అన్వేషించండి

West Bengal : బెంగాల్ లో దారుణం..మొబైల్ కొనలేకపోవడంతో యువతి ఆత్మహత్య

Mobile Phone : బెంగాల్‌లోని కూచ్‌బెహార్ జిల్లాలో 18 ఏళ్ల యువతి కొత్త మొబైల్ కొనలేక ఆత్మహత్య చేసుకుంది. కళాశాలలో చదువుతున్న నీలా బర్మాన్ నెలల తరబడి కొత్త ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Viral News: ఈ రోజుల్లో క్షణికావేశం చాలా విలువైన జీవితాన్ని నాశనం చేస్తుంది.  జీవితం గురించి అవగాహన లేకపోవడం... తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, పిల్లల కోసం తపన, ఆర్థిక పరిస్థితి పిల్లలు తమ నిగ్రహాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి.చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇంటిలో ఖాళీగా ఉంటే టీవీ లేదా మెుబైల్​ చూస్తాం. ఈ మధ్య చిన్నపిల్లలు కూడా అదే పరిస్థితికి వచ్చారు. వారి దగ్గర ఫోన్ లేక తల్లిదండ్రులను కొనమని హింసిస్తున్నారు. వారు పిల్లలు చెడుపోతారెమో అని భయంతో మెుబైల్​ కొనడానికి సంకోచిస్తున్నారు. అయితే పిల్లలు అనుకొన్నది ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తారు. అదే విధంగా తాజాగా ఓ సంఘటన జరిగింది.  కొత్త మొబైల్‌ ఫోన్‌ కొని ఇవ్వలేదన్న కారణంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బెంగాల్‌లోని కూచ్‌బెహార్ జిల్లాలో జిల్లాలో చోటుచేసుకుంది. 

ఫోన్ కోసం ఎదురు చూసి 
వివరాల్లోకి వెళితే.. బెంగాల్‌లోని కూచ్‌బెహార్ జిల్లాలో 18 ఏళ్ల యువతి కొత్త మొబైల్ ఫోన్ కొనలేక ఆత్మహత్య చేసుకుంది. షిటల్‌కుచి కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న నీలా బర్మాన్ నెలల తరబడి కొత్త ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 'తరుణేర్ శ్వప్నో' పథకం ద్వారా ఆమెకు మూడు నెలల క్రితం ఆర్థిక సహాయం అందింది. కానీ ఆమె తండ్రి కుటుంబ ఖర్చులతో ఇబ్బంది పడుతూ ఆ నిధులను ఇతర అవసరాలకు ఉపయోగించాడు.ఈ నిర్ణయం నీలాకు తీవ్ర బాధ కలిగించింది. ఆమె ఆ డబ్బుతో ఫోన్ కొనాలని ఎన్నో ఆశలు పెట్టుకుందని తెలుస్తోంది. మొబైల్ ఫోన్ కోసం నీలాకు ఉన్న కోరిక నెరవేరకపోవడంతో ఆమె మానసిక ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. సరస్వతి పూజకు ముందు తాను ఫోన్ కొనాలనే కోరికను వ్యక్తం చేశానని ఆమె అక్క మౌషుమి చెప్పింది. ‘‘మా నాన్న ఆమెకు ఫోన్ కొనిస్తానని వాగ్దానం చేశాడు, కానీ ఆమె అతనిని నమ్మలేదు" అని మౌషుమి అన్నారు.

Also Read :KTR: సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు - క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం

వెదురు తోటలో మృతదేహం
ఆదివారం సాయంత్రం నీలా మృతదేహం ఆమె ఇంటికి సమీపంలోని వెదురు తోటలో కనిపించడంతో విషాదకరమైన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు. మరణానికి కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి ఆమె మృతదేహాన్ని పోస్టు మార్టానికి పంపారు. ఈ సంఘటనపై స్వదేశ్ చంద్ర బర్మాన్ సహా పొరుగువారు, ఇతరులు విచారం వ్యక్తం చేశారు. "పదేపదే ఫోన్ అడిగి, అది అందకపోవడంతో ఆమె గుండె పగిలిపోయింది. ఆమె ఈ విధంగా తన జీవితాన్ని ముగించుకోవడం బాధాకరం" అని స్వదేశ్ అన్నారు.

మహారాష్ట్రలో అలాంటిదే
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని బిలోలి  మండంలం మినాకి గ్రామంలో స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని ఓంకార్ (16) అనే విద్యార్థి ఉరేసుకుని చనిపోయాడు .తన అన్నదమ్ములతో కలిసి లాతూర్ జిల్లాలోని ఉద్గిర్ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్న ఓంకార్.. సంక్రాంతి పండుగ నిమిత్తం ఇంటికి వచ్చాడు. తండ్రి వ్యవసాయం, పేదరికం, అప్పుల గురించి ఏమీ ఆలోచించకుండా తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని పట్టబట్టాడు.పంట కోసం తీసుకున్న అప్పు.. పొలం పనుల కోసం తీసుకున్న బైక్ ఈఎఐ చెల్లించడానికే డబ్బు సర్దుబాటు కావడం లేదని తండ్రి కొడుకుకు చెప్పాడట. ఎంత అడిగినా తండ్రి ఒప్పుకోవడం లేదనే డిజప్పాయింట్ మెంట్ తో రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి పొలం దగ్గర చెట్టుకు ఉరేసుకున్నాడు.  

Also Read :Viral Video: ఇతను 2050లో పుట్టాల్సిన వ్యక్తి - ఈవీ కార్‌తో పూరీలు చేసేస్తున్నాడు !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget