అన్వేషించండి

Bhadradri News: భద్రాద్రి జిల్లాలో ఘోరం! కత్తులతో గ్రామస్థుల దాడి, ఫారెస్ట్‌ ఆఫీసర్‌ మృతి - ఏం జరిగిందంటే

గొత్తికోయలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలైన ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు మృతి చెందారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం జరిగింది. ఓ ప్రభుత్వ అధికారి గ్రామస్థుల ఆగ్రహానికి గురై ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పోడు భూముల వివాదం నేపథ్యంలో వలస గొత్తికోయలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలైన ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామం ఎర్రబోడులో ప్లాంటేషన్‌ మొక్కలను గుత్తికోయలు నరుకుతుండటంతో వాటిని అడ్డుకునేందుకు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అయితే మొక్కలను నరకవద్దని గుత్తికోయలను హెచ్చరించడంతో గుత్తికోయలు ఆగ్రహం చెందారు.

వారు సహనం  కోల్పోయి ఒక్కసారిగా వేట కొడవళ్లతో ఫారెస్ట్ రేంజ్‌ అధికారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి తీవ్ర గాయాల పాలు అయ్యారు. వెంటనే తోటి సిబ్బంది ఆయన్ను చండ్రుగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటి వరకు ఫారెస్ట్‌ అధికారులు చేసిన దాడిలో గిరిజనులకు గాయాలైనప్పటికీ తొలిసారిగా గుత్తికోయలు దాడి చేయడం, ఈ దాడిలో రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు మృతి చెందడంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. గుత్తికోయలు చేసిన దాడిపై అప్రమత్తమైన పోలీసు అధికారులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.

20 ఏళ్లుగా పోడు వివాదం..

చండ్రుగొండ మండలం ఎర్రబోడు గ్రామంలో వలస గుత్తికోయల పోడు వివాదం 20 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో అనేక మార్లు పోడు భూములకు ట్రెంచ్‌లు కొట్టి వాటిని కాపాడేందుకు పారెస్ట్‌ అధికారులు ప్రయత్నాలు చేశారు. అయితే 20 ఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న భూములకు సంబంధించి తమకు దక్కవనే భావనతో ఇక్కడ గుత్తికోయలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలల క్రితం సైతం పోడు భూముల వివాదంలో ఫారెస్ట్‌ అదికారులు దాడులు చేశారు. 

కాగా తాజాగా అటవీ శాఖ అధికారులు పెంచుతున్న మొక్కలనే ఏకంగా నరికివేసేందుకు వెళ్లిన గుత్తికోయలు దానిని అడ్డుకునేందుకు వచ్చిన అధికారులు, పారెస్ట్‌ సిబ్బందిపై దాడులు చేయడం గమనార్హం. వేట కొడవళ్లతో దాడులకు పాల్పడటంతో ఇప్పుడు ఫారెస్ట్‌ రేంజ్ ఆఫీసర్ మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని అత్యధిక పోడు భూముల వివాదం ఉన్న కొత్తగూడెంలో ఇప్పుడు ఈ ఘటన సంచలనంగా మారింది.

పోడు వ్యవసాయం అంటే..

అడవుల్లోనూ, కొండ వాలుల్లోనూ చిన్న చిన్న చెట్లను, పొదలను నరికి చేసుకునే వ్యవసాయాన్నే పోడు వ్యవసాయమని పిలుస్తారు. గిరిజనులకు అదే జీవనాధారం. సాంప్రదాయ బద్దంగా చేసుకునే ఇలాంటి వ్యవసాయంపై తెలంగాణ రాష్ట్రంలో చాలా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తరతరాలుగా గిరిజనులు పోడు వ్యవసాయం పరిమితంగానే చేసుకుంటూ వస్తున్నారు. కానీ అటవీ సంపద, విస్తీర్ణం తగ్గే కొద్ది ప్రభుత్వం పోడు వ్యవసాయంపై ఫోకస్ పెట్టింది. గిరిజనులు అటవీ చట్టాలను ఉల్లంఘించి వ్యవసాయం చేసుకుంటున్నారనే ఉద్దేశంతో అటవీ అధికారులు వారికి అడ్డుతగులుతూ వస్తున్నారు. దీంతో పోడు భూములు సాగు చేసుకునేవారికి, అటవీ అధికారులకు మధ్య తరచూ ఏదో వివాదం జరుగుతూనే ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
IAS groom turns Fake: ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి.. భార్యను అమ్మేందుకు ప్లాన్.. చివరకు దొరికిపోయాడు ఇలా!
ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి.. భార్యను అమ్మేందుకు ప్లాన్.. చివరకు దొరికిపోయాడు ఇలా!
UP Man Killed By Lover: ఇద్దరు భార్యలు 18 మంది పిల్లలున్నా వివాహేతర బంధం - అదే ప్రాణం తీసింది !
ఇద్దరు భార్యలు 18 మంది పిల్లలున్నా వివాహేతర బంధం - అదే ప్రాణం తీసింది !

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Embed widget