అన్వేషించండి

AP Drugs : రూ.9వేల కోట్ల హెరాయిన్ వెనుక అసలు కథేంటి ? కింగ్ పిన్ ఎవరో ఎలా తేలుతుంది ?

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ సరఫరా అవుతోంది బెజవాడకు కాదని ఢిల్లీకి అని పోలీసులు చెబుతున్నారు. ఈ డ్రగ్ రాకెట్ కింగ్ పిన్ కోసం విస్తృత స్థాయిలో పరిశోధన జరుగుతోంది.


గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ.9వేల కోట్ల విలువైన హెరాయిన్ విషయం కీలకమైన మలుపులు తిరుగుతోంది. విజయవాడలో రిజిస్టరైన కంపెనీ వాటిని దిగుమతి చేసుకున్నట్లుగా తేలడంతో  ఆ కంపెనీ ఎవరిది? ఆ హెరాయిన్ అంతా ఎక్కడికి సరఫరా చేస్తారు ? ఆ కంపెనీ వెనుక పెద్దలెవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. విజయవాడలో అషి ట్రేడింగ్ కంపెనీ పేరుతో  ఉన్న  ఓ చిన్నకంపెనీ పేరుతో ఆ హెరాయిన్‌ను దిగుమతి చేసుకున్నారు. కానీ ఆ కంపెనీకి సంబంధించిన వారెవరూ అక్కడ ఉండటం లేదు. కంపెనీ ఫోన్ నెంబర్ కాకినాడకు చెందిన వ్యక్తి పేరు మీద ఉండటంతో అతన్ని పోలీసులు పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. అషి ట్రేడింగ్ కంపెనీ యజమానులు చెన్నైలో ఉంజటంతో వారి కోసం ప్రస్తుతం వేట సాగుతోంది.
AP Drugs : రూ.9వేల కోట్ల హెరాయిన్ వెనుక అసలు కథేంటి ? కింగ్ పిన్ ఎవరో ఎలా తేలుతుంది ?

Also Read : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. కెల్విన్ నిజాలు చెప్పడం లేదా? ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన

ఆ హెరాయిన్ విజయవాడకే వస్తోందా..!?

అఫ్ఘానిస్థాన్‌లోని కాందహార్‌కు చెందిన హసన్‌ హుస్సేన్‌ లిమిటెడ్‌ అనే సంస్థ  ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆశి ట్రేడింగ్‌ ఫర్మ్‌కు ఈ హెరాయిన్ పంపుతోంది. కన్‌సైన్‌మెంట్‌లో  విజయవాడలోని సత్యనారాయణపురం అడ్రస్ ఇచ్చారు. అయితే డెలివరీ ఎక్కడికి అన్నదానిపై స్పష్టత లేదు. ఆ కంపెనీ పేరుతో ఆర్డర్‌ తీసుకున్నారు కానీ డెలివరీ మాత్రం ఢిల్లీకి అని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడి వ్యక్తుల ప్రమేయంపై పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు. ఇప్పటికైతే సీక్రెట్‌గా నార్కోటిక్‌ బ్యూరోతో పాటు  , ఎన్‌ఐఏ, సీబీఐ, సీవీసీ సంస్థలు కూడా దర్యాప్తు ప్రారంభించినట్లుగా చెబుతున్నారు.
AP Drugs : రూ.9వేల కోట్ల హెరాయిన్ వెనుక అసలు కథేంటి ? కింగ్ పిన్ ఎవరో ఎలా తేలుతుంది ?

Also Read : ప్రభుత్వ ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌కు టాలీవుడ్ ఓకే ! పేర్ని నానితో భేటీలో కీలక నిర్ణయాలు 

ఏపీకి రావట్లేదని స్పష్టం చేసిన పోలీసులు  !  

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్‌ విజయవాడకు సరఫరా చేస్తున్నారన్న దాంట్లో నిజం లేదని కమిషనర్‌ బత్తిని శ్రీనివాసులు కూడా ప్రకటించారు.  గుజరాత్‌ ముంద్రా పోర్టు నుంచి దిల్లీకి హెరాయిన్‌ తరలిస్తున్నారని ఆయన తెలిపారు. ఆషీ కంపెనీ లైసెన్స్‌లో విజయవాడ చిరునామా ఉందన్న మాట వాస్తవమే అయినా విజయవాడ కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు జరగట్లేదన్నారు. చెన్నై, అహ్మదాబాద్‌, దిల్లీలో దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేశాయన్నారు. కాబట్టి ఏపీకి ఆ హెరాయిన్ రావడం లేదని.. డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
AP Drugs : రూ.9వేల కోట్ల హెరాయిన్ వెనుక అసలు కథేంటి ? కింగ్ పిన్ ఎవరో ఎలా తేలుతుంది ?

Also Read : పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాకు బెయిల్ మంజూరు

డ్రగ్స్ స్మగ్లింగ్ కింగ్ పిన్ ఎవరు ? ఇప్పటి వరకూ ఎంత స్మగ్లింగ్ జరిగింది ? 

ఏపీలో కంపెనీని రిజిస్టర్ చేశారు కానీ ఆ డ్రగ్స్‌ను ఏపీకి తీసుకురావడం లేదన్న క్లారిటీని పోలీసులు ఇచ్చారు. అంత వరకూ బాగానే ఉన్నా.. అసలు ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ కింగ్ పిన్ ఎవరు అనేది పెద్ద మిస్టరీగా మారింది. అదేమీ సాదాసీదా స్మగ్లింగ్ కాదు. దాదాపుగా తొమ్మిరి వేల కోట్ల రూపాయలు.  ఇప్పుడు పట్టుబడ్డారు కానీ గతంలో ఎన్ని సార్లు ఇలా తీసుకు వచ్చి ఉంటారన్నదానిపైనా స్పష్టత లేదు. అదే సమయంలో తెలుగువారి వంద శాతం సంబంధం ఉండదని చెప్పడానికి కూడా లేదంటున్నారు. ఏ సంబందం లేకుండా తెలుగువారి కంపెనీ పేరుతో దిగుమతి చేసుకోవడం సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. అయితే డ్రగ్స్ కేసులో ఎప్పుడూ అసలు సూత్రధారులు తెర వెనుకే ఉంటారు. ఇప్పుడు కంపెనీని నమోదు చేసి దిగుమతి ప్రయత్నం చేసిన వారికి కూడా ఆ కింగ్ పిన్ ఎవరో తెలియనంత సీక్రెట్‌గా ఉంటారు. దేశ స్థాయిలో అత్యున్నత దర్యాప్తు సంస్థలు విచారణ జరిపితేనే ఆ కింగ్ పిన్ గురించి బయటకు తెలుస్తుంద్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Also Read : ''నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట.. స్టేషన్ లో టాక్ నడుస్తోంది''

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget