అన్వేషించండి

Palnadu Crime News: వినుకొండలో వ్యక్తి దారుణ హత్య, అందరూ చూస్తుండగానే కత్తితో నరికిన ప్రత్యర్థి

Andhra Pradesh Crime News | పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని అతడి ప్రత్యర్థి కత్తితో విచక్షణా రహితంగా నరికి హత్య చేయడం కలకలం రేపుతోంది.

YSRCP follower brutal murder in public | వినుకొండ: ఏపీలో మరో దారుణం జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కత్తితో విచక్షణా రహితంగా నరికి హత్య చేయడం కలకలం రేపుతోంది. వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నేత రషీద్ పై ప్రత్యర్థి జిలానీ దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే కత్తితో విచక్షణా రహతంగా దాడి చేశాడు. కత్తి దాడిలో చేతులు తెగిపోయి బాధితుడు ఆర్తనాదాలు చేస్తున్నా, అవేమీ పట్టించుకోకుండా రషీద్ ను ప్రత్యర్థి జిలానీ హత్య చేశాడు.

రషీద్‌ స్థానికంగా ఓ లిక్కర్ షాపులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. ఏం జరిగిందో గానీ రషీద్ పై నిందితుడు జిలానీ కత్తితో దాడిచేశాడు. ఓవైపు చట్టుపక్కల ఉన్నవారు వద్దని వారిస్తున్నా, నిందితుడు ఏమాత్రం పట్టించుకోలేదు. జిలానీ కత్తి దాడిలో చేతి తెగిపోయి, తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే రషీద్ చనిపోయాడు. ఈ దారుణహత్యతో స్థానికంగా భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన నిందితుడ్ని వినుకొండ పోలీసులు పోలీస్‌స్టేషన్‌ను తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Palnadu Crime News: వినుకొండలో వ్యక్తి దారుణ హత్య, అందరూ చూస్తుండగానే కత్తితో నరికిన ప్రత్యర్థి

టీడీపీ గూండాలు నరరూప రాక్షసులుగా మారారంటూ వైసీపీ నేతలు ఫైర్
పల్నాడు జిల్లా వినుకొండలో పార్టీ కార్యకర్త దారుణహత్యపై వైఎస్సార్‌సీపీ స్పందించింది. టీడీపీ గూండా జిలానీ నరరూప రాక్షసుడిగా మారి, వినుకొండ వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం నేత రషీద్‌పై కత్తితో విచక్షణారహితంగా చేశాడని పేర్కొంది. ఈ కత్తి దాడిలో బాధితుడు రషీద్ రెండు చేతులకు,  మెడ, తల భాగాల్లో బలమైన గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రషీద్‌ మృతి చెందాడని వైసీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. మీ హత్యారాజకీయాలకు ఇంకెంత బంది వైసీపీ శ్రేణులు బలికావాలంటూ వైసీపీ ప్రశ్నించింది. దేశంలో ఇంతకంటే దారుణాలు ఎక్కడైనా జరుగుతాయా అని ఏపీ సీఎం చంద్రబాబును, హోం మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరో మంత్రి నారా లోకేష్ లను వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది ఉన్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్వారీ గుంతలో పడి ముగ్గురి మృతి
ఆత్మకూరు(ఎస్‌): ప్రమాదవశాత్తూ క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి చెందారు. సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు (ఎస్‌) మండలం బొప్పారంలో ఈ విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రాజు, బిల్డర్‌గా చేస్తున్న శ్రీపాల్‌రెడ్డిలు స్నేహితులు. వీరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. శ్రీపాల్‌రెడ్డి , రాజు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. బొప్పారంలో ఓ ఫంక్షన్ ఉండటంతో మంగళవారం తమ కుటుంబాలతో హైదరాబాద్ నుంచి వెళ్లి హాజరయ్యారు. శ్రీపాల్‌రెడ్డి, రాజు, ఆయన 12 ఏళ్ల కుమార్తె బుధవారం క్వారీ చూసేందుకు వెళ్లగా, రాజు కూతురు ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడిపోయింది. బాలికను రక్షించేందుకు దిగిన రాజు, శ్రీపాల్‌రెడ్డి అందులోకి దిగారు. కానీ ఈత రాకపోవడంతో మృతి చెందారు. ముగ్గురు చనిపోవడంపై  పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఛత్తీస్‌గఢ్, గడ్చిరోలి సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌, కాల్పుల్లో 12 మంది మావోయిస్టుల హతం 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన
భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం!
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
Brother Stabs Sister and Mother: చెల్లిని 84 సార్లు పొడిచి చంపిన అన్న - తల్లిపైనా దాడి- సోషల్ మీడియా వద్దన్నందుకే !
చెల్లిని 84 సార్లు పొడిచి చంపిన అన్న - తల్లిపైనా దాడి- సోషల్ మీడియా వద్దన్నందుకే !

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget