News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Woman Murder Case: మంజుల హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడించిన శంషాబాద్ డీసీపీ

Manjula's murder case: తన చీరకొంగుతో ఉరివేసి, ఊపిరాడకుండ చేసి మంజులను చంపినట్లు తెలిపారు. మహిళ హత్య కేసులో రిజ్వానతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

FOLLOW US: 
Share:

Shamshabad Woman Murder Case Update:
శంషాబాద్ లో మహిళ దారుణ హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మృతురాలిని రాళ్లకు చెందిన మంజుల గా పోలీసులు గుర్తించారు. రిజ్వానా అనే మహిళ మంజులను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తన చీరకొంగుతో ఉరివేసి, ఊపిరాడకుండ చేసి చంపినట్లు తెలిపారు. మహిళ హత్య కేసులో రిజ్వానతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శంషాబాద్ డీసీపీ ఈ కేసుకు సంబంధించిన వివరాలను  శనివారం మీడియాకు వివరించారు. డీసీపీ నారాయణ మాట్లాడుతూ.... ఈనెల 10వ తేదీన అర్ధరాత్రి మహిళా మృతదేహాన్ని గుర్తించాం. చనిపోయిన మహిళను వడ్ల మంజుల గా గుర్తించాం. రెండు రోజుల కిందట మంజుల కడుపునొప్పి వస్తుందని శంషాబాద్ లోని హాస్పిటల్ కు వెళ్తున్నట్లు భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. తిరిగి రాకపోవడంతో శుక్రవారం సాయంత్రం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో శంషాబాద్ లోని శ్రీనివాస ఎన్ క్లేవ్ వద్ద సగం కాలిపోయిన గుర్తుతెలియని మహిళ మృతి దేహాన్ని పోలీసులు గుర్తించారు. 

భర్త చెప్పిన పోలికలు, ఘటనా స్థలం వద్ద మృతదేహం సరిపోలడంతో హత్యకు గురైంది మంజులగా గుర్తించాము. అయితే మంజుల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం అని విచారణలో తేలింది. రిజ్వానా బేగం అనే మహిళకు మంజుల లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఈ డబ్బుల వ్యవహారం వివాదంతోనే మంజులను రిజ్వాన హత్య చేసింది. ముందుగా మంజుల కళ్ళలో కారం కొట్టి ఆమెపై రిజ్వాన దాడి చేసింది. చీర కొంగుతో మంజుల మెడకు గట్టిగా చుట్టి, ఉపిరాడకుండా చేసి హత్య చేసింది రిజ్వానా.

అనంతరం పెట్రోల్ తో మంజుల మృతదేహాన్ని కాల్చి చంపింది. 24 గంటల్లోనే కేసును ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు రిజ్వానా బేగం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగినందుకు రిజ్వానానే ఇదంతా చేసింది. హత్యకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. 

మంజుల చనిపోయిన తర్వాత ఆమె మెడలో ఉన్నబంగారం చెవుల రింగ్స్, మెడలో ఉన్న తాళిబొట్టు, కాళ్ళ కడియాలు లేవని కుటుంబ సభ్యులు గుర్తించారు. మంజుల వద్ద ఉన్న ఆభరణాల కోసమే హత్య చేశారని తొలుత పోలీసులు భావించారు. కానీ మృతురాలు బంధువులు చెప్పిన వివరాల ప్రకారం పోలీసు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయట పడింది. మంజులను హత్య చేసిన అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను రిజ్వానా దొంగతనం చేసింది. మంజుల మృతదేహాన్ని శంషాబాద్ లోని శ్రీనివాస ఎన్ క్లేవ్వ వద్దకు తీసుకెళ్లి, అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు దర్యాప్తులో రిజ్వాన ఒప్పుకుంది. అనంతరం వాటిని ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టింది. ఈ క్రమంలో భర్తతో కలిసి అజ్మీర్ వెళ్లిపోవడానికి రిజ్వాన టికెట్స్ కూడా బుక్ చేసిందని పోలీసులు తెలిపారు. పోలీసుల తక్షణమే స్పందించి దర్యాప్తు చేపట్టడంతో నిందితులు దొరికారు.

Published at : 12 Aug 2023 11:35 PM (IST) Tags: Crime News Telugu News Woman Murder Shamshabad

ఇవి కూడా చూడండి

Hyderabad:  హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

Hyderabad: హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

Bhimavaram News: భీమవరంలో దారుణం, పొదల్లో బాలిక డెడ్ బాడీ - ఒంటిపై గాయాలు?

Bhimavaram News: భీమవరంలో దారుణం, పొదల్లో బాలిక డెడ్ బాడీ - ఒంటిపై గాయాలు?

స్పా సెంటర్ వద్ద మహిళపై దాడి, బట్టలు చింపేసి జుట్టు పట్టుకుని లాగి - వీడియో వైరల్

స్పా సెంటర్ వద్ద మహిళపై దాడి, బట్టలు చింపేసి జుట్టు పట్టుకుని లాగి - వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌ బాలిక అత్యాచార ఘటనలో ముగ్గురు అరెస్ట్, బాధితురాలు ఎక్కిన ఆటోలో రక్తపు మరకలు

మధ్యప్రదేశ్‌ బాలిక అత్యాచార ఘటనలో ముగ్గురు అరెస్ట్, బాధితురాలు ఎక్కిన ఆటోలో రక్తపు మరకలు

Shrirampur Police: పుష్ప సినిమా స్టైల్లో గంజాయి స్మగ్లింగ్- ఎలా చేశారో తెలిస్తే షాక్

Shrirampur Police: పుష్ప సినిమా స్టైల్లో గంజాయి స్మగ్లింగ్- ఎలా చేశారో తెలిస్తే షాక్

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం