అన్వేషించండి

ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం

EV కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. PM E Drive సబ్సిడీ గడువును పొడిగించింది, అదనంగా రూ.1000 కోట్లు కేటాయించింది.

EV Subsidy Under PM E Drive Scheme: ఎలక్ట్రిక్ వాహనం (Electric Vehicle) కొనబోతున్నవాళ్లకు కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న పీఎం ఇ డ్రైవ్ పథకం (PM E Drive Scheme) కింద సబ్సిడీ గడువును పొడిగించింది. దీంతో ఈవీ కొనుగోలుదారులు మరికొంతకాలం పాటు ఈ ప్రయోజనాన్ని పొందుతారు.

గడువు ఎప్పటి వరకు పొడిగించారు?

పీఎం ఇ డ్రైవ్ పథకం కింద ఇచ్చే సబ్సిడీ గడువును 2028 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. పథకం అమలుకు అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ఉన్న ఫండ్‌కు ఈ అదనపు కేటాయింపు తోడవుతుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలును ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి పెట్టింది.

టూవీలర్లకు ఎంత సబ్సిడీ?

పీఎం ఇ డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా సబ్సిడీ లభిస్తుంది. ప్రతి కిలోవాట్ అవర్‌కు రూ.2,500 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుంది. ఒక వాహనానికి గరిష్ఠంగా రూ.5,000 వరకు సబ్సిడీ పొందవచ్చు. అయితే.. అన్ని ఎలక్ట్రిక్ టూవీలర్లకు ఈ ప్రయోజనం వర్తించదు. ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.50 లక్షలకు మించని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకే ఈ సబ్సిడీ వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి: మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?

గతంలో ఎంత ఉండేది?

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ సబ్సిడీ మరింత ఎక్కువగా ఉండేది. అప్పుడు ప్రతి కిలోవాట్ అవర్‌కు రూ.5,000 చొప్పున రాయితీ ఇచ్చారు. ఒక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనానికి గరిష్ఠంగా రూ.10,000 వరకు సబ్సిడీ లభించేది. ఇప్పుడు సబ్సిడీ మొత్తాన్ని తగ్గించినప్పటికీ, గడువు పొడిగింపు వల్ల ఈవీ కొనుగోలుదారులకు కొంత ఊరట లభించనుంది. ముఖ్యంగా, రూ.1.50 లక్షల ఎక్స్‌షోరూమ్ ధర మించని ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్ కొనాలని చూస్తున్న వారికి ఇది ఉపయోగపడుతుంది.

45.79 లక్షల వాహనాలకు లక్ష్యం

పీఎం ఇ డ్రైవ్ పథకం కింద మొత్తం 45,79,120 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ప్రయోజనం కల్పించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విభాగం కోసం మొత్తం రూ.2,767 కోట్లను కేటాయించింది. మొత్తం పీఎం ఇ డ్రైవ్ పథకానికి రూ.11,900 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం, దేశంలో విద్యుత్ వాహనాల మార్కెట్‌ను బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యాలు.

ఇది కూడా చదవండి: E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?

గడువు పొడిగింపునకు కారణం ఇదే

కేంద్ర ప్రభుత్వం 2024 సెప్టెంబర్‌లో పీఎం ఇ డ్రైవ్ పథకాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న గడువు 2027 మార్చి 31తో ముగియాల్సి ఉంది. అయితే ఈవీ రంగానికి మరింత ప్రోత్సాహం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సబ్సిడీ పథకాన్ని కొనసాగించాలని రాజ్యసభ స్టాండింగ్ కమిటీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖను కోరింది. దీంతో గడువు పొడిగింపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోవాలి. పథకానికి కేటాయించిన నిధులు, నిర్దేశిత గడువు కంటే ముందే అయిపోతే కొత్త క్లెయిమ్‌లను స్వీకరించరు. అంతేకాదు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీ క్లెయిమ్ చేసుకునేందుకు 2027 డిసెంబర్ 31ను చివరి తేదీగా నిర్ణయించారు. అందువల్ల, ఈవీ కొనాలని ప్లాన్ చేస్తున్నవాళ్లు అన్ని సబ్సిడీ నిబంధనలు & అర్హతలను ముందుగానే తెలుసుకోవడం మంచిది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం
Exter Sales Report: 27 కిలోమీటర్ల మైలేజీ ఇస్తూ తక్కువ ధరకే లభించే కారు గురించి తెలుసా? అందుకే జనం ఎగబడుతున్నారా?
27 కిలోమీటర్ల మైలేజీ ఇస్తూ తక్కువ ధరకే లభించే కారు గురించి తెలుసా? అందుకే జనం ఎగబడుతున్నారా?
Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget