Gold-Silver Price: దిగొచ్చిన పసిడి ధర, అదే దారిలో వెండి పయనం.. ఏపీ, తెలంగాణలో లేటెస్ట్ రేట్లు ఇలా..
భారత్లో బంగారం ధర ఈ రోజు (ఆగస్టు 7) కాస్త తగ్గింది. ఆగస్టు 6న రూ.44,800గా ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ (ఆగస్టు 7)న రూ.44,600 గా ఉంది.
![Gold-Silver Price: దిగొచ్చిన పసిడి ధర, అదే దారిలో వెండి పయనం.. ఏపీ, తెలంగాణలో లేటెస్ట్ రేట్లు ఇలా.. Gold Silver Price Today 7 August 2021 know rates in your city Telangana Andhra Pradesh Amaravati Hyderabad Gold-Silver Price: దిగొచ్చిన పసిడి ధర, అదే దారిలో వెండి పయనం.. ఏపీ, తెలంగాణలో లేటెస్ట్ రేట్లు ఇలా..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/21/a64f730f92d347c4b5071bd72da074c2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బంగారం ధరల్లో ప్రతిరోజు మార్పు చేసుకుంటుండడం ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి కూడా అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో ఫ్యాక్టర్స్ బంగారం ధరను నిర్ణయిస్తాయి. ఏపీ, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో తాజా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
భారత్లో బంగారం ధర ఈ రోజు (ఆగస్టు 7) కాస్త తగ్గింది. ఆగస్టు 6న రూ.44,800గా ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ (ఆగస్టు 7)న రూ.44,600 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ముందురోజు రూ.48,880 గా ఉండగా.. తాజాగా రూ.48,669 గా ఉంది. మొత్తానికి గత 10 రోజుల ధరలతో పోలిస్తే సుమారు రూ.200 మేర పెరిగింది.
బంగారం ధరలు కాస్త దిగిరాగా, వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనించాయి. వెండి ధరల్లో గత 10 రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా భారత్లో కిలో వెండి ధర రూ.71,700 గా ఉంది. నిన్న (ఆగస్టు 6న) రూ.72,300గా ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధర తాజాగా రూ.600 వరకూ తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్లో కూడా 24 క్యారెట్ల మేలిమి బంగారం (బిస్కెట్ బంగారం) ధర రూ.48,660 గానే ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.44,600 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర కిలో రూ.71,700 పలుకుతుండగా.. ముందు రోజుతో పోలిస్తే వెండి ధర రూ.600 తగ్గింది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ఆగస్టు 7న రూ.44,600 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,660గా ఉంది. విజయవాడలో ఆగస్టు 6తో పోలిస్తే గ్రాముకు రూ.22 వరకూ ధర తగ్గింది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,700గా ఉండగా.. వెండి ధర కిలోకు రూ.600 వరకూ తగ్గింది. విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,660గా ఉంది. వెండి ధర కిలో రూ.71,700కు చేరింది.
వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,700ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,700గా ఉంది. కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గానే కొనసాగుతోంది.
ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
ఇక సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన మెటల్ అయిన ప్లాటినం ధర కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్లో ప్లాటినం ధర గ్రాముకు రూ.67 మేర తగ్గింది. హైదరాబాద్లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,100 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,100గానే ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)