అన్వేషించండి

Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం గుడ్ న్యూస్ - అమాంతం పెరిగిన షేర్ ధర

AGR dues: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ఏజీఆర్ బకాయిల విషయంలో గొప్ప రిలీఫ్ ఇచ్చింది. దీంతో ఆ కంపెనీ షేర్లు పెరిగాయి.

Vodafone Idea shares jump:  కేంద్ర ప్రభుత్వం వోడాఫోన్ ఐడియా సంస్థకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడంతో, ఆ సంస్థ షేర్లు స్టాక్ మార్కెట్‌లో భారీగా పెరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం జరిగిన సమావేశంలో వోడాఫోన్ ఐడియాకు సంబంధించి సుమారు రూ.87,695 కోట్ల సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం బకాయిలపై ఐదేళ్ల పాటు మోరటోరియం విధించేందుకు ఆమోదం తెలిపింది. ఈ బకాయిలను ఇప్పుడు ఆర్థిక సంవత్సరం 2031-32 నుండి 2040-41 మధ్య కాలంలో చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల కంపెనీపై ఉన్న తక్షణ ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది.

మార్చి 2026 నుండి ప్రారంభం కావాల్సిన భారీ చెల్లింపులను ప్రభుత్వం 2032 వరకు వాయిదా వేసింది. ఈ మోరటోరియం కాలంలో బకాయిలపై ఎటువంటి అదనపు వడ్డీ లేదా పెనాల్టీలు విధించరు. వోడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి ఉన్న దాదాపు  49 శాతం వాటాను కాపాడుకోవడానికి, టెలికాం రంగంలో పోటీని నిలబెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
ప్రభుత్వ నిర్ణయం వెలువడకముందే, రిలీఫ్ ప్యాకేజీ వస్తుందనే అంచనాలతో షేర్ ధర 52 వారాల గరిష్టానికి చేరినప్పటికీ, నిర్ణయం వెలువడిన తర్వాత మార్కెట్‌లో కొంత లాభాల స్వీకరణ కనిపించింది. బకాయిలను పూర్తిగా రద్దు చేయకుండా కేవలం వాయిదా వేయడంతో, ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తత పాటించారు. ఫలితంగా, గరిష్ట స్థాయి నుండి షేర్ ధర కొంత మేర వెనక్కి తగ్గింది.

సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం, AGR బకాయిలను పునఃసమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉండటంతో ఈ ఊరట లభించింది. ఈ నిర్ణయం వల్ల వోడాఫోన్ ఐడియాకు తన నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడానికి మరియు 5G సేవలను వేగవంతం చేయడానికి అవసరమైన నిధులను సమీకరించుకునే అవకాశం లభిస్తుంది. 20 కోట్ల మంది వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ 'లైఫ్ లైన్' అందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

టెలికాం రంగంలో ఏజీఆర్  అంటే సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం. ఏజీఆర్ బకాయిలు అనేది గత రెండు దశాబ్దాలుగా నడుస్తున్న ఒక పెద్ద వివాదం. టెలికాం కంపెనీలు తాము సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఈ మొత్తం సుమారు 8 శాతం.   స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీల  సుమారు 3-5 శాతం  చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును లెక్కించేందుకు ప్రాతిపదికగా తీసుకునే ఆదాయాన్నే 'ఏజీఆర్' అంటారు.

టెలికాం సేవలతో పాటు డివిడెండ్లు, డిపాజిట్లపై వచ్చే వడ్డీ, ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే లాభం వంటి టెలికామేతర ఆదాయాన్ని కూడా ఏజీఆర్‌లో కలపాలని ప్రభుత్వం  వాదించింది.  కేవలం ఫోన్ కాల్స్, డేటా వంటి టెలికాం సేవల ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రమే ఫీజు కట్టాలని కంపెనీలు వాదించాయి. ఈ వివాదం 2005 నుండి సుప్రీంకోర్టులో కొనసాగింది. చివరకు 2019లో సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్వచనాన్నే సమర్థించింది. అంటే, కంపెనీలు గత 15-20 ఏళ్ల ఆదాయంపై అన్ని రకాల ఫీజులు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అసలు బకాయి కంటే దానిపై పడిన వడ్డీ, పెనాల్టీలు, మరియు పెనాల్టీపై వడ్డీ భారీగా పెరిగిపోయాయి. మొత్తం బకాయిల్లో దాదాపు 75 శాతం భాగం ఈ వడ్డీలు, జరిమానాలే ఉండటం గమనార్హం. కంపెనీలు తాము చెల్లించాల్సిన బకాయిలు తక్కువని భావించగా, ప్రభుత్వం లెక్కించిన గణాంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Renu Desai : పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
Advertisement

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Renu Desai : పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
వన్డేల్లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు ఎలా ఉందో చూశారా.. కలిసొచ్చిన మూడో స్థానం
వన్డేల్లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు ఎలా ఉందో చూశారా.. కలిసొచ్చిన మూడో స్థానం
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
Embed widget