అన్వేషించండి

UPI Payments: యూపీఐ పేమెంట్స్‌పై ఇకనుంచి అదనపు ఛార్జీలు చెల్లించాలా? క్లారిటీ ఇచ్చిన ఆర్థిక శాఖ

UPI Charges on Payments | భారతదేశంలో యూపీఐ ద్వారా దాదాపు 46 కోట్ల మంది, 6.5 కోట్ల వ్యాపారులు లావాదేవీలు చేస్తున్నారు. చిన్న చెల్లింపులు సైతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని ఆర్థిక శాఖ తెలిపింది.

డిజిటల్ చెల్లింపుల కోసం, UPI వాడకం బాగా పెరిగింది.  ఇది వచ్చినప్పటి నుండి ఎన్నో రకాల సేవలు ప్రజలకు ఈజీగా అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా ఎన్నో చెల్లింపులు ఇంటి నుంచే చేసేస్తున్నారు. దుకాణదారులు UPI ద్వారా స్వీకరించడం లేదా చెల్లింపులు చేయడానికి అదనపు ఛార్జీలు విధించనున్నారని  సోషల్ మీడియా, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కనిపిస్తుంది.

 సోషల్ మీడియాలో ఈ వార్త కొందరు పోస్ట్ చేయగా.. నిమిషాల వ్యవధిలో వైరల్ అవుతోంది. అయితే, యూపీఐ చెల్లింపులపై అదనపు ఛార్జీలపై ప్రభుత్వం స్పందించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా Xలో ఒక పోస్ట్ చేస్తూ, ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. యూపీఐ ఛార్జీల పెంపు అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇస్తూ అన్ని రకాల పుకార్లకు చెక్ పెట్టింది.

UPI పై ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానం

ఆర్థిక మంత్రిత్వ శాఖ తన పోస్ట్‌లో, ఈ విధంగా అనవసరమైన భయాందోళన పెంచడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. జూన్‌లో వీసా లావాదేవీల కంటే UPI ద్వారా ఎక్కువ లావాదేవీలు జరిగాయని తెలిపింది. 2025 జూన్ 1న UPI ద్వారా 64.4 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ మరుసటి రోజున లావాదేవీలు 65 కోట్లు దాటాయి. అయితే, ఒక సంవత్సరం కిందట 64 కోట్ల UPI లావాదేవీలు జరిగాయి.

కొత్త UPI చెల్లింపుల వ్యవస్థ

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ (NDA) ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఒక బుక్‌లెట్‌లో, భారత్‌లోని డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతో అనుసంధానమై ఉందని పేర్కొంది. 'భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. మార్చి 2025లో, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా దాదాపు రూ. 24.77 లక్షల కోట్ల విలువైన 1,830.151 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి.

అందులో దాదాపు 50 శాతం చిన్న లేదా చాలా చిన్న చెల్లింపులు ఉన్నాయని పేర్కొన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) గురించి బుక్‌లెట్‌లో మోదీ ప్రభుత్వం పారదర్శకతను తెలియజేసేందుకు,  పాలనలో అవినీతిని నిరోధించడానికి సాంకేతికత, డిజిటల్ సాధనాలను సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారని స్పష్టం చేసింది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Embed widget