అన్వేషించండి

Biggest scam in India: జీఎస్టీ కట్టాల్సి వస్తుందని బిల్లులే డిలీట్ చేస్తున్నారు - రెస్టారెంట్లు భారీ స్కామ్ - పట్టేసిన హైదరాబాద్ ఐటీ శాఖ

Massive tax evasion: రెస్టారెంట్ రంగంలో జరుగుతున్న భారీ పన్ను ఎగవేత వెలుగులోకి వచ్చింది. బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా సుమారు రూ.70 వేల కోట్ల టర్నోవర్‌ను దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు.

Massive tax evasion in the nationwide restaurant sector :  హైదరాబాద్ ఆదాయపు పన్ను శాఖ పరిశోధన విభాగం దేశవ్యాప్త రెస్టారెంట్ రంగంలో జరుగుతున్న భారీ పన్ను ఎగవేతను పసిగట్టింది. ఒక ప్రముఖ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా సుమారు రూ. 70,000 కోట్ల టర్నోవర్‌ను దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి సాగుతున్న ఈ అక్రమాలను అత్యాధునిక డేటా విశ్లేషణ ద్వారా వెలికితీశారు. ఒక లక్షకు పైగా రెస్టారెంట్లు వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్ నుండి సేకరించిన 60 టెరాబైట్ల లావాదేవీల డేటాను పరిశీలించగా ఈ అంకెలు బయటపడ్డాయి.

ఈ పరిశోధనలో భాగంగా అధికారులు కృత్రిమ మేధ , జనరేటివ్ AI పరికరాలను వినియోగించారు. సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌లోని 1.77 లక్షల రెస్టారెంట్ ఐడీలను, సంబంధిత జీఎస్టీ నంబర్లను ఓపెన్ సోర్స్ డేటా ద్వారా మ్యాపింగ్ చేశారు. అహ్మదాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ సెంటర్ నుండి సేకరించిన రికార్డులను హైదరాబాద్‌లోని డిజిటల్ ల్యాబ్‌లో ఫోరెన్సిక్ విశ్లేషణ చేయగా, గత ఆరు ఏళ్లలో  రూ.2.43 లక్షల కోట్ల బిల్లింగ్ జరగగా, అందులో రూ. 13,317 కోట్లు బిల్లు చేసిన తర్వాత తొలగించినట్లు తేలింది.

రెస్టారెంట్లు అనుసరిస్తున్న అక్రమ పద్ధతులను కూడా అధికారులు గుర్తించారు. సాధారణంగా కార్డులు, యూపీఐ ద్వారా జరిగే డిజిటల్ లావాదేవీలను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తూనే, నగదు రూపంలో వచ్చే ఆదాయాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. కొన్ని సంస్థలు ఏకంగా నెల రోజుల బిల్లింగ్ డేటాను సాఫ్ట్‌వేర్ నుండి తుడిచివేసి, అతి తక్కువ విక్రయాలను మాత్రమే ఆదాయపు పన్ను రిటర్నులలో చూపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల సాఫ్ట్‌వేర్ రికార్డుల్లో అధిక మొత్తం ఉన్నప్పటికీ, ట్యాక్స్ రిటర్నులలో మాత్రం తక్కువ మొత్తాన్ని నమోదు చేసి పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయి.

రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే కర్ణాటకలో అత్యధికంగా రూ.2,000 కోట్ల మేర బిల్లుల తొలగింపు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో రూ.1,500 కోట్లు, తమిళనాడులో రూ.1,200 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. దేశవ్యాప్తంగా అక్రమాలు జరిగిన మొదటి ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ఉన్నాయి. విచారణ పరిధిలోకి తీసుకున్న కేసుల్లో సగటున 27 శాతం మేర అమ్మకాలను దాచిపెట్టినట్లు ఐ-టీ విభాగం నిర్ధారించింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన 3,734 పాన్   నంబర్లను విశ్లేషించగా ఐదేళ్ల కాలంలో రూ. 5,141 కోట్ల టర్నోవర్ వ్యత్యాసం కనిపించింది. కేవలం 40 రెస్టారెంట్లను నమూనాగా తీసుకుని జరిపిన లోతైన విచారణలోనే రూ. 400 కోట్ల అక్రమాలు వెలుగుచూశాయి. హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లోని ప్రముఖ ఆహార సంస్థల్లో సోదాలు నిర్వహించిన అధికారులు, ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రస్తుతం ఒకే ఒక బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ డేటా ఆధారంగా ఈ కుంభకోణం బయటపడగా, మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర సాఫ్ట్‌వేర్ల ద్వారా కూడా ఇలాంటి అక్రమాలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఈ విచారణను దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరించింది. రానున్న రోజుల్లో మరిన్ని రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, హోటళ్లపై ఐ-టీ నిఘా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

New Ticket Cancellation Refund Rules: రైల్వే ప్రయాణికులకు భారీ ఊరట! ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌!
రైల్వే ప్రయాణికులకు భారీ ఊరట! ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌!
April Salaries: ఏప్రిల్ ఒకటి నుంచి మీ జీతాలు పెరుగుతాయి -ఎలాగో తెలుసా?
ఏప్రిల్ ఒకటి నుంచి మీ జీతాలు పెరుగుతాయి -ఎలాగో తెలుసా?
Discount On Cars: కస్టమర్లకి అదిరిపోయే ఇయర్-ఎండ్ ఆఫర్లు! ఆ కార్లు కొంటే లక్షల రూపాయల ఆదా..
కస్టమర్లకి అదిరిపోయే ఇయర్-ఎండ్ ఆఫర్లు! ఆ కార్లు కొంటే లక్షల రూపాయల ఆదా..
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Advertisement

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Embed widget