అన్వేషించండి

Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం గుడ్ న్యూస్ - అమాంతం పెరిగిన షేర్ ధర

AGR dues: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ఏజీఆర్ బకాయిల విషయంలో గొప్ప రిలీఫ్ ఇచ్చింది. దీంతో ఆ కంపెనీ షేర్లు పెరిగాయి.

Vodafone Idea shares jump:  కేంద్ర ప్రభుత్వం వోడాఫోన్ ఐడియా సంస్థకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడంతో, ఆ సంస్థ షేర్లు స్టాక్ మార్కెట్‌లో భారీగా పెరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం జరిగిన సమావేశంలో వోడాఫోన్ ఐడియాకు సంబంధించి సుమారు రూ.87,695 కోట్ల సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం బకాయిలపై ఐదేళ్ల పాటు మోరటోరియం విధించేందుకు ఆమోదం తెలిపింది. ఈ బకాయిలను ఇప్పుడు ఆర్థిక సంవత్సరం 2031-32 నుండి 2040-41 మధ్య కాలంలో చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల కంపెనీపై ఉన్న తక్షణ ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది.

మార్చి 2026 నుండి ప్రారంభం కావాల్సిన భారీ చెల్లింపులను ప్రభుత్వం 2032 వరకు వాయిదా వేసింది. ఈ మోరటోరియం కాలంలో బకాయిలపై ఎటువంటి అదనపు వడ్డీ లేదా పెనాల్టీలు విధించరు. వోడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి ఉన్న దాదాపు  49 శాతం వాటాను కాపాడుకోవడానికి, టెలికాం రంగంలో పోటీని నిలబెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
ప్రభుత్వ నిర్ణయం వెలువడకముందే, రిలీఫ్ ప్యాకేజీ వస్తుందనే అంచనాలతో షేర్ ధర 52 వారాల గరిష్టానికి చేరినప్పటికీ, నిర్ణయం వెలువడిన తర్వాత మార్కెట్‌లో కొంత లాభాల స్వీకరణ కనిపించింది. బకాయిలను పూర్తిగా రద్దు చేయకుండా కేవలం వాయిదా వేయడంతో, ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తత పాటించారు. ఫలితంగా, గరిష్ట స్థాయి నుండి షేర్ ధర కొంత మేర వెనక్కి తగ్గింది.

సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం, AGR బకాయిలను పునఃసమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉండటంతో ఈ ఊరట లభించింది. ఈ నిర్ణయం వల్ల వోడాఫోన్ ఐడియాకు తన నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడానికి మరియు 5G సేవలను వేగవంతం చేయడానికి అవసరమైన నిధులను సమీకరించుకునే అవకాశం లభిస్తుంది. 20 కోట్ల మంది వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ 'లైఫ్ లైన్' అందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

టెలికాం రంగంలో ఏజీఆర్  అంటే సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం. ఏజీఆర్ బకాయిలు అనేది గత రెండు దశాబ్దాలుగా నడుస్తున్న ఒక పెద్ద వివాదం. టెలికాం కంపెనీలు తాము సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఈ మొత్తం సుమారు 8 శాతం.   స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీల  సుమారు 3-5 శాతం  చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును లెక్కించేందుకు ప్రాతిపదికగా తీసుకునే ఆదాయాన్నే 'ఏజీఆర్' అంటారు.

టెలికాం సేవలతో పాటు డివిడెండ్లు, డిపాజిట్లపై వచ్చే వడ్డీ, ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే లాభం వంటి టెలికామేతర ఆదాయాన్ని కూడా ఏజీఆర్‌లో కలపాలని ప్రభుత్వం  వాదించింది.  కేవలం ఫోన్ కాల్స్, డేటా వంటి టెలికాం సేవల ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రమే ఫీజు కట్టాలని కంపెనీలు వాదించాయి. ఈ వివాదం 2005 నుండి సుప్రీంకోర్టులో కొనసాగింది. చివరకు 2019లో సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్వచనాన్నే సమర్థించింది. అంటే, కంపెనీలు గత 15-20 ఏళ్ల ఆదాయంపై అన్ని రకాల ఫీజులు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అసలు బకాయి కంటే దానిపై పడిన వడ్డీ, పెనాల్టీలు, మరియు పెనాల్టీపై వడ్డీ భారీగా పెరిగిపోయాయి. మొత్తం బకాయిల్లో దాదాపు 75 శాతం భాగం ఈ వడ్డీలు, జరిమానాలే ఉండటం గమనార్హం. కంపెనీలు తాము చెల్లించాల్సిన బకాయిలు తక్కువని భావించగా, ప్రభుత్వం లెక్కించిన గణాంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Axis Mutual Fund NFO: యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ NFO ప్రారంభం.. రూ.100తో జులై 17 వరకు ఛాన్స్
యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ NFO ప్రారంభం.. రూ.100తో జులై 17 వరకు ఛాన్స్
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
EPFO Update 2026: లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? 
లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
Tamil Nadu Politics: తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Embed widget