అన్వేషించండి

Udayshivakumar Infra IPO: ఉదయశివకుమార్ ఇన్‌ఫ్రా ఐపీవో ప్రారంభం, బిడ్‌ వేసే ముందు కచ్చితంగా తెలియాల్సిన విషయాలివి!

IPOలో ఒక్కో షేరుకు రూ. 33-35 ధరను ప్రైస్‌ బ్యాండ్‌గా కంపెనీ నిర్ణయించింది.

Udayshivakumar Infra IPO: ఉదయశివకుమార్ ఇన్‌ఫ్రా ఇనీషియల్‌ పబ్లిక్ ఆఫరింగ్‌ (IPO) సబ్‌స్క్రిప్షన్ ఇవాళ (సోమవారం, 2023 మార్చి 20‌) ప్రారంభమైంది. మార్చి 23 వరకు ఓపెన్‌లో ఉంటుంది. 

ప్రైస్‌ బ్యాండ్‌
IPOలో ఒక్కో షేరుకు రూ. 33-35 ధరను ప్రైస్‌ బ్యాండ్‌గా కంపెనీ నిర్ణయించింది. ఒక్కో లాట్‌కు 428 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది, పెట్టుబడిదార్లు కనీసం 428 షేర్లు, ఆ తర్వాత దీని గుణిజాల్లో బిడ్‌ వేయవచ్చు. 

IPO ద్వారా రూ. 66 కోట్ల వరకు విలువైన షేర్ల తాజా ఇష్యూ చేస్తున్నారు. ఈ ఆఫర్‌లో దాదాపు 60% రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు, 30% నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. మిగిలిన 10% అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల (QIBs) కోసం రిజర్వ్ చేశారు.

వ్యాపారం
ప్రధానమంత్రి స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్టుల క్రింద జాతీయ & రాష్ట్ర రహదారులు, జిల్లా రోడ్లు, స్మార్ట్ రోడ్లు మొదలైన వివిధ రహదారి ప్రాజెక్టులను నిర్మించే వ్యాపారాన్ని ఉదయశివకుమార్ ఇన్‌ఫ్రా చేస్తోంది.

2022 డిసెంబర్‌ నాటికి, కంపెనీ వద్ద 111 నిర్మాణ పరికరాలు, 46 డంపర్‌లు, 51 ఇతర నిర్మాణ వాహనాలు, 7 రెడీ-మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లు ఉన్నాయి.

రెలిగేర్ బ్రోకింగ్ ఈ IPOలో "న్యూట్రల్‌" రేటింగ్‌ ఇచ్చింది. కంపెనీ దగ్గర మంచి ఇంజినీరింగ్ బృందం, ఆధునిక నిర్మాణ యంత్రాలు, పరికరాలు ఉన్నాయని, ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేసే నైపుణ్యత కంపెనీ సొంతమని వెల్లడించింది.

డిసెంబర్ త్రైమాసికం నాటికి కంపెనీ చేతిలో 46 వర్క్ ఆర్డర్‌లు ఉన్నాయి, మొత్తం ఆర్డర్ బుక్ విలువ రూ. 1,291 కోట్లు. వీటిలో 30 ప్రస్తుతం కొనసాగుతున్నాయి, మిగిలిన 16 కొత్త వర్క్ ఆర్డర్‌లు ఇంకా ప్రారంభం కాలేదు.

లాభనష్టాలు
FY22లో (2021-22 ఆర్థిక సంవత్సరం) ఉదయశివకుమార్ ఇన్‌ఫ్రా రూ. 185 కోట్ల ఆదాయాన్ని,  రూ. 12 కోట్ల లాభాన్ని ఆర్జించింది. FY20-22 కాలంలో కంపెనీ గ్రోత్‌ ట్రెండ్‌ మిశ్రమంగా ఉంది. ఈ కాలంలో ఆదాయం 2.1% CAGR వద్ద తగ్గింది, ఎబిటా (EBITDA) ఫ్లాట్‌గా ఉంది, పన్ను తర్వాతి లాభం (PAT) 7.6% CAGR పెరిగింది.

FY22 ఆదాయాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఇష్యూ పూర్తిగా పైసా వసూల్‌ పద్ధతిలో వచ్చిందని సెబీ-రిజిస్టర్డ్‌ ఎనలిస్ట్‌ దిలీప్ దావ్డా చెప్పారు. అత్యంత పోటీతత్వ వ్యాపారంలో ఉందని, మార్జిన్‌లు ఎంతకాలం కొనసాగుతాయన్నదానిపై అనిశ్చితి ఉందని, దీర్ఘకాలానికి మాత్రం ఈ ఇష్యూలో పార్టిసిపేట్‌ చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాడు.

ఉదయశివకుమార్ ఇన్‌ఫ్రా ఒక మైక్రో మార్కెట్ క్యాప్ కంపెనీ అయినందున, మార్కెట్‌లోని అన్ని వర్గాల నుంచి ఈ IPO ఆరోగ్యకరమైన ప్రతిస్పందనను పొందడం కష్టమని మెహతా ఈక్విటీస్‌కి చెందిన ప్రశాంత్ తాప్సే చెప్పారు.

కంపెనీకి కీలక రిస్క్‌ల్లో క్లయింట్ బేస్ ఒకటి. ప్రధానంగా ప్రభుత్వం & ప్రభుత్వం నిధులు సమకూర్చే ఇతర సంస్థల నుంచి వచ్చే ఆర్డర్ల మీదే ఈ కంపెనీ ఆధారపడి ఉంది. మరీ ముఖ్యంగా, కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన లేదా ఇచ్చే ప్రాజెక్టులపై ఆధారపడి ఉంటుంది. కంపెనీ ఆదాయంలో ఎక్కువ మొత్తం పరిమిత సంఖ్యలోని క్లయింట్ల నుంచి వస్తోంది. ఇది మరొక రిస్క్‌ ఫ్యాక్టర్‌.

టాప్ హెడ్ లైన్స్

"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Embed widget