శాశ్వత ఉద్యోగాలకు బదులుగా బాధితులకు తాత్కాలిక నియామక పత్రాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ జూలై 21కి వాయిదా పడింది.
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు తాత్కాలిక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని మదురై హైకోర్టు శాఖ ఆదేశించింది.

- కరూర్ తొక్కిసలాట బాధితులకు శాశ్వత ఉద్యోగాలు ఇవ్వరాదని హైకోర్టు తెలిపింది.
- ముఖ్యమంత్రి 32 కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి సిద్ధమయ్యారు.
- గత సెప్టెంబర్ ప్రమాదంలో మరణించినవారికి ప్రభుత్వ ఉద్యోగాలు హామీ ఇచ్చారు.
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో చెన్నై హైకోర్టు మదురై బ్రాంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు బాధితులకు శాశ్వత ఉద్యోగాలు ఇవ్వొద్దని తాత్కాలి నియామక పత్రాలు అందజేయాలని స్పష్టం చేసింది. అనంతరం కేసును వాయిదా వేసింది. గత సంవత్సరం సెప్టెంబర్లో టీవీకే చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ కరూర్లో ప్రచారం చేశారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దీని తరువాత, తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షలు, టీవీకే రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించాయి. ఈ పరిస్థితుల్లో టీవీకే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించగా, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత, కరూర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
కరూర్ - 32 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
కరూర్లో జరిగే ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఇవాళ ముఖ్యమంత్రి విజయ్ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో, కరూర్ తొక్కిసలాటలో మరణించిన 32 కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నారు. వారికి నియామక పత్రాలు అందజేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇలా ఉద్యోగాలు ఇవ్వడాన్ని పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై మదురై హైకోర్టు శాఖలో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ కూడా ఇవాళే విచారణకు వచ్చింది. రాజకీయా పార్టీ తొక్కిసలాటలో చనిపోయిన వారికి కారుణ్య ఉద్యోగాలు కల్పించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్లు వాదించారు.
తాత్కాలిక ఉత్తర్వులు
దీనికి ప్రతిస్పందనగా తూత్తుకుడి స్టీల్ మిల్లు ఘటనలో మరణించిన వారికి శాశ్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం తెలిపింది. దీని తరువాత, ప్రభుత్వ విధాన నిర్ణయంలో న్యాయమూర్తులు జోక్యం చేసుకోలేరని వాదించారు. నియామక కార్యక్రమం ఇవాళ జరుగుతుందని కోర్టుకు వివరించారు. అయితే, నియామకాన్ని తాత్కాలికంగా జారీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు నిర్ణయం మేరకు తర్వాత నియామక ప్రక్రియ ఉంటుందని చెప్పారు. అనంతం కేసు విచారణను జూలై 21కి వాయిదా వేశారు. న్యాయమూర్తి సుమోటోగా ఈ కేసులో టీఎన్పీఎస్సీని కూడా ఈ కేసులో చేర్చారు.
Frequently Asked Questions
కరూర్ తొక్కిసలాట కేసులో హైకోర్టు తాజా ఆదేశాలు ఏమిటి?
కరూర్ తొక్కిసలాట ఘటన ఎప్పుడు జరిగింది?
గత సంవత్సరం సెప్టెంబర్లో ముఖ్యమంత్రి విజయ్ కరూర్లో ప్రచారం చేస్తున్నప్పుడు ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది మరణించారు.
తొక్కిసలాట బాధితులకు ఎంత ఆర్థిక సహాయం అందించారు?
ఘటన తరువాత, తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షలు, టీవీకే రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించాయి.
కరూర్ తొక్కిసలాట కేసులో టీఎన్పీఎస్సీ పాత్ర ఏమిటి?
న్యాయమూర్తి సుమోటోగా ఈ కేసులో టీఎన్పీఎస్సీని కూడా చేర్చారు. కోర్టు నిర్ణయం మేరకు తదుపరి నియామక ప్రక్రియ ఉంటుందని చెప్పారు.
ట్రెండింగ్ వార్తలు






















