అన్వేషించండి

UPI Payments: యూపీఐ పేమెంట్స్‌పై ఇకనుంచి అదనపు ఛార్జీలు చెల్లించాలా? క్లారిటీ ఇచ్చిన ఆర్థిక శాఖ

UPI Charges on Payments | భారతదేశంలో యూపీఐ ద్వారా దాదాపు 46 కోట్ల మంది, 6.5 కోట్ల వ్యాపారులు లావాదేవీలు చేస్తున్నారు. చిన్న చెల్లింపులు సైతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని ఆర్థిక శాఖ తెలిపింది.

డిజిటల్ చెల్లింపుల కోసం, UPI వాడకం బాగా పెరిగింది.  ఇది వచ్చినప్పటి నుండి ఎన్నో రకాల సేవలు ప్రజలకు ఈజీగా అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా ఎన్నో చెల్లింపులు ఇంటి నుంచే చేసేస్తున్నారు. దుకాణదారులు UPI ద్వారా స్వీకరించడం లేదా చెల్లింపులు చేయడానికి అదనపు ఛార్జీలు విధించనున్నారని  సోషల్ మీడియా, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కనిపిస్తుంది.

 సోషల్ మీడియాలో ఈ వార్త కొందరు పోస్ట్ చేయగా.. నిమిషాల వ్యవధిలో వైరల్ అవుతోంది. అయితే, యూపీఐ చెల్లింపులపై అదనపు ఛార్జీలపై ప్రభుత్వం స్పందించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా Xలో ఒక పోస్ట్ చేస్తూ, ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. యూపీఐ ఛార్జీల పెంపు అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇస్తూ అన్ని రకాల పుకార్లకు చెక్ పెట్టింది.

UPI పై ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానం

ఆర్థిక మంత్రిత్వ శాఖ తన పోస్ట్‌లో, ఈ విధంగా అనవసరమైన భయాందోళన పెంచడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. జూన్‌లో వీసా లావాదేవీల కంటే UPI ద్వారా ఎక్కువ లావాదేవీలు జరిగాయని తెలిపింది. 2025 జూన్ 1న UPI ద్వారా 64.4 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ మరుసటి రోజున లావాదేవీలు 65 కోట్లు దాటాయి. అయితే, ఒక సంవత్సరం కిందట 64 కోట్ల UPI లావాదేవీలు జరిగాయి.

కొత్త UPI చెల్లింపుల వ్యవస్థ

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ (NDA) ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఒక బుక్‌లెట్‌లో, భారత్‌లోని డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతో అనుసంధానమై ఉందని పేర్కొంది. 'భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. మార్చి 2025లో, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా దాదాపు రూ. 24.77 లక్షల కోట్ల విలువైన 1,830.151 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి.

అందులో దాదాపు 50 శాతం చిన్న లేదా చాలా చిన్న చెల్లింపులు ఉన్నాయని పేర్కొన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) గురించి బుక్‌లెట్‌లో మోదీ ప్రభుత్వం పారదర్శకతను తెలియజేసేందుకు,  పాలనలో అవినీతిని నిరోధించడానికి సాంకేతికత, డిజిటల్ సాధనాలను సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారని స్పష్టం చేసింది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget