అన్వేషించండి

Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం గుడ్ న్యూస్ - అమాంతం పెరిగిన షేర్ ధర

AGR dues: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ఏజీఆర్ బకాయిల విషయంలో గొప్ప రిలీఫ్ ఇచ్చింది. దీంతో ఆ కంపెనీ షేర్లు పెరిగాయి.

Vodafone Idea shares jump:  కేంద్ర ప్రభుత్వం వోడాఫోన్ ఐడియా సంస్థకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడంతో, ఆ సంస్థ షేర్లు స్టాక్ మార్కెట్‌లో భారీగా పెరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం జరిగిన సమావేశంలో వోడాఫోన్ ఐడియాకు సంబంధించి సుమారు రూ.87,695 కోట్ల సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం బకాయిలపై ఐదేళ్ల పాటు మోరటోరియం విధించేందుకు ఆమోదం తెలిపింది. ఈ బకాయిలను ఇప్పుడు ఆర్థిక సంవత్సరం 2031-32 నుండి 2040-41 మధ్య కాలంలో చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల కంపెనీపై ఉన్న తక్షణ ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది.

మార్చి 2026 నుండి ప్రారంభం కావాల్సిన భారీ చెల్లింపులను ప్రభుత్వం 2032 వరకు వాయిదా వేసింది. ఈ మోరటోరియం కాలంలో బకాయిలపై ఎటువంటి అదనపు వడ్డీ లేదా పెనాల్టీలు విధించరు. వోడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి ఉన్న దాదాపు  49 శాతం వాటాను కాపాడుకోవడానికి, టెలికాం రంగంలో పోటీని నిలబెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
ప్రభుత్వ నిర్ణయం వెలువడకముందే, రిలీఫ్ ప్యాకేజీ వస్తుందనే అంచనాలతో షేర్ ధర 52 వారాల గరిష్టానికి చేరినప్పటికీ, నిర్ణయం వెలువడిన తర్వాత మార్కెట్‌లో కొంత లాభాల స్వీకరణ కనిపించింది. బకాయిలను పూర్తిగా రద్దు చేయకుండా కేవలం వాయిదా వేయడంతో, ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తత పాటించారు. ఫలితంగా, గరిష్ట స్థాయి నుండి షేర్ ధర కొంత మేర వెనక్కి తగ్గింది.

సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం, AGR బకాయిలను పునఃసమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉండటంతో ఈ ఊరట లభించింది. ఈ నిర్ణయం వల్ల వోడాఫోన్ ఐడియాకు తన నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడానికి మరియు 5G సేవలను వేగవంతం చేయడానికి అవసరమైన నిధులను సమీకరించుకునే అవకాశం లభిస్తుంది. 20 కోట్ల మంది వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ 'లైఫ్ లైన్' అందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

టెలికాం రంగంలో ఏజీఆర్  అంటే సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం. ఏజీఆర్ బకాయిలు అనేది గత రెండు దశాబ్దాలుగా నడుస్తున్న ఒక పెద్ద వివాదం. టెలికాం కంపెనీలు తాము సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఈ మొత్తం సుమారు 8 శాతం.   స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీల  సుమారు 3-5 శాతం  చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును లెక్కించేందుకు ప్రాతిపదికగా తీసుకునే ఆదాయాన్నే 'ఏజీఆర్' అంటారు.

టెలికాం సేవలతో పాటు డివిడెండ్లు, డిపాజిట్లపై వచ్చే వడ్డీ, ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే లాభం వంటి టెలికామేతర ఆదాయాన్ని కూడా ఏజీఆర్‌లో కలపాలని ప్రభుత్వం  వాదించింది.  కేవలం ఫోన్ కాల్స్, డేటా వంటి టెలికాం సేవల ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రమే ఫీజు కట్టాలని కంపెనీలు వాదించాయి. ఈ వివాదం 2005 నుండి సుప్రీంకోర్టులో కొనసాగింది. చివరకు 2019లో సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్వచనాన్నే సమర్థించింది. అంటే, కంపెనీలు గత 15-20 ఏళ్ల ఆదాయంపై అన్ని రకాల ఫీజులు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అసలు బకాయి కంటే దానిపై పడిన వడ్డీ, పెనాల్టీలు, మరియు పెనాల్టీపై వడ్డీ భారీగా పెరిగిపోయాయి. మొత్తం బకాయిల్లో దాదాపు 75 శాతం భాగం ఈ వడ్డీలు, జరిమానాలే ఉండటం గమనార్హం. కంపెనీలు తాము చెల్లించాల్సిన బకాయిలు తక్కువని భావించగా, ప్రభుత్వం లెక్కించిన గణాంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
Why Gold Rates Down: యుద్ధం ఉన్నా బంగారం రేటు ఎందుకు తగ్గుతోంది? - లక్షకు చేరుతుందా?
యుద్ధం ఉన్నా బంగారం రేటు ఎందుకు తగ్గుతోంది? - లక్షకు చేరుతుందా?
LPG cylinder Price: భారత్‌లో వంట గ్యాస్ కొరత ముంచుకొస్తుందా? ప్రభుత్వం ఎలా ఎదుర్కోనుంది?
భారత్‌లో వంట గ్యాస్ కొరత ముంచుకొస్తుందా? ప్రభుత్వం ఎలా ఎదుర్కోనుంది?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
Embed widget