అన్వేషించండి

Government Approved EV Chargers: దేశవ్యాప్తంగా 4,874 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు - కేంద్ర ప్రభుత్వం భారీ నిధుల విడుదల

Government Approved EV Chargers:ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద దేశవ్యాప్తంగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి నిధులు కేటాయించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దేశవ్యాప్తంగా 4,874 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు కేంద్రం ఆమోదం.
  • పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద రూ. 503.86 కోట్లు కేటాయింపు.
  • కర్ణాటకకు అత్యధికంగా రూ. 123.26 కోట్లు, 1,243 ఛార్జర్లు మంజూరు.
  • పెట్రోల్ బంకుల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు త్వరలో అందుబాటులోకి వస్తాయి.

Government Approves 503 Crore For 4874 EV Chargers: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వాడకాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ఈ-డ్రైవ్ (PM E-Drive) పథకం కింద దేశవ్యాప్తంగా 4,874 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రూ. 503.86 కోట్ల విలువైన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి అత్యధికంగా రూ. 123.26 కోట్లు కేటాయించి, అక్కడ 1,243 ఛార్జర్లు ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి మే 12న ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనదారులకు ఛార్జింగ్ ఇబ్బందులు లేకుండా చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 

రాష్ట్రాల వారీగా ఛార్జింగ్ నెట్‌వర్క్..

ఈ ప్రతిపాదన ప్రకారం రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కేరళ, తెలంగాణ, కర్ణాటక ఇంకా తమిళనాడు వంటి పలు రాష్ట్రాల్లో ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్థాన్ పెట్రోలియం (HPCL), ఇండియన్ ఆయిల్ (IOCL) ఇంకా భారత్ పెట్రోలియం (BPCL) సంస్థలకు అప్పగించారు. ఈ చమురు సంస్థలకు చెందిన పెట్రోల్ బంకుల్లోనే కొత్త ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వాహనదారులు తమ ప్రయాణాల మధ్యలో ఛార్జింగ్ పెట్టుకోవడం చాలా సులభం అవుతుంది. ఈ ఛార్జర్లు టూ-వీలర్లు, త్రీ-వీలర్లు, కార్లతో పాటు బస్సులు ఇంకా ట్రక్కులకు కూడా సపోర్ట్ చేస్తాయి అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పీఎం ఈ-డ్రైవ్ బడ్జెట్ వివరాలు..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఈ-డ్రైవ్ పథకం మొత్తం బడ్జెట్ రూ. 10,900 కోట్లుగా ఉంది. ఇందులో కేవలం పబ్లిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే రూ. 2,000 కోట్లు కేటాయించడం విశేషం. మిగిలిన నిధులను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఇన్సెంటివ్స్ ఇచ్చేందుకు వాడుతారు. దాదాపు 24.79 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లు, 3.16 లక్షల త్రీ-వీలర్ల కొనుగోలుకు మద్దతుగా రూ. 3,679 కోట్లు డిమాండ్ ఇన్సెంటివ్స్ కింద ఇచ్చే అవకాశం ఉంది. అలాగే దేశవ్యాప్తంగా 14,028 ఎలక్ట్రిక్ బస్సుల పంపిణీ కోసం రూ. 4,391 కోట్లు కేటాయించారు. వాహన పరీక్షా సంస్థల ఆధునికీకరణ కోసం మరో రూ. 780 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోంది.

ఫేమ్ పథకం విజయవంతం..

గతంలో అమలు చేసిన ఫేమ్ (FAME) పథకం ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 8,932 ఈవీ ఛార్జర్లను చమురు సంస్థలు ఏర్పాటు చేశాయని కుమారస్వామి తెలిపారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రూ. 8,735 కోట్ల సబ్సిడీని విడుదల చేసింది. ఒక్క కర్ణాటకలోనే ఇప్పటివరకు 721 ఛార్జర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు పీఎం ఈ-డ్రైవ్ ద్వారా ఈ సంఖ్యను భారీగా పెంచబోతున్నారు. పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను నిర్మించడంలో ఈ ఛార్జింగ్ స్టేషన్లు కీలక పాత్ర పోషిస్తాయి. పెట్రోల్, డీజిల్ వాహనాలపై ఆధారపడటం తగ్గించి, ప్రజలు ఈవీల వైపు మొగ్గు చూపేలా ఈ నిర్ణయం ప్రోత్సహిస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ముఖ్యమైన ప్రాంతంలో ఛార్జింగ్ పాయింట్ ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

Frequently Asked Questions

దేశవ్యాప్తంగా ఎన్ని ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది?

దేశవ్యాప్తంగా 4,874 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ. 503.86 కోట్ల నిధులు కేటాయించారు.

పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ఏయే రాష్ట్రాల్లో ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు?

రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కేరళ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి పలు రాష్ట్రాల్లో ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు బాధ్యత ఏ సంస్థలకు అప్పగించారు?

ఈ ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్థాన్ పెట్రోలియం (HPCL), ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL) సంస్థలకు అప్పగించారు. ఈ చమురు సంస్థల పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తారు.

పీఎం ఈ-డ్రైవ్ పథకం మొత్తం బడ్జెట్ ఎంత?

పీఎం ఈ-డ్రైవ్ పథకం మొత్తం బడ్జెట్ రూ. 10,900 కోట్లు. ఇందులో రూ. 2,000 కోట్లు పబ్లిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే కేటాయించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bajaj Freedom 125: లక్ష రూపాయల లోపే సీఎన్జీ బైక్‌! ట్యాంక్ ఫుల్ చేస్తే 300 కిలోమీటర్లు చూడాల్సిన పని లేదు!
లక్ష రూపాయల లోపే సీఎన్జీ బైక్‌! ట్యాంక్ ఫుల్ చేస్తే 300 కిలోమీటర్లు చూడాల్సిన పని లేదు!
Aprilia Tuono 457 స్పెషల్ ఎడిషన్‌ లాంచ్‌ - 457cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో కొత్త అప్‌డేట్స్
జంటగా షికార్లు చేయడానికి Aprilia Tuono 457 స్పెషల్ ఎడిషన్‌ - కొత్త లుక్‌తో యూత్‌కు ఫుల్ కిక్!
బుకింగ్స్ ఓపెన్ చేయగానే హాట్ కేకుల్లా అమ్ముడైన Skoda Kodiaq RS - ధర ఎంత ఉండొచ్చు?
కేవలం 6 నిమిషాల్లోనే సేల్ అవుట్ - స్కోడా కొడియాక్ RSకు భారీ స్పందన!
ఐదేళ్లలో 1 లక్ష సేల్స్‌ దాటిన Skoda Kushaq - Creta, Grand Vitara కు పోటీగా పాపులారిటీ
ఏకంగా లక్ష మంది కొన్న మధ్యతరగతి SUV ఇది - Creta, Grand Vitara కు గట్టి పోటీ!
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Jonnagiri Gold Mines: తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో అసలేం జరిగింది? సీఐ నాగరాజు చేసిన తప్పిదాలివే
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో అసలేం జరిగింది? సీఐ నాగరాజు చేసిన తప్పిదాలివే
ఏపీలో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు మరో రెండేళ్లు..  చంద్రబాబు వ్యూహం ఏమిటి?
AP Employees retirement age increase | ఏపీలో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు మరో రెండేళ్లు..  చంద్రబాబు వ్యూహం ఏమిటి?
Muharram Holiday 2026: మొహర్రం సెలవు జూన్ 25 or 26? ఆషూరా తేదీ, ప్రభుత్వ సెలవు ఎప్పుడు?
మొహర్రం సెలవు జూన్ 25 or 26? ఆషూరా తేదీ, ప్రభుత్వ సెలవు ఎప్పుడు?
Telangana New CS: తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు! గతంలో ఇక్కడ పనిచేసిన ఐఏఎస్
తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు! గతంలో ఇక్కడ పనిచేసిన ఐఏఎస్
Cristiano Ronaldo Ignores Lionel Messi: మెస్సి పేరు వినగానే రొనాల్డోకు పెరిగిన బీపీ.. విలేకరిపై మొహం తిప్పేస్తూ లైవ్ లోనే షాకింగ్ రియాక్షన్ 
మెస్సి పేరు వినగానే రొనాల్డోకు పెరిగిన బీపీ.. విలేకరిపై మొహం తిప్పేస్తూ లైవ్ లోనే షాకింగ్ రియాక్షన్
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ.. ఇరాన్‌పై సైనిక చర్యను అడ్డుకుంటూ అమెరికా సెనేట్ తీర్మానం!
డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ.. ఇరాన్‌పై సైనిక చర్యను అడ్డుకుంటూ US సెనేట్ తీర్మానం
Magnesium Deficiency : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే
మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే
Embed widget