అన్వేషించండి

Next-Gen Lexus ES India: లగ్జరీ కార్ లవర్స్‌కు గుడ్ న్యూస్: ఇండియాలో లాంచ్ కాబోతున్న లెక్సస్ ఇఎస్ సెడాన్!

Next-Gen Lexus ES India: జపనీస్ లగ్జరీ బ్రాండ్ లెక్సస్, తన ఎనిమిదవ తరం ఇఎస్ (ES) సెడాన్‌ను ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. సరికొత్త డిజైన్, హైబ్రిడ్ ఇంజిన్‌తో ఇది రానుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • లెక్సస్ సరికొత్త ఎనిమిదవ తరం ES సెడాన్‌ను భారతదేశంలో విడుదల చేస్తోంది.
  • కొత్త ES షార్ప్ డిజైన్, Z-ఆకారపు LED DRLలతో స్టైలిష్‌గా ఉంటుంది.
  • 14-అంగుళాల టచ్‌స్క్రీన్, ADAS వంటి హైటెక్ ఫీచర్లతో లగ్జరీ ఇంటీరియర్.
  • ES 300h హైబ్రిడ్ 215 hp పవర్, 22.37 km/l మైలేజీ అందిస్తుంది.

Next-Gen Lexus ES India: ప్రముఖ జపనీస్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ (Lexus), భారత మార్కెట్లోకి తన సరికొత్త జనరేషన్ 'ఇఎస్' (ES) సెడాన్‌ను శుక్రవారం విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో 2025 ఏప్రిల్‌లో గ్లోబల్ డెబ్యూ చేసిన ఈ కారు, ఇప్పుడు ఎనిమిదవ తరం మోడల్‌గా ఇండియాలోకి అడుగుపెడుతోంది. మన దేశంలో దీనిని సీబీయూ(CBU) యూనిట్‌గా అసెంబ్లీ చేసి విక్రయించనున్నారు. అప్‌డేట్ చేసిన టీఎన్జీఏ- జీఏ-కే (TNGA GA-K) ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి రూపొందిన ఈ ప్రీమియం సెడాన్, లెక్సస్ లైనప్‌లోని ఎన్ఎక్స్, ఆర్ఎక్స్ మోడళ్ల సరసన చేరనుంది.

స్టైలిష్ ఎక్స్‌టీరియర్ డిజైన్

పాత మోడల్‌తో పోలిస్తే 2026 లెక్సస్ ఇఎస్ డిజైన్ చాలా షార్ప్‌గా ఉంది. ముందు భాగంలో జెడ్-షేప్ (Z-shaped) ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఆకట్టుకుంటున్నాయి. టర్న్ సిగ్నల్స్ వీటిలోనే కలిసిపోయి ఉంటాయి. వెర్టికల్ గ్లాస్ బ్లాక్ ట్రిమ్ ప్యానెల్స్ వెనుక హెడ్‌లైట్లను  అమర్చారు. బంపర్ కింద భాగంలో డైమండ్ ప్యాటర్న్ ఇన్‌సర్ట్‌లతో కూడిన కాంపాక్ట్ ఎయిర్ డ్యామ్ కనిపిస్తుంది. సైడ్ వ్యూలో కొత్త అలాయ్ వీల్స్, బాడీపై ఉండే క్రీజ్ లైన్లు కారుకు స్పోర్టీ వైబ్‌ను ఇస్తాయి. వెనుక వైపు 'LEXUS' అక్షరాలతో ఎల్‌ఈడీ లైట్ బార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

హైటెక్ ఇంటీరియర్, ఫీచర్లు

కారు లోపలి భాగం చాలా నీట్‌గా, లగ్జరీగా ఉంటుంది. సెంటర్ డాష్‌బోర్డ్‌లో 14 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణ. బ్రాండ్ లోగోతో కూడిన త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ డ్రైవింగ్ అనుభవాన్ని పెంచుతుంది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), బాస్ మోడ్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వెనక్కి వాలిపోయే రిక్లైనింగ్ రియర్ సీట్లు వంటి ప్రీమియం సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. లగ్జరీని కోరుకునే వారికి ఈ ఇంటీరియర్ ఒక స్వర్గంలా అనిపిస్తుంది.

పవర్‌ట్రైన్, పర్ఫార్మెన్స్

భారత మార్కెట్లోకి లెక్సస్ ఇఎస్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇఎస్ 300హెచ్ (ES 300h) మోడల్‌ను ప్రవేశపెట్టవచ్చు. ఇందులో 2.5 లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేశారు. ఇది కలిపి సుమారు 215 హార్స్ పవర్ శక్తిని, 221 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ-సీవీటీ (e-CVT) గేర్‌బాక్స్ ద్వారా పవర్ ఫ్రంట్ వీల్స్‌కు చేరుతుంది. ఇది లీటరుకు 22.37 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని ఇస్తుంది. కేవలం 8.9 సెకన్లలోనే సున్నా నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. భారత మార్కెట్లో దీని ధర సుమారు రూ. 70 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు. ఇది మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Frequently Asked Questions

భారతదేశంలో కొత్త లెక్సస్ ES ఎప్పుడు విడుదల అవుతోంది?

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్, తన సరికొత్త జనరేషన్ ES సెడాన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 2025 ఏప్రిల్‌లో గ్లోబల్ డెబ్యూ చేసిన ఈ కారు, ఇప్పుడు ఎనిమిదవ తరం మోడల్‌గా ఇండియాలోకి అడుగుపెడుతోంది.

కొత్త లెక్సస్ ES డిజైన్ లో ఎటువంటి మార్పులు ఉన్నాయి?

పాత మోడల్‌తో పోలిస్తే 2026 లెక్సస్ ES డిజైన్ చాలా షార్ప్‌గా ఉంది. ముందు భాగంలో Z-ఆకారపు LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, వెనుక వైపు 'LEXUS' అక్షరాలతో LED లైట్ బార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొత్త అలాయ్ వీల్స్, బాడీపై ఉండే క్రీజ్ లైన్లు కారుకు స్పోర్టీ వైబ్‌ను ఇస్తాయి.

కొత్త లెక్సస్ ES లోపలి భాగం ఎలా ఉంటుంది?

కారు లోపలి భాగం చాలా నీట్‌గా, లగ్జరీగా ఉంటుంది. సెంటర్ డాష్‌బోర్డ్‌లో 14 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), వెనక్కి వాలిపోయే రిక్లైనింగ్ రియర్ సీట్లు వంటి ప్రీమియం సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

భారతదేశంలో లెక్సస్ ES ఏ పవర్ؚట్రైన్ؚతో రానుంది?

భారత మార్కెట్లోకి లెక్సస్ ES హైబ్రిడ్ పవర్ؚట్రైన్ؚతో వచ్చే అవకాశం ఉంది. ES 300h మోడల్‌ను ప్రవేశపెట్టవచ్చు, దీనిలో 2.5 లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ؚను ఎలక్ట్రిక్ మోటార్ؚతో జత చేశారు. ఇది సుమారు 215 హార్స్ పవర్ శక్తిని అందిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

టర్బో పెట్రోల్‌, ADASతో కొత్త Maruti Brezza - ఇంకొన్ని రోజుల్లో భారీ అప్‌డేట్‌తో ఎంట్రీ!
కొత్త కారు కొనేవాళ్లు కాస్త ఓపిక పట్టండి - మారుతి బ్రెజ్జా సరికొత్తగా వస్తోంది
డ్రైవింగ్‌ లైసెన్స్‌ నుంచి ఇన్సూరెన్స్‌ వరకు - ఎలక్ట్రిక్‌ బండి నడిపేందుకు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నిబంధనలు
తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ బండి నడపాలంటే ఎలాంటి డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి?
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
Maruti Suzuki YMC EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైనే! సరికొత్త మారుతి సుజుకి 7 సీటర్ ఈవీ ఫీచర్స్ ఇవే!
ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైనే! సరికొత్త మారుతి సుజుకి 7 సీటర్ ఈవీ ఫీచర్స్ ఇవే!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Kajal Aggarwal: కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
Embed widget