అన్వేషించండి

Palnadu Crime News: వినుకొండలో వ్యక్తి దారుణ హత్య, అందరూ చూస్తుండగానే కత్తితో నరికిన ప్రత్యర్థి

Andhra Pradesh Crime News | పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని అతడి ప్రత్యర్థి కత్తితో విచక్షణా రహితంగా నరికి హత్య చేయడం కలకలం రేపుతోంది.

YSRCP follower brutal murder in public | వినుకొండ: ఏపీలో మరో దారుణం జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కత్తితో విచక్షణా రహితంగా నరికి హత్య చేయడం కలకలం రేపుతోంది. వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నేత రషీద్ పై ప్రత్యర్థి జిలానీ దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే కత్తితో విచక్షణా రహతంగా దాడి చేశాడు. కత్తి దాడిలో చేతులు తెగిపోయి బాధితుడు ఆర్తనాదాలు చేస్తున్నా, అవేమీ పట్టించుకోకుండా రషీద్ ను ప్రత్యర్థి జిలానీ హత్య చేశాడు.

రషీద్‌ స్థానికంగా ఓ లిక్కర్ షాపులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. ఏం జరిగిందో గానీ రషీద్ పై నిందితుడు జిలానీ కత్తితో దాడిచేశాడు. ఓవైపు చట్టుపక్కల ఉన్నవారు వద్దని వారిస్తున్నా, నిందితుడు ఏమాత్రం పట్టించుకోలేదు. జిలానీ కత్తి దాడిలో చేతి తెగిపోయి, తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే రషీద్ చనిపోయాడు. ఈ దారుణహత్యతో స్థానికంగా భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన నిందితుడ్ని వినుకొండ పోలీసులు పోలీస్‌స్టేషన్‌ను తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Palnadu Crime News: వినుకొండలో వ్యక్తి దారుణ హత్య, అందరూ చూస్తుండగానే కత్తితో నరికిన ప్రత్యర్థి

టీడీపీ గూండాలు నరరూప రాక్షసులుగా మారారంటూ వైసీపీ నేతలు ఫైర్
పల్నాడు జిల్లా వినుకొండలో పార్టీ కార్యకర్త దారుణహత్యపై వైఎస్సార్‌సీపీ స్పందించింది. టీడీపీ గూండా జిలానీ నరరూప రాక్షసుడిగా మారి, వినుకొండ వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం నేత రషీద్‌పై కత్తితో విచక్షణారహితంగా చేశాడని పేర్కొంది. ఈ కత్తి దాడిలో బాధితుడు రషీద్ రెండు చేతులకు,  మెడ, తల భాగాల్లో బలమైన గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రషీద్‌ మృతి చెందాడని వైసీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. మీ హత్యారాజకీయాలకు ఇంకెంత బంది వైసీపీ శ్రేణులు బలికావాలంటూ వైసీపీ ప్రశ్నించింది. దేశంలో ఇంతకంటే దారుణాలు ఎక్కడైనా జరుగుతాయా అని ఏపీ సీఎం చంద్రబాబును, హోం మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరో మంత్రి నారా లోకేష్ లను వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది ఉన్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్వారీ గుంతలో పడి ముగ్గురి మృతి
ఆత్మకూరు(ఎస్‌): ప్రమాదవశాత్తూ క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి చెందారు. సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు (ఎస్‌) మండలం బొప్పారంలో ఈ విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రాజు, బిల్డర్‌గా చేస్తున్న శ్రీపాల్‌రెడ్డిలు స్నేహితులు. వీరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. శ్రీపాల్‌రెడ్డి , రాజు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. బొప్పారంలో ఓ ఫంక్షన్ ఉండటంతో మంగళవారం తమ కుటుంబాలతో హైదరాబాద్ నుంచి వెళ్లి హాజరయ్యారు. శ్రీపాల్‌రెడ్డి, రాజు, ఆయన 12 ఏళ్ల కుమార్తె బుధవారం క్వారీ చూసేందుకు వెళ్లగా, రాజు కూతురు ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడిపోయింది. బాలికను రక్షించేందుకు దిగిన రాజు, శ్రీపాల్‌రెడ్డి అందులోకి దిగారు. కానీ ఈత రాకపోవడంతో మృతి చెందారు. ముగ్గురు చనిపోవడంపై  పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఛత్తీస్‌గఢ్, గడ్చిరోలి సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌, కాల్పుల్లో 12 మంది మావోయిస్టుల హతం 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget