కాలి బూడిదైంది. అప్పటివరకు సంతోషంగా పండుగ జరుపుకోవాలనుకున్న గిరిజనులకు తమ ఇళ్లు శ్మశానంలా మారడం చూసి తట్టుకోలేకపోయారు.

ప్రమాద వార్త తెలుసుకున్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ వెంటనే సార్లంకపల్లెకు చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున తక్షణ సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించేలా సమన్వయం చేశారు. అసలే చలికాలం, ఆపై పండుగ పూట ఇళ్లు కోల్పోయిన గిరిజనులను ఆదుకోవాలని బంధువలు, చుట్టుపక్కల గ్రామాలవారు కోరుతున్నారు.

కరెంటు లైన్లకు లారీ తగిలి అగ్నిప్రమాదం 
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలో పెను ప్రమాదం తప్పింది. కందులపాడు గ్రామంలో వరి గడ్డి లోడుతో వెళ్తున్న ఒక లారీ ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జి.కొండూరు మండలం కందులపాడు గ్రామంలో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వరి గడ్డిని లోడు చేసుకుని వెళ్తున్న ఒక లారీ, గ్రామ వీధుల గుండా వెళ్తుండగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లకు తగిలింది. గడ్డి కావడంతో నిప్పు రవ్వలు పడగానే మంటలు క్షణాల్లో లారీ అంతటా వ్యాపించాయి. మంటల ధాటికి లారీ డ్రైవర్, క్లీనర్ వెంటనే కిందకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది.

అయితే, ప్రమాదం జరిగిన సమయంలో సకాలంలో ఫైర్ ఇంజన్ అందుబాటులో లేకపోవడంతో మంటలు ఉధృతమయ్యాయి. స్థానికులు నీటితో ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. చూస్తుండగానే లారీ పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదం కారణంగా కందులపాడు ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి పెద్ద ప్రమాదాన్ని నివారించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget