Vinfast నుంచి మరో పెద్ద మూవ్ - ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఎంట్రీ ఇవ్వనున్నాయి!
Vinfast EV Scooters: వియత్నాం కంపెనీ విన్ఫాస్ట్, భారత్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం, మోడల్స్ ఎంపికపై అధ్యయనం కొనసాగుతోంది.

Vinfast Electric Scooters India Launch: వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు విన్ఫాస్ట్, 145 కోట్ల జనాభా ఉన్న భారతీయ మార్కెట్పై సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే VF7 & VF6 ఎలక్ట్రిక్ కార్లతో 2025లో భారత ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ కంపెనీ, ఇప్పుడు తదుపరి లక్ష్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ను ఎంచుకుంది. భారత స్కూటర్ మార్కెట్ ఎంత బలంగా ఉందో, ఎలక్ట్రిక్ డిమాండ్ ఎంత వేగంగా పెరుగుతోందో తెలుసుకున్న Vinfast, ఈ సెగ్మెంట్లోకి అడుగు పెట్టడానికి పూర్తిగా సిద్ధమవుతోంది.
2026 చివర్లో Vinfast ఎలక్ట్రిక్ స్కూటర్లు భారత్లోకి?
భారత మార్కెట్లోకి ఏ స్కూటర్లను తీసుకురావాలి? ఎలాంటి సెగ్మెంట్ను టార్గెట్ చేయాలి? అనే అంశాలపై Vinfast ప్రస్తుతం డీప్ స్టడీ చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత భారతీయ రోడ్ల పరిస్థితుల్లో టెస్టింగ్ జరగాల్సి ఉంటుంది. కనుక వాస్తవ లాంచ్ 2026 చివర్లో జరిగే అవకాశం బలంగా కనిపిస్తోంది.
వియత్నాంలో ఆరు స్కూటర్లు ప్రదర్శన - భారత్కు ఏవి వస్తాయి?
ఇటీవల, Vinfast, తమ వియత్నాం ఫెసిలిటీలో మీడియాకు ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్లను చూపించింది. అవి:
- Feliz
- Klara Neo
- Theon S
- Vero X
- Vento S
- Evo Grand
ప్రస్తుతం వీటి అన్ని స్పెసిఫికేషన్లు విన్ఫాస్ట్ వియత్నాం వెబ్సైట్లో ఉన్నాయి, కానీ భారత్కు వీటి నుంచి ఏవి వస్తాయన్నదిపై అధికారిక సమాచారం ఏదీ లేదు. కానీ బేసిక్గా చూస్తే ఇవి రేంజ్, డిజైన్, సిటీ రైడింగ్కు అనువుగా ఉండటం వల్ల భారతీయ యువతను, ముఖ్యంగా సిటీల్లో నివశించేవారిని బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది.
భారత మార్కెట్ను విన్ఫాస్ట్ ఎందుకు సీరియస్గా టార్గెట్ చేస్తోంది?
భారత్ ఇప్పుడు ప్రపంచంలోని వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లలో ఒకటి. Ola, Ather, TVS, Bajaj వంటి బ్రాండ్లు ఇప్పటికే భారీగా అమ్మకాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో విన్ఫాస్ట్ ఎంట్రీ ఇస్తే, వియత్నాం మార్కెట్లో అందించిన స్థాయి పనితీరును ఇక్కడ కూడా చూపించగలమని కంపెనీ నమ్ముతోంది.
₹16,000 కోట్లు పెట్టుబడి - తమిళనాడులో భారీ ప్లాంట్
విన్ఫాస్ట్ ఇప్పటికే భారత్లో $2 బిలియన్ (సుమారు ₹16,000 కోట్లు) పెట్టుబడిని ప్రకటించింది. దీనిలో మొదటి దశగా ₹500 మిలియన్ (సుమారు ₹4,000 కోట్లు)తో తమిళనాడులోని తూత్తుకుడిలో పెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్ను నిర్మిస్తోంది.
- ఈ ప్లాంట్ సామర్థ్యం సంవత్సరానికి 50,000 ఎలక్ట్రిక్ కార్లు
- తరువాత 1,50,000 యూనిట్ల వరకు పెంచే అవకాశం
ఈ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు స్కూటర్లు తయారు చేయడం కంపెనీకి పెద్ద సవాలు కాదు.
విన్ఫాస్ట్ స్కూటర్లు వస్తే మార్కెట్లో ఏం మారుతుంది?
భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఇప్పటికే కాంపిటీషన్ పీక్ లెవెల్లో ఉంది. దీంట్లోకి విన్ఫాస్ట్ కూడా దిగితే:
- మరింత పోటీ ధరలతో స్కూటర్లు రాన్చే అవకాశం
- అంతర్జాతీయ స్థాయి క్వాలిటీ ఫీచర్లతో కొత్త ఆప్షన్లు
- వియత్నాం డిజైన్ & బ్యాటరీ టెక్నాలజీ ప్రత్యేకతలు
- యువతకు మరింత స్టైలిష్ ప్రత్యామ్నాయాలు
మొత్తంగా చూస్తే, విన్ఫాస్ట్ ఎంట్రీతో మార్కెట్ డైనమిక్స్ మారే అవకాశమే ఎక్కువ. పోటీ పెరిగితే క్వాలిటీ పెరుగుతుంది, ధర తగ్గుతుంది. ఇది ప్రజలకు మేలు చేస్తుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.





















