![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Road Accident: ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్ - 12 మందికి గాయాలు, కి.మీ మేర నిలిచిన వాహనాలు
Telangana News: కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలో ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
![Road Accident: ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్ - 12 మందికి గాయాలు, కి.మీ మేర నిలిచిన వాహనాలు 12 people injured due to oil tanker collided rtc bus in sathupally in kothagudem district Road Accident: ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్ - 12 మందికి గాయాలు, కి.మీ మేర నిలిచిన వాహనాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/0369ce611771c4071ff5daa70962c4bf1719735524654876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Oil Tanker Collided RTC Bus In Kothagudem District: భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలో ఆర్టీసీ బస్సును ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలు కాగా.. కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం (Khammam) డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమహేంద్రవరం వైపు బయలుదేరింది. ఈ క్రమంలో అటు నుంచి వస్తోన్న ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆయిల్ ట్యాంకర్లో ఇరుక్కున్న డ్రైవర్ను స్థానికుల సాయంతో బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో సుమారు కి.మీ మేర వాహనాలు నిలిచిపోగా.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ పునరుద్ధరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)