అన్వేషించండి

Delhi Blast Case Update: సిసిటీవీలో 2 ఫోన్లు, పేలుడు తరువాత మాయం! ఢిల్లీ పేలుడు సీక్రెట్ తెలిపే ఆధారాలివే

ఎర్రకోట సమీపంలో నవంబర్ 10వ తేదీన కారులో పేలుడు కేసులో నిందితుడు ఉమర్ మొబైల్ ఫోన్ల ద్వారా ఆధారాలు లభించే అవకాశం ఉంది. కానీ ఫోన్లు ఎక్కడ ఉన్నాయనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది.

Delhi Blast Case | ఢిల్లీలోని ఎర్రకోట బయట సోమవారం (నవంబర్ 10)న జరిగిన పేలుడు కేసులో ఆదివారం నాడు ఐ20 కారు ఓనర్‌ను అరెస్ట్ చేశారు. అయితే ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ చివరిసారిగా ఉపయోగించిన 2 మొబైల్ ఫోన్ల నుండి ముఖ్యమైన ఆధారాలు లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్లు దొరికితే, ఉమర్‌తో ఎవరికి లింక్ ఉంది, పేలుడుకు ప్లాన్ చేసింది, నిధులు సమకూర్చింది ఎవరు అనే విషయాలు తేలనున్నాయి. ఈ దాడి ఏదైనా పెద్ద ఉగ్రకుట్రలో భాగమా అనే విషయాలు తెలుసుకోవచ్చని దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు.

దర్యాప్తునకు ఈ రెండు ఫోన్లు కీలకం

హర్యానాలోని ఒక మెడికల్ స్టోర్ సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడు ఉమర్ రెండు మొబైల్ ఫోన్‌లతో కనిపించాడు. దాంతో ఈ ఫోన్లు ఢిల్లీలో కారు పేలుడు దర్యాప్తునకు ప్రధాన ఆధారంగా మారాయి. అధికారుల ప్రకారం, ఉమర్‌తో సంబంధం ఉన్న ఢిల్లీ, ఫరీదాబాద్, మేవాడ్2లకు చెందిన ఐదు మొబైల్ నంబర్‌లను గుర్తించారు, కాని అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 మధ్య ఉపయోగించిన ఉమర్ రెండు కొత్త నంబర్‌లను ఇంకా గుర్తించలేదు. వీటినే మిస్సింగ్ లింక్‌లుగా దర్యాప్తు సంస్థ భావిస్తోంది.

అక్టోబర్‌లో ఫోన్లు, నంబర్‌లను మార్చాడు

పేలుడు కేసు దర్యాప్తులో ఉమర్ అక్టోబర్ 30న తన పాత రెండు నంబర్‌లను క్లోజ్ చేసినట్లు తేలింది. అదే రోజున అతని సన్నిహితుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ పట్టుబడ్డాడు. అరెస్టు వార్త తెలియగానే ఉమర్ తన పాత ఫోన్‌లను ఎక్కడో పారేశాడని, నకిలీ గుర్తింపుతో రెండు కొత్త ప్రీపెయిడ్ నంబర్‌లను తీసుకున్నాడని అధికారులు భావిస్తున్నారు.

చివరి 36 గంటల కదలికలను ట్రాక్ 

గత వారంలో ఎన్‌ఐఏ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కారులో పేల్చివేసుకున్న ఉమర్ చివరి 36 గంటల కదలికలను ట్రాక్ చేశారు. ఫరీదాబాద్ నుండి నూహ్ వరకు, ఆపై ఢిల్లీ వరకు అతని ప్రతి లొకేషన్‌ను సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ టవర్ డంప్, చాట్ డేటా, సాక్షుల వాంగ్మూలాలతో సరిపోల్చారు. నవంబర్ 9 సాయంత్రం తర్వాత ఫుటేజ్‌లో ఉమర్ చేతిలో ఫోన్ కనిపించలేదు. అది ఫైయాజ్ ఇలాహి మసీదు అయినా లేదా ఎర్రకోట పార్కింగ్ అయినా ఫోన్‌లను ఎవరికైనా ఇచ్చాడా లేదా నాశనం చేశాడా అని అనుమానం ఉంది.

దర్యాప్తులో పెద్ద విషయం వెలుగులోకి

నవంబర్ 10న మధ్యాహ్నం 2.30 గంటలకు ఉమర్ తుర్క్‌మాన్ గేట్ మసీదుకు చేరుకుని 15 నిమిషాలు ఒంటరిగా ఉన్నాడు. అతను ఎవరితోనూ మాట్లాడలేదని సిబ్బంది చెప్పారు. కాని డేటా అదృశ్యం కావడంపై దర్యాప్తు చేపట్టారు. బహుశా ఇక్కడే ఫోన్‌లను ఎవరికైనా ఇచ్చి ఉండవచ్చు. అందుకే ఆ సమయంలో మసీదులో ఉన్న ప్రతి ఒక్కరి జాబితాను సిద్ధం చేసి విచారిస్తున్నారు.

ఏటీఎం నుండి ₹76,000 విత్‌డ్రా

నూహ్ సమీపంలోని ఫిరోజ్‌పూర్ జిర్కాలో ఉమర్ నవంబర్ 10 రాత్రి 1:07 గంటలకు ఏటీఎం నుండి డబ్బులు తీస్తున్నట్లు కనిపించాడు. మెడికల్ ఎమర్జెన్సీ  ఉందని చెప్పి రెండుసార్లు కలిపి దాదాపు ₹76,000 విత్‌డ్రా చేశాడని గార్డు చెప్పాడు. దాడి చేయడానికి ముందు ఇది అతని వద్ద ఉన్న నగదు. పేలుడు జరిగిన ప్రదేశంలో పోలీసులకు రెండు లైవ్, ఒక ఖాళీ 9mm కార్ట్రిడ్జ్‌లు లభించాయి. ఈ మందుగుండు సామాగ్రిని సాధారణంగా భద్రతా దళాలు ఉపయోగిస్తాయి. ఉమర్ దగ్గర ఆయుధాలు ఉన్నాయనడానికి సాక్ష్యం లేనప్పటికీ, అతను దారిలో ఆయుధాలను పారేశాడా లేదా ఇది మరే ఇతర వ్యక్తి కార్యకలాపాలకు సంబంధించినదా అని అనుమానాలు ఉన్నాయి. 

అనేక నగరాల్లో ముమ్మర తనిఖీలు

దర్యాప్తు బృందాలు ఇప్పుడు ఫరీదాబాద్, నూహ్, గుర్గావ్, బల్లభ్‌గఢ్‌లలోని మసీదులు, అద్దె గదులు, మెడికల్ షాపులు, కోచింగ్ సెంటర్లు, ఆహార దుకాణాలపై నిరంతరం దాడులు చేస్తున్నాయి. కొత్త అద్దెదారులు, బయటి వ్యక్తుల గుర్తింపుపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల ప్రకారం, ఉమర్ తరచుగా సిమ్ మార్చుకునేవాడు. Signal, Briar వంటి ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగించాడు. కోడ్ పదాలతో మాట్లాడేవాడు. అతడు చివరగా వాడిన ఆ రెండు ఫోన్లు దొరికితే, కుట్రకు సంబంధించిన పూర్తి విషయం బయటపడుతుందని ఒక అధికారి తెలిపారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Advertisement

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget