అన్వేషించండి

Disqualification on Jagan: లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Jagan: జగన్ లీవ్ లెటర్ ఇస్తే అనర్హతా వేటు ఉండదని స్పీకర్ అయ్యన్న చెప్పారు. అయితే ఇప్పటి వరకూ అలాంటి లేఖ ఏమీ అందలేదన్నారు.

Andhra politics: ఆంధ్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా మూడు వారాల పాటు నిర్వహించాలని అనుకుంటున్నారు.ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యేది లేదని ప్రకటించారు.  సభకు వెళ్లక పోతే మీపై అనర్హతా వేటు వేస్తారంటున్నారని  కొద్ది రోజుల కిందట తాడేపల్లి నివాసంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఓ మీడియా ప్రతినిధి జగన్ ను ప్రశ్నించారు. వారికి బుద్ది పుట్టింది చేసుకోని అని జగన్ తేలికగా తీసుకున్నారు. అంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే అసెంబ్లీకి మాత్రం హాజరయ్యేది లేదని జగన్ తీర్మానించుకున్నారని అనుకోవచ్చు.  

ఇదే అంశంపై ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు.  జగన్ లీవ్ లెటర్ ఇవ్వలేదని..  కంటిన్యూగా 60 రోజులు అనుమతి తీసుకోకుండా గైర్హాజరు అయితే సభ్యత్వం కోల్పోతారని స్పష్టం చేశారు. ,నిబంధన ఉంది దాన్ని అమలు చేయటం సభ బాధ్యత అన్నారు.  60 రోజులు రాకపోతే సభలో పెట్టాలి ఇది తప్పనిసరి అని స్పష్టం చేశారు. అంటే ఒక వేళ జగన్మోహన్ రెడ్డి లీవ్ లెటర్ పంపిస్తే అనర్హతా వేటుకు అవకాశం ఉండదు. లీవ్ లెటర్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నదానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ.. ఆ లెటర్ అంటూ వస్తే  అప్పుడు అనర్హత వేటు గురించి ప్రొసీజర్ ప్రారంభించాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పినట్లుగా అర్థం చేసుకోవచ్చు. 
 
రాజకీయ పరంగా చూస్తే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ జగన్ పై అనర్హతా వేటుకు సిద్ధంగా ఉన్నారని వారి మాటల్ని బట్టి అర్థమైపోతుంది. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవు. కనీసం లీవ్ లెటర్ కూడా పంపరని ఆయన మనస్థత్వం గురించి తెలిసిన వైసీపీ నేతలు చెుబతూంటారు.  తాను ఫలానా కారణంతో రావడం లేదని స్పీకర్ కు లెటర్ పంపితే అప్పుడు ఏం చేస్తారో తెలియదు కానీ.. ఇప్పటి వరకూ అయితే ఎలాంటి లేఖలు పంపలేదు. తాను సభలో ఏకైక ప్రతిపక్ష నాయకుడ్ననని తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకే రావడం లేదని.. తాను హైకోర్టులో పిటిషన్ వేసినా.. దానికి స్పీకర్ సమాధానం ఇవ్వడం లేదని ఆయనకు లేఖ రాసే అవకాశాలు ఉన్నాయి. దాన్నేకారణంగా చూపి తాను అసెంబ్లీకి రావడం లేదని చెప్పే అవకాశాలున్నాయంటున్నారు. 

అయితే అసెంబ్లీకి హాజరు కాని కారణంగా  స్పీకర్ అనర్హతా వేటు వేస్తే ఒక్క జగన్ పై కాదు.. అందరు ఎమ్మెల్యేలపై వేయాల్సి వస్తుంది.  అది రాజకీయంగా సంచలనం అవుతుంది. ప్రతిపక్షం మొత్తం ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయడం దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే మొదటి సారి అవుతుంది. అలాంటి రిస్క్ టీడీపీ ప్రభుత్వం చేసే అవకాశం ఉండదని అంటున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల్లో కొంత మందిని సభకు వచ్చేలా చేసి.. జగన్ ఒక్కరిపై అనర్హతా వేటు వేసే వ్యూహాన్ని కూడా టీడీపీ అమలు చేసే చాన్స్ ఉందంటున్నారు. 

Also Read: Chilukur Temple: చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్‌పై దుండగుల దాడి కేసు, నిందితుల అరెస్ట్

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget