అన్వేషించండి

Kakinada Fire Accident: పండుగ సరుకుల కోసం వెళ్లొచ్చేసరికి శ్మశానంలా మారిన సార్లంకపల్లె.. కాకినాడ జిల్లాలో అగ్ని ప్రమాదం

కాకినాడ జిల్లా సార్లంకపల్లె గిరిజన తండాలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 38 పూరిళ్లు కాలిబూడిదవ్వగా, 120 మంది గిరిజనులు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు

Andhra Pradesh News | రౌతులపూడి: రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ చేసుకునేందుకు ఊరు సిద్ధంగా ఉంది. కానీ ప్రమాదవశాత్తూ ఆ గ్రామంలో అని ఇళ్లు మొత్తం కాలిపోవడం వారికి నిలువు నీడ లేకుండా చేసింది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని సార్లంకపల్లె గిరిజన తండాలో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. మారుమూల మన్యంలో ఉన్న ఈ తండాలోని 38 పూరిళ్లు అగ్నికి ఆహుతవగా, కేవలం మూడు పక్కా ఇళ్లు మాత్రమే మిగిలాయి. ఈ ప్రమాదంతో దాదాపు 120 మంది గిరిజనులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. అడవిపై ఆధారపడి జీవించే వీరి ఆస్తులన్నీ కళ్లముందే బూడిదైపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పండుగ సామాను కోసం వెళ్లొచ్చేసరికి శ్మశానంలా గ్రామం..
సంక్రాంతి పండుగ వేళ కావడంతో సరుకులు కొనుగోలు చేసేందుకు గ్రామస్థులంతా సోమవారం సాయంత్రం తుని పట్టణానికి వెళ్లారు. వారు తిరిగి వచ్చేలోపే ఊరంతా మంటల్లో చిక్కుకుంది. మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే, ఊరిలో ఉన్న కొద్దిమంది ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. తుని నుంచి అగ్నిమాపక వాహనాలు వచ్చేసరికి ఊరంతా మంటల్లో కాలి బూడిదైంది. అప్పటివరకు సంతోషంగా పండుగ జరుపుకోవాలనుకున్న గిరిజనులకు తమ ఇళ్లు శ్మశానంలా మారడం చూసి తట్టుకోలేకపోయారు.

ప్రమాద వార్త తెలుసుకున్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ వెంటనే సార్లంకపల్లెకు చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున తక్షణ సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించేలా సమన్వయం చేశారు. అసలే చలికాలం, ఆపై పండుగ పూట ఇళ్లు కోల్పోయిన గిరిజనులను ఆదుకోవాలని బంధువలు, చుట్టుపక్కల గ్రామాలవారు కోరుతున్నారు.

కరెంటు లైన్లకు లారీ తగిలి అగ్నిప్రమాదం 
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలో పెను ప్రమాదం తప్పింది. కందులపాడు గ్రామంలో వరి గడ్డి లోడుతో వెళ్తున్న ఒక లారీ ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జి.కొండూరు మండలం కందులపాడు గ్రామంలో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వరి గడ్డిని లోడు చేసుకుని వెళ్తున్న ఒక లారీ, గ్రామ వీధుల గుండా వెళ్తుండగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లకు తగిలింది. గడ్డి కావడంతో నిప్పు రవ్వలు పడగానే మంటలు క్షణాల్లో లారీ అంతటా వ్యాపించాయి. మంటల ధాటికి లారీ డ్రైవర్, క్లీనర్ వెంటనే కిందకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది.

అయితే, ప్రమాదం జరిగిన సమయంలో సకాలంలో ఫైర్ ఇంజన్ అందుబాటులో లేకపోవడంతో మంటలు ఉధృతమయ్యాయి. స్థానికులు నీటితో ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. చూస్తుండగానే లారీ పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదం కారణంగా కందులపాడు ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి పెద్ద ప్రమాదాన్ని నివారించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget