అన్వేషించండి

Digital Payments: డిజిటల్‌ పేమెంట్స్‌లో మనమే రుస్తుం, భారత్‌ స్పీడ్‌కు చిన్నబోయిన చైనా

2021తో పోలిస్తే డిజిటల్‌ లావాదేవీలు ఏకంగా 91 శాతం పెరిగాయి, వాటి విలువ 76 శాతం పెరిగింది.

Digital Payments: డిజిటల్‌ రూపంలో జరిగిన నగదు లావాదేవీల విషయంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. ఇండియా డిజిటల్ పేమెంట్స్‌ వార్షిక నివేదిక (India Digital Payments Annual Report 2022) ప్రకారం, 2022లో, భారతదేశంలో యూపీఐ, డెబిట్ & క్రెడిట్ కార్డ్‌లు, ప్రీపెయిడ్ ద్వారా మొత్తం రూ. 149.5 లక్షల కోట్ల విలువైన 87.92 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. 

ఆ నివేదిక ప్రకారం, కేవలం UPI (Unified Payments Interface) ద్వారానే 74.05 బిలియన్లకు పైగా లావాదేవీలు జరిగాయి, వాటి విలువ 126 లక్షల కోట్ల రూపాయలు.

2022 సంవత్సరం డేటా ప్రకారం, 2021తో పోలిస్తే డిజిటల్‌ లావాదేవీలు ఏకంగా 91 శాతం పెరిగాయి, వాటి విలువ 76 శాతం పెరిగింది. ఇదే విధంగా రాబోయే సంవత్సరాల్లో కూడా భారతదేశం డిజిటల్ చెల్లింపులలో రికార్డు పెరుగుదలను నమోదు చేస్తుందని అంచనా వేశారు. అయితే, భారతదేశం కంటే ఎక్కువ డిజిటల్ చెల్లింపులు చేసే దేశం ఇంతకుముందు ఒకటి ఉంది.

భారత్‌ కంటే ముందు అగ్రస్థానంలో ఉన్న దేశం ఇదే..      
డిజిటల్ చెల్లింపుల విషయంలో చైనా ఒకప్పుడు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండేది. 2010లో, చైనా డిజిటల్ చెల్లింపులు ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆ ఏడాది డ్రాగన్‌ కంట్రీ డిజిటల్ లావాదేవీలు 1119 మిలియన్లు. అప్పుడు కేవలం 370 మిలియన్ల లావాదేవీలతో భారతదేశం రెండో స్థానంలో ఉంది. 153 మిలియన్ల డిజిటల్ లావాదేవీలతో అమెరికా మూడో స్థానంలో ఉంది.

భారతదేశం మొదటి స్థానంలోకి ఎలా వచ్చింది?     
2010 నుంచి భారత్‌లో సీన్‌ మారిపోయింది. భారతదేశం డిజిటల్ చెల్లింపుల విషయంలో వేగంగా దూసుకుపోతోంది. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వేగం ఇంకా పెరిగింది. చైనా గ్రాఫ్ క్షీణించడంతో, 2023 నాటికి, భారతదేశం డిజిటల్ చెల్లింపుల లావాదేవీల పరంగా 61 వేల మిలియన్ల స్థాయిని దాటింది. ఇప్పుడు చైనా డిజిటల్ లావాదేవీల పరిమాణం 22 వేల మిలియన్లకు పైన ఉంది. కేవలం 4,761 మిలియన్ల డిజిటల్ లావాదేవీలతో అమెరికా ఇప్పటికీ మూడో స్థానంలోనే ఉంది.

అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరిగిన నగరాలు        
2022 సంవత్సరంలో అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరిగిన భారతీయ నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. 2022లో, ఆ నగరంలో రూ. 6,500 కోట్ల విలువైన 29 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. రెండో స్థానంలో దేశ రాజకీయ రాజధాని దిల్లీ ఉంది. ఆ నగరంలో రూ. 5,000 కోట్ల విలువైన 19.6 మిలియన్ లావాదేవీలు జరిగాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మూడో స్థానంలో ఉంది. ఆ నగరంలో రూ. 4,950 కోట్ల విలువైన 18.7 మిలియన్ లావాదేవీలు జరిగాయి.

ఇటీవల, దేశవ్యాప్తంగా చేపట్టిన పాన్-ఇండియా డిజిటల్ పేమెంట్స్‌ సర్వేలో (90,000 మంది పాల్గొన్నారు) 42 శాతం మంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నట్లు ఆర్‌బీఐ వివరించింది. 2017 జనవరిలో 45 లక్షల UPI లావాదేవీలు జరగ్గా, 2023 జనవరిలో ఈ సంఖ్య 804 కోట్లకు పెరిగిందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ (shaktikant das) తెలిపారు. ఇదే కాలంలో యూపీఐ లావాదేవీల విలువ రూ. 1,700 కోట్ల నుంచి రూ. 12.98 లక్షల కోట్లకు పెరిగింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
June 1 Rule Changes 2026:బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Driving Without Insurance: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget