అన్వేషించండి

Gudlavalleru Engineering College: గుడ్లవల్లేరు ఘటన - ప్రతి 3 గంటలకోసారి రిపోర్ట్ చేయాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. విచారణకు సంబంధించి ప్రతి 3 గంటలకోసారి తనకు రిపోర్ట్ చేయాలని నిర్దేశించారు.

CM Chandrababu Key Orders On Gudlavalleru Incident: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని (Gudlavalleru Engineering College) హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టారనే అంశంపై విచారణను సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా అధికారులను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించిన సీఎం.. విచారణ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి విచారణ సాగుతోన్న విధానంపై ఆరా తీశారు. ప్రతి 3 గంటలకోసారి తనకు రిపోర్ట్ చేయాలని అధికారులకు నిర్దేశించారు.

మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో.. అంతే సీరియస్‌గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలని సీఎం అన్నారు. విద్యార్థినుల ఆందోళన, ఆవేదనను పరిగణలోకి తీసుకుని పటిష్ట దర్యాప్తు చేయాలని ఆదేశించారు. నేరం జరిగినట్లు రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ఫిర్యాదు చేసినా యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలపైనా విచారణ జరపాలని.. కాలేజీ యాజమాన్యం, అధికారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరూ అధైర్య పడొద్దని.. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే.?

కృష్ణా జిల్లా (Krishna District) గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలోని అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాను కొందరు విద్యార్థినులు గురువారం గుర్తించి హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాలేజీ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదే కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ అమ్మాయే ఈ దారుణానికి పాల్పడినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొంటున్నారు. సీఎం ఆదేశాలతో ఘటనా స్థలానికి వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్, ఎస్పీలను విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిందని.. దోషులు ఎంతటివారైనా వదిలేది లేదని మంత్రి స్పష్టం చేశారు. కాలేజీల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు.

విద్యార్థినుల ఆందోళన

అటు, ఈ ఘటనపై విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ నిరసనలు కొనసాగాయి. అటు, విద్యార్థి సంఘాల నేతలు సైతం కాలేజీ వద్ద ఆందోళన నిర్వహించగా ఉద్రిక్తత నెలకొంది. న్యాయం చేసేంత వరకూ, నేరస్థులను శిక్షించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘం నేతలు తెలిపారు. సీక్రెట్ కెమెరా గురించి వారం ముందు నుంచే యాజమాన్యానికి చెబుతున్నా పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. రాత్రికి రాత్రే ఆ న్యూస్ ఫేక్ అని ప్రచారం చేస్తున్నారని వాపోయారు. న్యాయం చేయాలని అడుగుతుంటే మళ్లీ తమ మీదే రివర్స్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు, ఉద్రిక్తతల క్రమంలో కాలేజీ యాజమాన్యం సెలవు ప్రకటించింది. 

Also Read: West Godavari News: ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిన ప్రేమజంట - ప్రియురాలిని కాపాడి ప్రియుడు మృతి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Ayatollah Khomeini trap Story: సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
Embed widget