By: ABP Desam | Updated at : 04 Oct 2021 07:14 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్లో ఇంధన ధరల్లో కాస్త పెరుగుదల కనిపించింది. నేడు పెట్రోల్ ధర రూ.0.25 పైసలు పెరిగి రూ.106.51 అయింది. డీజిల్ ధర రూ.0.32 పైసలు పెరిగి రూ.99.04 గా ఉంది. ఇక వరంగల్లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.70 పైసలు పెరిగి రూ.106.47గా ఉంది. డీజిల్ ధర రూ.0.74 పైసలు పెరిగి రూ.98.99 గా ఉంది. వరంగల్లో గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.68 పైసలు పెరిగి రూ.106.97గా ఉంది. డీజిల్ ధర రూ.0.72 పైసలు పెరిగి రూ.99.46కు చేరింది. నేడు నిజామాబాద్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్ ధర రూ.1.10 పెరిగి రూ.108.60 గా ఉంది. డీజిల్ ధర రూ.1.10 పైసలు పెరిగి రూ.100.97 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక్కడ ప్రస్తుతం రూ.108.49 గా ఉంది. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.08 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.0.01 పైసలు పెరిగి ఏకంగా రూ.100.46కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత పది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.60గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.41 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.99.60గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
Also Read: సముద్రం మధ్యన షిప్లో సోదాలు ఎలా? అధికారులు అమలు చేసిన పక్కా ప్లాన్ ఏంటంటే..
తిరుపతిలో ఇంధన ధరల్లోనూ భారీ పెరుగుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.91 పైసలు పెరిగి రూ.109.57 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.101.43గా ఉంది. డీజిల్ ధర లీటరుకు ఏకంగా రూ.0.89 పైసలు పెరిగింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 4 నాటి ధరల ప్రకారం 75.05 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Petrol-Diesel Price, 27 May: పెట్రోల్, డీజిల్ ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు - నేడు ఈ నగరాల్లో పెరుగుదల
Gold-Silver Price: ఇవాల్టి బంగారం ధరల్లో కాస్త ఊరట! రూ.250 తగ్గిన రేటు, వెండి కూడా దిగువకు
New Brezza: కొత్త బ్రెజాలో అదే హైలెట్ - లాంచ్ త్వరలోనే - లుక్ ఎలా ఉందంటే?
Kotak Mutual Fund: రూ.10 వేల సిప్ - 3 ఏళ్లలో రూ.5 లక్షల రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ ఇది
Stock Market News: సెన్సెక్స్ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!
Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Telugudesam On YSRCP: వైసీపీలో లాబీయింగ్ చేసేవాళ్లు, సహ నిందితులే అర్హులా? రాజ్యసభ ఎంపీల ఎంపికపై టీడీపీ ప్రశ్న
Astrology: ఈ నెలలో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు