By: ABP Desam | Updated at : 15 Aug 2021 06:56 AM (IST)
పెట్రోల్ డీజిల్ ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో చెన్నై, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో గత 20 రోజులుగా ఇంధన ధరలు నిలకడగానే ఉంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా నిలకడైన ధరలే కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఇంధన మార్కెట్లో మూడు రోజుల క్రితం పెరిగిన స్వల్పంగా పెరిగిన ధరలు మళ్లీ యథాతథ స్థితికి చేరుకున్నాయి.
తెలంగాణలో ఆగస్టు 15న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.105.83 గానే కొనసాగుతుండగా.. డీజిల్ ధర రూ.97.96 గా ఉంది. కరీంనగర్లో పెట్రోల్ ధర.. ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.28 పైసలు తగ్గింది. తాజాగా పెట్రోల్ ధర రూ.105.71గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.26 పైసలు తగ్గి.. రూ.97.83 గా ఉంది.
ఇక వరంగల్లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.38 కాగా.. డీజిల్ ధర రూ.97.53 గా స్థిరంగానే కొనసాగుతూ ఉంది. కొద్దిరోజులుగా వరంగల్లో కూడా మెట్రో నగరాల తరహాలోనే ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవే ఇంధన ధరలు ఉంటున్నాయి.
నిజామాబాద్లో పెట్రోల్ ధరలో లీటరుకు సుమారు రూ.0.35 పైసల చొప్పున పెరిగింది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.33 పైసలు పెరిగింది. దీంతో తాజాగా పెట్రోల్ రూ.107.71 గా ఉంది. డీజిల్ ధర రూ.99.90గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
Also Read: 75th Independence day: ఎర్రకోట మీదనే ప్రధాని ఎందుకు జెండా ఎగరేస్తారు? ఏంటీ దాని ప్రత్యేకత?
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్లో ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ ధర రూ.0.29 పైసలు పెరిగింది. ప్రస్తుతం పెట్రోల్ రేటు లీటరుకు రూ.108.21 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.29 పైసలు పెరిగి రూ.99.78కు చేరింది.
విశాఖపట్నం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.11గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే అతి స్వల్పంగా రూ.0.09 పైసలు పెరిగింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.08 పైసలు పెరిగి రూ.98.71గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటుండగా.. తాజాగా స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
తిరుపతిలో భారీ మార్పు
తిరుపతిలో ఇంధన ధరల్లో రోజూ భారీ మార్పులే చోటు చేసుకుంటున్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.0.72 పైసలు పెరగగా.. డీజిల్ రూ.0.66 పైసలు ఎగబాకింది. దీంతో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.108.84 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర రూ.100.31గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 13 నాటి ధరల ప్రకారం 68.44 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను అలాగే ఉంచుతున్నాయి. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.
Also Read: Independence Day 2021: పంద్రాగస్టు వేడుకలు.. ప్రధాని మోడీ షెడ్యూల్ ఇదే.. దేశ రాజధానిలో హైఅలర్ట్
Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Adani Group Investment Plan: ఇన్ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు
Train Ticket: కన్ఫర్మ్డ్ ట్రైన్ టిక్కెట్ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్ ప్రయత్నించండి
Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్ ఛెస్ట్ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు
GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు
Telangana Results KCR : కాంగ్రెస్పై అభిమానం కన్నా కేసీఆర్పై కోపమే ఎక్కువ - తెలంగాణ ప్రజలు ఇచ్చిన సందేశం ఇదేనా ?
Winning Minister 2023: మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి విజయం- ఆయనతోపాటు గెలిచిన మంత్రులు వీళ్లే
Telangana constituency wise results: తెలంగాణ తీర్పు: ఏయే నియోజకవర్గంలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
Revanth Reddy News: కొడంగల్లో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భారీ విజయం
/body>