అన్వేషించండి

Bhadradri News: భద్రాద్రి జిల్లాలో ఘోరం! కత్తులతో గ్రామస్థుల దాడి, ఫారెస్ట్‌ ఆఫీసర్‌ మృతి - ఏం జరిగిందంటే

గొత్తికోయలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలైన ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు మృతి చెందారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం జరిగింది. ఓ ప్రభుత్వ అధికారి గ్రామస్థుల ఆగ్రహానికి గురై ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పోడు భూముల వివాదం నేపథ్యంలో వలస గొత్తికోయలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలైన ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామం ఎర్రబోడులో ప్లాంటేషన్‌ మొక్కలను గుత్తికోయలు నరుకుతుండటంతో వాటిని అడ్డుకునేందుకు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అయితే మొక్కలను నరకవద్దని గుత్తికోయలను హెచ్చరించడంతో గుత్తికోయలు ఆగ్రహం చెందారు.

వారు సహనం  కోల్పోయి ఒక్కసారిగా వేట కొడవళ్లతో ఫారెస్ట్ రేంజ్‌ అధికారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి తీవ్ర గాయాల పాలు అయ్యారు. వెంటనే తోటి సిబ్బంది ఆయన్ను చండ్రుగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటి వరకు ఫారెస్ట్‌ అధికారులు చేసిన దాడిలో గిరిజనులకు గాయాలైనప్పటికీ తొలిసారిగా గుత్తికోయలు దాడి చేయడం, ఈ దాడిలో రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు మృతి చెందడంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. గుత్తికోయలు చేసిన దాడిపై అప్రమత్తమైన పోలీసు అధికారులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.

20 ఏళ్లుగా పోడు వివాదం..

చండ్రుగొండ మండలం ఎర్రబోడు గ్రామంలో వలస గుత్తికోయల పోడు వివాదం 20 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో అనేక మార్లు పోడు భూములకు ట్రెంచ్‌లు కొట్టి వాటిని కాపాడేందుకు పారెస్ట్‌ అధికారులు ప్రయత్నాలు చేశారు. అయితే 20 ఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న భూములకు సంబంధించి తమకు దక్కవనే భావనతో ఇక్కడ గుత్తికోయలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలల క్రితం సైతం పోడు భూముల వివాదంలో ఫారెస్ట్‌ అదికారులు దాడులు చేశారు. 

కాగా తాజాగా అటవీ శాఖ అధికారులు పెంచుతున్న మొక్కలనే ఏకంగా నరికివేసేందుకు వెళ్లిన గుత్తికోయలు దానిని అడ్డుకునేందుకు వచ్చిన అధికారులు, పారెస్ట్‌ సిబ్బందిపై దాడులు చేయడం గమనార్హం. వేట కొడవళ్లతో దాడులకు పాల్పడటంతో ఇప్పుడు ఫారెస్ట్‌ రేంజ్ ఆఫీసర్ మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని అత్యధిక పోడు భూముల వివాదం ఉన్న కొత్తగూడెంలో ఇప్పుడు ఈ ఘటన సంచలనంగా మారింది.

పోడు వ్యవసాయం అంటే..

అడవుల్లోనూ, కొండ వాలుల్లోనూ చిన్న చిన్న చెట్లను, పొదలను నరికి చేసుకునే వ్యవసాయాన్నే పోడు వ్యవసాయమని పిలుస్తారు. గిరిజనులకు అదే జీవనాధారం. సాంప్రదాయ బద్దంగా చేసుకునే ఇలాంటి వ్యవసాయంపై తెలంగాణ రాష్ట్రంలో చాలా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తరతరాలుగా గిరిజనులు పోడు వ్యవసాయం పరిమితంగానే చేసుకుంటూ వస్తున్నారు. కానీ అటవీ సంపద, విస్తీర్ణం తగ్గే కొద్ది ప్రభుత్వం పోడు వ్యవసాయంపై ఫోకస్ పెట్టింది. గిరిజనులు అటవీ చట్టాలను ఉల్లంఘించి వ్యవసాయం చేసుకుంటున్నారనే ఉద్దేశంతో అటవీ అధికారులు వారికి అడ్డుతగులుతూ వస్తున్నారు. దీంతో పోడు భూములు సాగు చేసుకునేవారికి, అటవీ అధికారులకు మధ్య తరచూ ఏదో వివాదం జరుగుతూనే ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Hyderabad Latest News: సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!
సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!
Pradip Guruji: మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
Cement and drum : బ్లూడ్రమ్‌తో భయపెట్టిన భార్య - వెంటనే ప్రియుడితో పంపేసిన భర్త - ప్రాణం కాపాడుకున్నట్లే?
బ్లూడ్రమ్‌తో భయపెట్టిన భార్య - వెంటనే ప్రియుడితో పంపేసిన భర్త - ప్రాణం కాపాడుకున్నట్లే?

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Karimnagar SI Chandrasekhar Suicide : కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
Trump Iran War:ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
రైలులో భోజనం తాజాదో కాదో తెలుసుకునేందుకు ఈ పని చేయండి, చిటికెలో మీకు సమాధానం వచ్చేస్తుంది!
రైలులో భోజనం తాజాదో కాదో తెలుసుకునేందుకు ఈ పని చేయండి, చిటికెలో మీకు సమాధానం వచ్చేస్తుంది!
Embed widget