అన్వేషించండి

Year Ender 2022: 2022లో జరిగిన మెగా కొనుగోళ్లు &విలీనాలు

మన దేశంలో, ఈ కొనుగోళ్లు & విలీన కార్యకలాపాలు 2022 మొదటి తొమ్మిది నెలల్లో $148 బిలియన్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

Year Ender 2022: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ ట్విట్టర్ డీల్ దగ్గర నుంచి, దాదాపు 69 సంవత్సరాల తర్వాత ఎయిర్ ఇండియాను టాటా సన్స్ తిరిగి దక్కించుకోవడం వరకు చాలా ఉత్సాహభరిత, ఆసక్తికర కొనుగోళ్లు & విలీనాలు (Mergers & Acquisitions లేదా M&As ) 2022 సంవత్సరంలో జరిగాయి. సాంకేతికత, ఆర్థికం, వినోదం సహా చాలా రంగాల్లో కొత్త సంస్థల కొనుగోళ్లు & విలీనాలు జరిగాయి. భవిష్యత్‌లో ఇవి చాలా మార్పులు తీసుకురానున్నాయి.

మన దేశంలో, ఈ కొనుగోళ్లు & విలీన కార్యకలాపాలు 2022 మొదటి తొమ్మిది నెలల్లో $148 బిలియన్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 2021 మొత్తంలో జరిగిన M&As కంటే ఇది 58.2 శాతం ఎక్కువ. అంతకుముందు, 2018లో జరిగిన M&A డీల్స్‌ విలువ $132 బిలియన్లుగా, 2021 వరకు ఇదే రికార్డ్‌ గరిష్టంగా ఉంది. ఫైనాన్షియల్‌ సొల్యూషన్లను అందించే రీఫినిటివ్‌ (Refinitiv) ఈ డేటాను రిలీజ్‌ చేసింది.

2022లో జరిగిన కొన్ని మెగా డీల్స్‌ ఇవి:

ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఆశయం 2022లో నెరవేరింది. JRD టాటా 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌గా స్థాపించారు. ఆ తర్వాత జాతీయీకరణ వల్ల అది ప్రభుత్వపరం అయింది. దాదాపు 69 సంవత్సరాల తర్వాత దానిని కొనుగోలు చేసిన టాటాలు, తిరిగి టాటా గ్రూప్‌లోకి చేర్చారు. రుణాల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా కొనుగోలు కోసం 2021 అక్టోబర్‌లో రూ. 18,000 కోట్లకు బిడ్‌ వేసి టాటా గ్రూప్‌ నెగ్గింది. 2022 జనవరిలో ఈ కంపెనీని భారత ప్రభుత్వం అధికారికంగా టాటా గ్రూప్‌నకు అప్పగించింది.

అతి పెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన ట్విట్టర్‌ను కొంటానని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ 2022 ఏప్రిల్‌లో ప్రకటించారు. అనేక ట్విస్ట్‌ల మధ్య, కార్పొరేట్‌ & టెక్‌ చరిత్రలోనే ఇదొక డ్రామాటిక్‌ అక్విజిషన్‌గా నిలిచింది. 2022 అక్టోబర్‌లో ఈ డీల్‌ను మస్క్‌ పూర్తి చేశారు. ట్విట్టర్‌లో ఒక్కో షేరుకు $54.20 చెల్లించి, మొత్తం ధర సుమారు $44 బిలియన్లకు కొనుగోలు చేశారు. ఆ వెంటనే, CEO పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, లీగల్‌ అఫైర్స్‌ & పాలసీ చీఫ్ విజయ గద్దె సహా టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. కొనుగోలు అనంతర ఖర్చులను తగ్గించేందుకు ఈ కంపెనీ అదే నెలలో దాదాపు 3,700 మందిని ఒక్క ఈ-మెయిల్ ద్వారా తొలగించింది.

గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌, న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్‌లో (NDTV) 29.18 శాతం వాటాను కొనుగోలు చేసింది. రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం, పబ్లిక్ షేర్‌హోల్డర్ల నుంచి మరో 26 శాతాన్ని పొందేందుకు ఓపెన్ ఆఫర్ చేసింది. ఈ బిడ్‌ను ప్రతిఘటించడానికి ప్రయత్నించిన NDTV ప్రమోటర్లు, చివరకు తమ పదవులకు రాజీనామా చేశారు.

మల్టీప్లెక్స్ దిగ్గజాలు PVR, INOX లీజర్ విలీనాన్ని కూడా ఈ సంవత్సరం చూసింది. విలీనం ద్వారా మన దేశంలోనే అతి పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీగా విలీన సంస్థ అవతరిస్తుంది. సంయుక్త సంస్థకు PVR మరియు INOXగా కొనసాగడానికి ఇప్పటికే ఉన్న స్క్రీన్‌ల బ్రాండింగ్‌ను అలాగే కొనసాగిస్తారు. విలీనం తర్వాత ఓపెన్‌ అయ్యే కొత్త సినిమా హాళ్లు PVR INOX బ్రాండ్‌తో నడుస్తాయి.

స్విస్ సిమెంట్ మేజర్, ప్రపంచంలోనే అతి పెద్ద సిమెంట్‌ గ్రూప్‌ హోల్సిమ్ నుంచి అంబుజా సిమెంట్స్ & మరియు ACCని అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలును పూర్తి చేసిన తర్వాత సిమెంట్ స్పేస్‌లో దేశంలో రెండో అతి పెద్ద సిమెంట్ తయారీదారుగా అదానీ గ్రూప్ అవతరించింది. అంబుజా సిమెంట్స్‌లో ఒక్కో షేరుకు రూ. 385 చొప్పున, ఏసీసీలో ఒక్కో షేరుకు రూ. 2,300 చొప్పున అదానీ గ్రూప్‌ చెల్లించింది. మొత్తం డీల్‌ విలువ 6.4 బిలియన్ డాలర్లు. 

హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ ‍‌(HDFC), దాని అనుబంధ సంస్థ HDFC బ్యాంక్‌తో విలీనం మీద చాలా సంవత్సరాల ఊహాగానాలకు స్వస్తి పలికింది. మొదట.. HDFC ఇన్వెస్ట్‌మెంట్స్, HDFC హోల్డింగ్‌ను HDFCలో, ఆ తర్వాత HDFCని  HDFC బ్యాంక్‌లో విలీనం చేయడానికి HDFC బ్యాంక్ బోర్డు ఆమోదించింది. ఈ రెండు ఎంటిటీల విలీనం విషయంలో ఏర్పడ్డ నిబంధనల అవరోధాలు ఒక 'కేస్‌ ఆఫ్‌ స్టడీ'గా మారాయి. 2023 రెండa త్రైమాసికంలో విలీనం పూర్తవుతుందని అంచనా. దీనివల్ల HDFC బ్యాంక్ దగ్గరున్న 16.7 లక్షల కోట్ల రూపాయల ($202 బిలియన్) ఫండ్స్‌ను వినియోగించుకోవడానికి HDFCకి వీలవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Old Currency: 50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Does Gen Z Use Credit Cards:క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 
క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget