అమెరికా పది ఏళ్ల ట్రెజరీ బాండ్ల రిటర్న్స్ పెరగడం, డాలర్ బలపడటం, మరియు టెక్నికల్ పతనం వంటి కారణాల వల్ల బంగారం, వెండి ధరలు పడిపోయాయి.
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Gold and Silver Price: ప్రస్తుతానికి మార్కెట్ ట్రెండ్ ప్రతికూలంగానే ఉంది. బంగారం ధరలు 1,52,000 వద్ద వెండి 2,60,000 వద్ద రిసిస్టెన్స్ వస్తుందని చెబుతున్నారు

- ఇరాన్ యుద్ధం ముదురుతున్నా బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి.
- అమెరికా బాండ్ల రాబడి పెరగడం, డాలర్ బలపడటం ధరల పతనానికి కారణాలు.
- భారీ లివరేజ్ ట్రేడింగ్, స్టాప్-లాస్ ఆర్డర్లు మార్కెట్లో ఒత్తిడిని పెంచాయి.
- భారత్లోనూ బంగారం, వెండి ధరలు లోయర్ సర్క్యూట్ను తాకి, దిగుమతులు దెబ్బతిననున్నాయి.
Gold and Silver Price: ప్రపంచ ఆర్థిక మార్కెట్లు ఊహించని షాక్కు గురయ్యాయి. సాధారణంగా యుద్ధం వాతావరణం ఉన్నప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకాలి. కానీ ఇరాన్ యుద్ధం ముదురుతున్న వేళ అందుకు భిన్నంగా విలువైన లోహాల మార్కెట్ కుప్పకూలింది కేవలం మూడు గంటల వ్యవధిలోనే బంగారం, వెండి మార్కెట్ విలువ నుంచి ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు 165 లక్ష ళ కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. గ్లోబల్ మార్కెట్ చరిత్రలోనే ఇదొక అత్యంత వింతైన, ఆందోళనకరమైన పరిణామంగా ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు.
యుద్ధం ఉన్నా బంగారం ధర ఎందుకు పడిపోయింది?
ఆర్థిక పాఠ్యపుస్తకాల ప్రకారం యుద్ధం లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు తమ సొమ్మును సురక్షితంగా ఉంచుకోవడానికి బంగారం వైపు మొగ్గు చూపుతారు. అయితే ప్రస్తుతం ఇరాన్ యుద్ధం తీవ్రతరం అవుతున్నా, చమురు ధరలు పెరుగుతున్నా బంగారం ధరలు పడిపోవడం వెనుక బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయి.
దీనికి ప్రధాన కారణం అమెరికా బాండ్ మార్కెట్. అమెరికా పది ఏళ్ల ట్రెజరీ బాండ్ల రిటర్న్లు కేవలం కొన్ని వారాల్లోనే 4.4 శాతానికి చేరుకున్నాయి. సాధారణంగా బంగారంపై ఎలాంటి వడ్డీ రాదు. కానీ ప్రభుత్వం బాండ్లు 4.4 శాతం లాభాన్ని ఇస్తున్నప్పుడు, పెద్ద పెట్టుబడిదారులు బంగారాన్ని వదిలి బాండ్ల వైపు మళ్లుతున్నారు. దీని వల్ల బంగారం తన అల్టిమేట్ హెడ్జ్ హోదాను కోల్పోయి కేవలం ఒక సాధారణ రిస్క్ అసెట్లా మారింది.
డాలర్ బలపడటం లోహాలకు శాపం
ఇరాన్ యుద్ధం పెరుగుతున్న కొద్దీ, అమెరికా డాలర్ మళ్లీ పుంజుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడితే, ఇతర కరెన్సీలలో బంగారం కొనడం ఖరీదుగా మారుతుంది. ఇది సహజంగానే బంగారంపై ఒత్తిడి పెంచుతుంది. పెట్టుబడిదారులు బంగారంతో పోలిస్తే డాలర్ను మరింత సురక్షితమైనదిగా భావించడం వల్ల పసిడి విక్రయాలు వెల్లువెత్తాయి.
టెక్నికల్ పతనం- లిక్విడిటీ మాయం
మార్కెట్ పరిశోధన సంస్థ కోబీసీ లెటర్ వ్యవస్థాపకుడు ఆడమ్ కో బీసీ అభిప్రాయం ప్రకారం, మార్కెట్లో ఏదో పెద్ద అపశృతి చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడంతో, చాలా మంది పెట్టుబడిదారులు భారీ స్థాయిలో లివరేజ్ తీసుకొని ట్రేడింగ్ చేశారు ధరలు ఒక్కసారిగా కీలక స్థాయిల కంటే కిందకు పడిపోవడంతో స్టాప్ లాస్ ఆర్డర్లు యాక్టివేట్ అయ్యాయి. దీని వల్ల సెకన్ల వ్యవధిలోనే ధరలు పాతాళానికి పడిపోయాయి.
పెట్టుబడిదారులు తమ ఇతర నష్టాలను భర్తీ చేసుకోవడానికి బంగారాన్ని ఏటీఎఁ కార్డులా వాడుకుని నగదుగా మార్చుకుంటున్నారు. దీనిని నిపుణులు ఫోర్స్డ్ డిలివరేజింగ్ లేదా మార్జినల్ కాల్ అని పిలుస్తున్నారు.
భారత్ మార్కెట్లపై ప్రభావం
భారత్లోని మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో కూడా పసిడి మంటలు రేపింది. సోమవారం ట్రెడింగ్లో బంగారం, వెండి కాంట్రాక్టులు లోయర్ సర్క్యూట్ను తాకాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ధర పది గ్రాములు 1,44,800 వద్ద ట్రేడ్ అవుతుంది. గత వారంలోనే ఇది 8 శాతం కంటే ఎక్కువ పతనమైంది. వెండి ధరలు మరింత దారుణంగా పడిపోయాయి. కిలో వెండి 10.72 శాతం తగ్గి 2,02,465 స్థాయికి చేరింది. గోల్డ్ ఈటీఎఫ్లు కూడా 9 శాతం వరకు నష్టపోయాయి.
పరిశ్రమ దిగ్గజాల ఆందోళన
చమురు సరఫరాలో అంతరాయాలు ద్రవ్యోల్బణానికి దారి తీస్తాయనే భయం మార్కెట్లను వణికిస్తోంది. వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉండటంతో దేశీయంగా బంగారం వినియోగంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఈ సంక్షోభం వల్ల తీవ్ర దెబ్బతినే అవకాశం ఉంది.
భవిష్యత్ ఎలా ఉంటుంది?
ప్రస్తుతానికి మార్కెట్ ట్రెండ్ ప్రతికూలంగానే ఉంది. బంగారం ధరలు 1,52,000 వద్ద వెండి 2,60,000 వద్ద రిసిస్టెన్స్ వస్తుందని చెబుతున్నారు యుద్ధం కంటిన్యూ అయితే ద్రవ్యోల్బణం పెరిగి మళ్లీ బంగారం తన విలువను తిరిగి పొందే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రళయ కేవలం ఒక ఆరంభం మాత్రమేనా? ఇదే ఒత్తిడి ఇతర మార్కెట్లు అంటే క్రెడిట్ మార్కెట్, బిగ్ టెక్ కంపెనీలపై పడితే పరిస్థితి ఏంటీ అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వేధిస్తున్నాయి. పెట్టుబడిదారులు ప్రస్తుతానికి అప్రమత్తంగా ఉండాలని, ధరలు పెరిగిన ప్రతిసారీ విక్రయించే వ్యూహాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Frequently Asked Questions
ఇరాన్ యుద్ధం ముదురుతున్న వేళ బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోయాయి?
అమెరికా బాండ్ మార్కెట్ బంగారం ధరపై ఎలా ప్రభావం చూపింది?
అమెరికా బాండ్లు 4.4 శాతం లాభాన్ని ఇస్తున్నప్పుడు, పెద్ద పెట్టుబడిదారులు బంగారాన్ని వదిలి బాండ్ల వైపు మళ్లారు. దీనివల్ల బంగారం తన సురక్షిత పెట్టుబడి హోదాను కోల్పోయింది.
డాలర్ బలపడటం బంగారం ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
డాలర్ బలపడితే, ఇతర కరెన్సీలలో బంగారం కొనడం ఖరీదుగా మారుతుంది. ఇది బంగారంపై ఒత్తిడి పెంచుతుంది మరియు పెట్టుబడిదారులు డాలర్ను సురక్షితంగా భావించడం వల్ల అమ్మకాలు వెల్లువెత్తుతాయి.
టెక్నికల్ పతనం అంటే ఏమిటి మరియు అది బంగారం ధరలను ఎలా ప్రభావితం చేసింది?
పెట్టుబడిదారులు భారీగా లివరేజ్ తీసుకొని ట్రేడింగ్ చేసినప్పుడు, ధరలు కీలక స్థాయిల కంటే కిందకు పడిపోతే స్టాప్-లాస్ ఆర్డర్లు యాక్టివేట్ అయి, సెకన్ల వ్యవధిలో ధరలు పతనమవుతాయి.
భారతదేశంలో బంగారం, వెండి ధరలపై ఈ పరిణామాల ప్రభావం ఎలా ఉంది?
భారతదేశంలోనూ బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి. ఎంసీఎక్స్ గోల్డ్, సిల్వర్ కాంట్రాక్టులు లోయర్ సర్క్యూట్ ను తాకాయి మరియు గోల్డ్ ఈటీఎఫ్ లు కూడా నష్టపోయాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















