అన్వేషించండి

Online Bettings Suicide : ఆన్లైన్ బెట్టింగులకు మరో ప్రాణం బలి, అప్పుల పాలై యువకుడు ఆత్మహత్య

Online Bettings Suicide : ఆన్ లైన్ బెట్టింగులు మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఆన్ లైన్ బెట్టింగులతో అప్పుల పాలై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి కిషన్ అనే యువకుడు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం రాకపోవడంతో ఇంటివద్దనే ఉంటున్నాడు.

Online Bettings Suicide : తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని పాండవ బస్తీలో సాయి కృష్ణ అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.  సాయి కిషన్ బీటెక్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటూ ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటపడ్డాడు. ఆన్లైన్ గేమ్ లలో బెట్టింగులు వేసి అప్పులు కావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి కిషన్ తండ్రి కూడా గతంలో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సాయి కిషన్ మృతితో ఆ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. 

భార్యాభర్తలు సూసైడ్ 

జగిత్యాల రూరల్ మండలం రఘురాములకోటలో పురుగుల మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్య చేసుకుంది. సింహారాజు మునింధర్(65),  సులోచన(60) పలు రకాల ఇబ్బందులతో మనస్థాపానికి గురి అయ్యి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి తరువాత పురుగుల మందు తాగి భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఓ గదిలో పురుగుల మందు సేవించి పడి ఉండడం చూసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించేలోపు ఇద్దరూ మృతిచెందారని వైద్యులు తెలిపారు. వారి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మద్యానికి బానిసై 

కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ ఆత్మహత్య మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ సుబ్బారావు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు కార్యాలయం ఆవరణలో ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మర్రిపాడు సుబ్బారావు(50) సోమవారం ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం  కానిస్టేబుల్ సుబ్బారావు సోమవారం ఉదయం విధులకు హాజరై రోల్‌కాల్‌ తర్వాత సమీపంలోని శిథిలావస్థ భవనంలో వెళ్లి ఉరేసుకున్నాడని తెలిపారు. మద్యానికి బానిసైన సుబ్బారావు కుటుంబ సభ్యులతో గోడవపడేవారని పోలీసులు అన్నారు. ఆదివారం గ్రామంలో మరిడమ్మ జాతర జరిగిందని, సుబ్బారావు అతిగా మద్యం తాగడంతో అతనికి కుటుంబ సభ్యుల మధ్య మరోసారి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన సుబ్బారావు ఇవాళ ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు రాజారావు ఏఆర్‌ కార్యాలయంలో ఎస్‌టీఎఫ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సుబ్బారావు అల్లుడు బాబు నాయుడు కూడా ఏఆర్‌ కార్యాలయంలో ఆర్‌ఎస్సైగా పనిచేస్తున్నారు.

Also Read : Child Marriage : బర్త్ డే వేడుకల ముసుగులో బాల్య వివాహం, 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget